మంగళవారం 21 జూన్ 2011

అందాలను అరువు తెచ్చుకుని వెండితెర మీద వెలిగిపోతున్న తారాతోరణం

 


వెండి తెర మీద వెలిగిపోతున్న సినీ తారలను చూచి 'అబ్బ... ఎంత అందంగా వున్నారు?!' అనుకుంటాం. అలా అంత అందంగా కనబడడానికి వారు తీసుకునే జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కావు. అవసరమైతే... మమోప్లాస్టీ, రినోప్లాస్టీ ... వంటివి చేయించుకుంటారు. ముక్కు లోపాలను సరిదిద్దడానికి రినోప్లాస్టీ చేస్తారు. అంటే ముక్కు బాగా పొడవుగా వుండడం........

సత్యసాయి బాబా ట్రస్టు సూత్రధారులెవరు?

సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టుకు సంబంధించిన రూ.35,53,000 నగదును తరలించడం వెనుక సూత్రధారులెవరన్నది చర్చనీయాంశమైంది. దీని వెనుక మరో కీలక వ్యక్తి ఉన్నారని పోలీసులు చెబుతున్నప్పటికీ అతడి పేరును బయటపెట్టేందుకు ఇష్టపడటం లేదు. డబ్బు పట్టుబడినప్పటి నుంచి పై స్థాయి నుంచి పోలీసులపై ఒత్తిళ్లు పెరగడంతో సూత్రధారి పేరును బయటపెట్టేందుకు వెనుకాడుతున్నారన్న ప్రచారం సాగుతోంది. డబ్బు తరలిస్తూ పట్టుబడిన సోహన్‌శెట్టి, ట్రస్టు......................

సత్యసాయి పుట్టిన రోజున విడుదల చేస్తాం


పుట్టపర్తి సత్యసాయి బాబా జీవిత కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ 'బాబా సాయిబాబా' చిత్రాన్ని రూపొందించ డానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి, పుట్టపర్తిలోని సత్యసాయి ట్రస్ట్‌ సభ్యుల్ని కలిసి, కొన్ని విషయాల్ని తెలుసుకోవాలని దర్శకుడు కోడిరామకృష్ణ భావించారు. అందుకోసం ట్రస్ట్‌ సభ్యులతో చర్చిండానికి దర్శకుడు కోడిరామకృష్ణ, నిర్మాత.............................


జైల్లోనూ రాచ మర్యాదలే!

ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి ప్రజా ధనాన్ని కొల్లగొట్టి జైలుకు వచ్చినా వారు తమ రాచఠీవిని, రాచ మర్యాదలను ఎక్కడా మర్చిపోలేదు. ఒకప్పుడు చిన్న పిల్లల జైలుగా వున్న తీహార్‌ జైలు ఇప్పుడు విఐపి స్థాయికెదిగింది. కామన్వెల్త్‌ క్రీడల నిర్వహణా మండలి మాజీ ఛైర్మన్‌ సురేష్‌ కల్మాడీ, 2జి కేసులో నిందితురాలైన డిఎంకె ఎంపి, కరుణానిధి కుమార్తె కణిమోజి ఇప్పుడు ఈ జైలుకు విశిష్ట అతిధులు (విఐపిలు). బయట వున్నపుడు తమకు సహజంగా లభించే రాచమర్యాదలనే వీరు ఇక్కడ కూడా అందుకుంటున్నారు. వివిధ జైళ్లలో వున్న విఐపిలకు ప్రత్యేక మర్యాదలు చేయాలని ఉన్నత స్థాయి అధికారుల నుండి తమకు ఆదేశాలు వచ్చినందునే.........................

నిజమే

తాము ఒక ఇంటిని ధ్వంసం చేసినట్లు నాటో అంగీకరించింది. ఆ ఇంటిపై నాటో జరిపిన దాడిలో తొమ్మిది మంది పౌరులు మరణించినట్లు లిబియా అధికారులు చెప్పారు. లిబియాలో తన మిషన్‌పై ఆ కూటమిలో అంతర్గతంగా కొత్త అనుమానాలకు ఈ సంఘటన బీజం వేసింది. నాటో బాంబు దాడుల్లో అనేక మంది పౌరులు మరణిస్తున్నారనడానికి ఇది స్పష్టమైన తార్కాణంగా ఉంది. ఆశించిన దాని కంటే ఎక్కువ సమయం, వనరులు తీసుకుంటున్నట్లు ఇప్పటికే నాటో మిత్ర.......................

టీవీ చూస్తే వినోదం కాదు వ్యాధులొస్తాయి..?

మనం టీవీ ఎందుకు చూస్తాం. వినోదం కోసం. వార్తా విశేషాల కోసం. పిల్లలైతే కార్టూన్‌ షోలు, పిల్లల కార్యక్రమాలకు అంకితమవుతారు. ఇక మహిళలైతే గాలి లేకుండా బతగ్గలరు కానీ సీరియల్స్‌ లేకుండా ఉండలేరు. ఇది ప్రస్తుతమున్న పరిస్థితి. అందరికీ ఒక షాకింగ్‌ న్యూస్‌.. రోజూ రెండు గంటల కన్నా ఎక్కువ సమయం టీవీ చూస్తే టైప్‌-2 మధుమేహం, గుండె రక్తనాళాల జబ్బు వచ్చే ప్రమాదం అధికమని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అధ్యయనం వెల్లడించింది. అంతేకాదు.......................

నేడు పగటి పొద్దు ఎక్కువ

గ్రహాల భ్రమణ, పరిభ్రమణ క్రమంలో చోటు చేసుకునే మార్పుల కారణంగా మంగళవారం పగటి పొద్దు ఎక్కువగా ఉండనుంది. ఈ ఏడాదిలో పగటి సమయం ఎక్కవగా ఉన్న రోజుగా మంగళవారం నిలుస్తుంది. వేసవి అనంతరం సంభవించే ఈ పరిణామాన్ని 'సమ్మర్‌ సొలిస్టిస్‌'గా ఖగోళ శాస్త్రవేత్తలు వ్యవహరిస్తారు. ఇందులో సొలిస్టిర్‌ అనే పదం సోల్‌ (సూర్యుడు) సిస్టిర్‌...........................

కోట్ల డాలర్ల గల్లంతు

2003 దురాక్రమణ అనంతరం ఇరాక్‌ అభివృద్ధి నిధి (డిఎఫ్‌ఐ) నుంచి తీసుకున్న ఇరాక్‌ చమురు డబ్బు గల్లంతైనట్లు ఆ దేశ పార్లమెంటు వెల్లడించింది. ఆ డబ్బును సద్దాం హుస్సేన్‌ను కూల్చివేసిన అనంతరం పునర్నిర్మాణానికి ఉపయోగించేందుకు అమెరికా నుంచి తెచ్చినట్లు పార్లమెంటరీ కమిటీ వెల్లడించింది. ఆ డబ్బు ఎక్కడికి పోయిందో కనుగొనేందుకు ఐరాస సాయం కోరింది. 2004లో ఇరాక్‌ అభివృద్ధి నిధి నుంచి తీసుకున్న చమురు డబ్బును కనుగొనేందుకు సహాయం చేయాలని .......

మాస్టారి పాఠాలు ...