బుధవారం 18 మే 2011

వచ్చారు.. విన్నారు.. వెళ్ళారు

ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు ఎలాంటి సూచనలు ఇవ్వకుండానే రెండురోజుల పర్యటనను ముగించుకుని మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్ళారు. పార్టీ బలోపేతం కంటే ఎవరి వాదనలు వారు వినిపించడానికే నేతలు ప్రాధాన్యత ఇచ్చారు. ఫిర్యాదులు, విజ్ఞప్తులు, సూచనలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే తెలంగాణాలో పార్టీ మనుగడ కష్టమవుతుందని తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌ నేతలు చెప్పుగా, రాష్ట్రాన్ని చీల్చితే రెండు ప్రాంతాల్లోనూ పార్టీ నష్టపోతుందని సీమాంధ్ర నేతలు అన్నారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదంటూ ఆయన జిల్లాకే చెందిన ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కూతుహలమ్మలు ఫిర్యాదు చేస్తూ లేఖలు ఇచ్చారు............

'ది బిజినెస్‌మేన్‌' 'గన్స్‌ డోన్ట్‌ నీడ్‌ అగ్రిమెంట్స్‌'

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు 'ది బిజినెస్‌మేన్‌'గా కనిపించబోతున్నాడు. ఇంతకు ముందు చూపిన 'పోకిరి' అఖండ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈసారి క్లాస్‌గా బిజినెస్‌మేన్‌ కథను చూపించనున్నారు. ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌ పతాకంపై అగ్రనిర్మాత వెంకట్‌ నిర్మిస్తున్నారు. జూలైలో ప్రారంభమై ఆగస్ట్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటుంది...........................

సీట్లు తగ్గినా ఓటింగ్‌ బలం పదిలం

సుమారు 41 శాతం ఓట్లు ఉన్న లెఫ్ట్‌ ఫ్రంట్‌ మునుపెన్నడూ లేని రీతిలో అత్యంత తక్కువ సీట్లు పొందింది. వాస్తవానికి 2009తో పోలిస్తే ఈ ఎన్నికల్లో 11 లక్షల మంది కొత్త ఓటర్లు దానికి ఓటు వేశారు. 2006 ఎన్నికల్లో వామపక్షాలు ఒక కోటీ 98 లక్షల ఓట్లు పొంది 294 స్థానాల శాసనసభలో 235 స్థానాలు గెలుచుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఒక కోటీ 96 లక్షల ఓట్లు పొంది 61 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగాయి.................

దావూద్‌ సోదరుడిపై కాల్పులు

వినయం...రాక్షసత్వం...వీర

గూగుల్‌ 'క్రోమ్'‌