.

31, మే 2011, మంగళవారం

అన్నిరకాల పాత్రలూ చేయాలన్నది తనయుడి కోరిక

పనిలో కునుకు

సిగార్‌తో బిగ్‌బి

ధూమపానం ప్రాణాలను ఊదేస్తుంది

ధూమపాన వ్యసనం ఉన్నవారికి అదొక యాంత్రికమైన అలవాటుగా మారిపోతుంది. ఈ వ్యసనాన్ని వదిలించుకోవటం తమకు అసాధ్యమని భావిస్తారు. నిజంగానే అసాధ్యమో కాదో కూడా వారు ఏనాడు సమీక్షించుకుని ఉండరు. ఎందుకంటే అసాధ్యమన్న అభిప్రాయాన్ని వారు అంత ప్రగాఢంగా నమ్ముతారు. ఒక రోజు ధూమపానం చేయకుండా ఉంటే ఎదురయ్యే శారీరక ఇబ్బందులు ఈ విశ్వాసాన్ని మరింత పెంచుతాయి. అలాంటి అభిప్రాయాలకు బందీకాకుండా కొన్నాళ్లు సిగరెట్‌ తాగకుండా ఉండగలిగితే అతిత్వరలోనే ధూమపానం నుంచి విముక్తి కాగలరు. చాలాకాలంపాటు ధూమపానానికి అలవాటుపడి ఉండటం వల్ల ఒక్కసారి మానేసినప్పుడు శారీరకంగా కొంత.......................................

ఏడు దశాబ్దాల హైదరాబాద్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌


చలనచిత్ర వాణిజ్యానికి సంబంధించి, హైదరాబాద్‌లో ఫిల్మ్‌ ఛాంబర్‌ ఏర్పాటు ఓ పెద్ద చారిత్రక ఘటన. ఇప్పటికి సరిగ్గా 70 ఏళ్ళ క్రితం ఆ సంఘటన జరిగింది. ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని, ఎదిగింది. ఏడో దశాబ్దంలోకి గడచిన ఏడు పదుల ఏళ్ళుగా 'హైదరాబాద్‌ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌' చేసిన సేవ, అసలు ఈ సంస్థ ఏర్పడడానికి కారణమైన పరిస్థితులు, అప్పటి ప్రభావాలు వగైరా చెప్పడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.............................................

వెనిజులాను గౌరవించాలి

వెనిజులా ప్రభుత్వ రంగ చమురు కంపెనీకి వ్యతిరేకంగా అమెరికా ఆంక్షలకు నిరసనగా ఆదివారం ఇక్కడి ప్లాజాకు వేలాది మంది ప్రభుత్వ మద్దతుదారులు ప్రదర్శనగా వచ్చారు. అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్‌ మద్దతుదారులు జరుపుతున్న ప్రదర్శనల్లో ఇది తాజాది. అందులో కేబినెట్‌ సభ్యులు, ఇతర ప్రభుత్వ సీనియర్‌ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ ప్రదర్శన ఆదివారం ఉదయం 11 గంటలకు.....................................

విక్రమ్‌కు ఇటలీ యూనివర్శిటీ డాక్టరేట్

విలక్షణ నటుడు 'చియాన్‌ విక్రమ్‌'కు ఇటలీలోని యూనివర్శిటీ ఆఫ్‌ పొపలర్‌ డెగ్లీ స్టడీ డి మిలానో(యుయుపిఎన్‌) డాక్టరేట్‌తో గౌరవించింది. ఇటలీలో 110 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యూనివర్శిటీ 'పీపుల్స్‌ యూనివర్శిటీ ఆఫ్‌ మిలన్‌' పేరుతో ప్రాముఖ్యత కలిగివుంది. ఫైన్‌ ఆర్ట్స్‌, యాక్టింగ్‌ విభాగంలో విక్రమ్‌కు గౌరవ డాక్టరేట్‌ అందజేశారు. ఈ సంధర్బంగా విక్రమ్‌....................

ఇల్లంతా బంగారం

బీహార్‌లో దారుణం

చికిత్స చేయడానికి వచ్చిన డాక్టర్‌ను ఖైదీలు తీవ్రంగా కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయిన సంఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటన గోపాల్‌గంజ్‌ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆటలమ్మ వ్యాధితో బాధపడుతున్న రంజన్‌ యాదవ్‌ అనే ఖైదీకి చికిత్స చేయడానికి డాక్టర్‌ బుద్ధదేవ్‌ సింగ్‌ ఆదివా

'బెజవాడ రౌడీలు' పేరు మార్చాల్సిందే

సినీ హీరో డా.రాజశేఖర్‌కు తీవ్ర గాయాలు

30, మే 2011, సోమవారం

మౌంట్‌ ఎలిజబెత్‌ హాస్పిటల్‌లో రజనీ

సీరియస్‌గా...కామెడీ చూపిస్తా...

హృదయాలను గెలిచిన గేల్‌

ఐపిఎల్‌-4 టోర్నీ ద్వారా ఎక్కువ మంది అభిమానుల మనసు దోచుకున్న క్రికెటర్‌ ఎవరంటే ఖచ్చితం ముందువరుసలో ఉండే పేరు విండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ది. బెంగళూరు జట్ట పరిస్థితి గేల్‌ రాకముందు వచ్చిన తరువాత అని చెప్పుకోవచ్చు. గేల్‌ జట్టులో చేరిన తరువాత ఒంటి చేత్తో జట్టుకు విజయాలనందించాడు. గేల్‌ 12 మ్యాచ్‌ల్లో 67.55 సగటు, 183.13 స్ట్రైక్‌ రేట్‌తో 608 పరుగులు చేశాడు. అందులో 56 ఫోర్లు, 44 సిక్సర్లతో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు చేశాడు. ఆరంభమ్యాచ్‌లో 107 పరుగులతో అదరగొట్టాడు. తన బ్యాటింగ్‌తో ఐపిఎల్‌కే వన్నే తెచ్చాడు...............................

ఎమెన్‌లో కుదిరిన శాంతి ఒప్పందం

దాదాపు ఐదు రోజులుగా కొనసాగుతున్న సాయుధ ఘర్షణలకు తెరదించేందుకు యెమెన్‌ అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే ఎట్టకేలకు అంగీకరించారు. ఈ మేరకు అధ్యక్షుడికి హషిద్‌ గిరిజన సమాఖ్య అధ్యక్షుడు షేక్‌ సాదిక్‌ అల్‌ అహ్మర్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. అధ్యక్షుడు సలే 33 ఏళ్ల పాలనకు తెరదించి దేశంలో ప్రజాస్వామిక సంస్కరణలు అమలు జరపాలని డిమాండ్‌ చేస్తూ మూడ్నెల్ల క్రితం ప్రారంభమైన నిరసన ప్రదర్శనలు చివరకు సాయుధఘర్షణలుగా మారాయి. ఈ తిరుగుబాటును రక్తపాతరహితంగా................................

కరుణైక కుటుంబం

జూన్‌ 17న...నగరం నిద్రపోతున్న వేళ

పదుగురికి మేలు చేసే పనులు అందరికీ తెలిసేట్టే చేస్తాం. కానీ చెడు పనులే ఎవరూ చూడలేని వేళ చేస్తాం. నిశిరాత్రి వేళలో అక్రమార్కుల అడుగుజాడల్ని పసిగట్టే అన్వేషణలో ఉంటుంది ఓ యువ పాత్రికేయురాలు. ఆమె అన్వేషణ ఫలిస్తుంది. ఆ అగంతకుల్ని పట్టుకుని చట్టానికి అప్పగిస్తుంది. అయితే ఇది అనుకున్నంత సులభంగా జరగలేదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. ఆ నేపథ్యంలో సాగే కథనం 'నగరం నిద్రపోతున్న వేళ'. ఛార్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రేమ్‌రాజ్‌ దర్శకుడు. నంది శ్రీహరి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. జూన్‌ 17న ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నారు..............................

సోనియా సలహాదార్లు అమ్ముడుపోయారు

కాజల్ ఫొటో గాలరీ


కంప్యూటర్‌ వేగం పెరగాలంటే


కంప్యూటర్‌లోని డేటా ఎప్పుడూ ఒక క్రమపద్ధతిలో సర్ది వుండాలి. అప్పుడే మనం అడిగిన డేటాను వెంటనే చూపుతుంది. ఉదాహరణకు వంటగదిలో పాత్రలు, వస్తువులు ఎక్కడబడితే అక్కడ పెట్టేస్తే అవసరానికి కావాల్సివి కనిపించవు. అదే వస్తువులను ఒక క్రమపద్ధతిలో సర్దుకుంటే ఇట్టే తీసుకోవడానికి అవకాశం వుంటుంది. అదేవిధంగా మన కంప్యూటర్లో..........

29, మే 2011, ఆదివారం

బికారిగా మారుతున్న మహరాజా..!

హరికృష్ణ అలక

విజయాల్లో కెప్టెన్లు కీలకం : షేన్‌ వార్నే

ఐపిఎల్‌ విజయాల్లో ఆయా జట్ల కెప్టెన్లు కీలకంగా నిలిచిన సంగతి ఇప్పటికే రుజువైంది. ఐపిఎల్‌ ఆరంభటోర్నీలో రాజస్థాన్‌ రాయల్స్‌ విజయం వెనుక ఆ జట్టు కెప్టెన్‌ షేన్‌ వార్నే ప్రోత్సహక నాయకత్వం ఉంది. యూసఫ్‌ పఠాన్‌, రవీంద్ర జడేజా, స్వప్నిల్‌ అస్నోధ్‌కర్‌, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ల నాయకత్వంలో ఐపిఎల్‌ 1లో అట్టడుగు స్థాయి నుంచి ఐపిఎల్‌-2లో అగ్రస్థానానికి డెక్కన్‌ ఛార్జర్స్‌ ఎదిగింది. ఇక.....

'ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డు ఇవ్వాలి'

నిప్పు మొదలైంది... రవితేజ

28, మే 2011, శనివారం

భారాలపై పోరుబాట పట్టాలి

యుపిఎ-2 ద్వితీయ వార్షికోత్సవం గొప్పగా జరుపుకోవడానికి మనకు మిగిల్చిందేమీ లేదు. త్వరలో ప్రజలపై పడనున్న భారాల మోతకు ఇది ముందస్తు హెచ్చరిక వంటిది. ముందస్తు హెచ్చరిక ముందస్తు జాగ్రత్త, అప్రమత్తతకు దారితియ్యాలి. ఇటువంటి చర్యలపై ప్రజలు సమిష్టిగా పోరాడాలి. ప్రజలు తమ హక్కులను ఏవిధంగా కాపాడుకుంటారు, మరింత మెరుగైన జీవనం కోసం ఏ విధమైన పోరాటాలు సాగిస్తారనే విషయాన్ని ఈ ప్రతిఘటన చాటిచెబుతుంది...................

100 శాతం...ఉత్సాహాన్నిచ్చింది

కొత్తదనం చూపాలన్నదే నా ప్రయత్నం : కాజల్‌


 

తెలుగు తెరపై దూసుకుపోతున్న ఉత్తరాది భామ కాజల్‌. మొన్న బృందావనం, నిన్న మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, నేడు వీర. ఇలా ఒకే సీజన్‌లో మూడు హిట్స్‌ నమోదు చేసుకొని, అభిమాన నీరాజనం అందుకుంటోంది. అయితే నెంబర్‌వన్‌, టూ...అనే వరుసపై తనకు ఆసక్తి లేదని, భిన్నమైన పాత్ర చేయటమే ఆనందాన్నిస్తుందని అంటోంది. కాజల్‌ ఇంకా ఏమందంటే...

27, మే 2011, శుక్రవారం

కట... కటా!

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకి తీసికట్టుగా మారుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థికసంవత్సరపు తొలి త్రైమాసికంలోనే ట్రెజరీ చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను విధించింది. ఉద్యోగుల జీతాలు, ఫించన్లు మినహా అన్ని రకాల ఇతర చెల్లింపులను నిలిపివేయాలని ప్రభుత్వం ట్రెజరీ అధికారులకు గురువారం మౌఖిక......

2013 కల్లా 5లక్షల గ్రామాలకు నెట్‌





 
వచ్చే రెండేళ్లలో ఐదు లక్షల గ్రామాలకు బ్రాడ్‌బాండ్‌ ఇంటర్‌నెట్‌ కనెక్షన్లను విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని టెలికాంశాఖ మంత్రి కపిల్‌సిబాల్‌ వెల్లడించారు. గురువారం పైబర్‌ టు హోమ్‌ (ఎఫ్‌టిటిహెచ్‌) కాన్ఫరెన్స్‌లో పాల్గొని అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నేషనల్‌ అప్టికల్‌ పైబర్‌ నెట్‌వర్క్‌ (ఎన్‌ఒఎఫ్‌ఎన్‌) ద్వారా..........

ఎమెన్‌లో అంతర్యుద్ధం ?

ఎమెన్‌ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేV్‌ాను తొలగించేందుకు జరుగుతున్న పోరాటం అంతర్యుద్ధం రూపం తీసుకుంటున్న ప్రమాదాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుఝామున రాజధాని సనా భారీ పేలుళ్ళతో దద్దరిల్లింది. అంతర్గత వ్యవహారాల శాఖ సహా ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకొనేందుకు ఆ దేశంలోని శక్తివంతమైన గిరిజన నేత సాదిక్‌ అల్‌ అహ్మర్‌కు చెందిన పోరాటవాదులు ఉత్తర సనాలో సోమవారం నుంచి చేస్తున్న ప్రయత్నాల్లో దాదాపు 40 మంది మరణించారు. 'పేలుళ్ళు సనా దక్షిణ ప్రాంతం నుంచి విన్పించాయి........................

విద్యుత్‌ విధానం ప్రకటించాలి

రాష్ట్రంలో విద్యుత్‌ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని, మర్చంట్‌ పవర్‌ ప్లాంట్లు, అణు విద్యుత్‌ ప్రాజెక్టులను రద్దు చేయాలని, ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని శ్రీకాకుళంలో గురువారం నిర్వహించిన వామపక్ష పార్టీల సదస్సు డిమాండ్‌ చేసింది. సదస్సుకు వామపక్ష జిల్లా నేతలు అధ్యక్షత వహించారు...................

ఆసక్తి, సామర్థ్యం ఉన్న కోర్సు...ఎంపిక చేసుకోండి

పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పుడు...ఏ కోర్సు ఎంచుకోవాలి? ఏ సబ్జెక్టు తీసుకుంటే ఏయే ఉద్యోగాలలో ప్రవేశించవచ్చు? అనేవి...నేటి విద్యార్థుల్లో మొలకెత్తే ఆలోచనలు. తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, ఇతరత్రా తెలిసిన వారు 'ఈ కోర్సు బావుందట, ఈ కోర్సు తీసుకుంటే భవిష్యత్తు బావుంటుంది' అని ఎన్నో చెబుతుంటారు. ఎవరికి తోచిన సలహాలు, సూచనల ఇస్తారు. అందులో మనకు అనుకూలమైంది, ఆసక్తి, అభిరుచి ఉన్న సబ్జెక్టు వైపు దృష్టి సారించాలి. సైన్స్‌ తీసుకోవాలా, కామర్స్‌ వైపు వెళ్లాలా అన్న సందిగ్ధంలో అనేక మంది విద్యార్థులు ఉంటారు. అలాంటి వారు పరిశీలించాల్సిన కొన్ని అంశాల్ని ఇక్కడ ఇస్తున్నాం. పరిశీలించండి.......

'వీర' ప్లాటినం డిస్క్‌

యుఎస్‌ బెదిరిస్తోంది : అసాంజే

కొరియాలో అమెరికా సేనల దుర్మార్గం

ఏజెంట్‌ ఆరెంజ్‌ పూడ్చివేతకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు యుఎస్‌ఎఫ్‌కె (యునైటెడ్‌ స్టేట్స్‌ ఫోర్సెస్‌ కొరియా) రసాయనానికి సంబంధించిన వివాదం వెలికి వచ్చింది. కొరియాలోని గ్యెయోంగీ రాష్ట్రంలోని బుచెయాన్‌లో అమెరికా సైనిక స్థావరం వద్ద పెద్ద ఎత్తున రసాయనాలను పూడ్చి పెట్టినట్లు అమెరికా రిటైర్డ్‌ సైనికాధికారి ఒకరు ఆలస్యంగా గత సోమవారం వెల్లడించారు. ఉత్తర గ్యెయోంగ్‌సాంగ్‌ రాష్ట్రంలో చిల్గోక్‌లో..........

26, మే 2011, గురువారం

తెలుగు సినిమా వాగనుశాసనుడు

నన్ను అక్రమంగా బంధించారు : అరెస్ట్‌పై భారత దౌత్యవేత్త కుమార్తె * న్యూయార్క్‌ నగరపాలక సంస్థపై 15 లక్షల డాలర్లకు దావా

క్లాస్‌ టీచర్‌కు అసభ్య ఇ-మెయిల్‌ సందేశాలు పంపిన ఆరోపణలపై తనను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ న్యూయార్క్‌ నగరపాలక సంస్థపై భారత దౌత్యవేత్త కుమార్తె ఒకరు 15 లక్షల డాలర్లకు పరువు నష్టం దావా వేశారు. తనను అధికారులు జైలులో అవమానించారని మన్‌హట్టన్‌లోని భారత కన్సలేట్‌లోని ఉన్నతాధికారి దేవాశిశ్‌ విశ్వాస్‌ కుమార్తె కృతికా విశ్వాస్‌ ఈ దావాలో.......

వన్నె తగ్గిన ఐపిఎల్‌

అంతర్జాతీయ క్రికెట్‌ స్టార్‌ ఆటగాళ్ళు, బాలీవుడ్‌ గ్లామర్‌ కలగలసి అభిమానులకు కనువిందు చేస్తూ భారత మార్కెట్‌ను ప్రభావితం చేస్తూ 2008లో ప్రారంభమైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) టి20 ఫార్మాట్‌కు ఈ సంవత్సరం వన్నె తగ్గింది. టివి రేటింగ్స్‌ గత సంవత్సరం కంటే దారుణంగా పడిపోయాయి. ప్రపంచకప్‌ ముగిసిన..............

ఐఐటీ జెఇఇలో రాష్ట్ర విద్యార్థుల జయభేరి

ఐఐటి, జెఇఇ - 2011 ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు జయభేరి మోగించారు. అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకును పృథ్వీరాజ్‌తేజ సొంతం చేసుకున్నారు. దాంతో పాటు మొదటి పదిలో ఆరు ర్యాంకులు రాష్ట్ర విద్యార్థులు కైవసం చేసుకున్నారు. వందలోపులో 40 ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఎన్నడూలేని విధంగా ఈ సారి రాష్ట్రం నుండి అత్యధిక స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌....................................

అలెండీ మృతదేహం వెలికితీత

కుట్ర ద్వారా తొలగించబడిన చిలీ అధ్యక్షుడు సాల్వెడార్‌ అలెండీది ఆత్మహత్యా లేక 1973 సైనిక కుట్రలో ఆయన్ని హత్య చేశారా అనే అంశాన్ని నిర్ధారించేందుకు సమాధి నుంచి అవశేషాలను వెలికి తీశారు. అలెండీ కుటుంబ విజ్ఞాపన, దీనిపై దర్యాప్తు జరుపుతున్న న్యాయమూర్తి మారయో కర్రోజా ఆదేశం మేరకు ఆయన అవశేషాలపై అంతర్జాతీయ ఫోరెన్సిక్‌ పాథాలజీ నిపుణుల బృందం అధ్యయనం జరపనుంది. ఏడుగురు అంతర్జాతీయ నిపుణులు, ఐదుగురు చిలీ నిపుణులు అలెండీ మృతదేహాన్ని వెలికితీశారు. ఆ సమయంలో అలెండీ కుటుంబం, కొద్ది..........................

పెట్రోలియం ఉత్పత్తులు .. సాంకేతిక, సామాజిక కోణాలు..

ఉత్పత్తి ఖర్చుతో నిమిత్తం లేకుండా అడ్డగోలు లాభాలతో నేడు అమ్మబడుతున్న వస్తువులేమైనా ఉన్నాయంటే వీటిలో మొదటి స్థానం పెట్రోలియం ఉత్పత్తులదనే చెప్పాలి. ముడి చమురు ఉత్పత్తి, రవాణా, అమ్మకాలపై మార్కెట్‌వర్గాలకున్న పట్టు, ఆధునిక రవాణా అవసరాలను తీర్చుకోవడానికి అనివార్యంగా, విరివిగా వాడాల్సిన పెట్రోలియం ఉత్పత్తులే ఈ దుస్థితికి కారణం. మార్కెట్‌ ఆధిపత్య వ్యవస్థలో కొనసాగుతున్న, కొనసాగగల అకృత్యాలను అర్థంచేసుకోడానికి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, వినియోగ ధోరణుల అధ్యయనమే మార్గం. అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లలో పెట్రోలియం ఉత్పత్తుల అడ్డగోలు ధరల సరళి ఈ విషయాల్నే నిర్ధారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, పెట్రోలియం ఉత్పత్తులలో ఇమిడి ఉన్న సాంకేతిక, సామాజిక కోణాలను రేఖామాత్రంగా వివరిస్తూ.. ఈ వారం మీ ముందుకొచ్చింది 'విజ్ఞానవీచిక'.....................

ఆగిపోయిందన్న వార్త నిజం కాదు '

విలన్‌ కావాలనుకొనేవాణ్ణి

'నాటి జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి'

25, మే 2011, బుధవారం

లైసెన్స్‌డ్‌ టు కిల్‌

శునకంతో పెళ్లి

రవితేజతో నిప్పు పుట్టిస్తా : వైవియస్‌.చౌదరి

రెండేళ్లు.. ఐదు ఎన్నికలు

వాస్తవానికి డిఎంకె ప్రస్తుతం యుపిఎను విడిచిపెట్టే పరిస్థితిలో లేదు. 2జి కుంభకోణం నేపథ్యంలో ఆ పార్టీనిప్పుడు సర్వ భ్రష్టత్వం ఆవరించింది. ఈ స్థితిలో కేంద్ర మంత్రివర్గంలో కొనసాగడం ద్వారా లభించే అధికార అండే అ పార్టీకి ఆశాదీపంలా మారింది. తమిళనాట జయలలిత ప్రభుత్వం నుండి తమను తాము రక్షించుకోవడానికి ఆ పార్టీ నేతలకు యుపిఎను మించిన రక్షణ కవచం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో డిఎంకె తనంతట తాను ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించే పరిస్థితి సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు.......................

జూన్‌లో సెగ

మానవాళికి మహావిపత్తు

తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్‌లో ఉండను

తీహార్‌ జైలులో కుమార్తెను కలిసిన కరుణానిధి

24, మే 2011, మంగళవారం

ఉప్పందించింది లాడెన్‌ చిన్న భార్యే?

ఒసామా బిన్‌ లాడెన్‌ అబొత్తాబాద్‌ స్థావరంలో అమెరికాకు ఒక గూఢచారి ఉన్నట్లు, ఆ మార్గం ద్వారానే ఆయన అక్కడున్న విషయాన్ని కనుగొన్నట్లు పాకిస్తాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి రెహ్మాన్‌ మాలిక్‌ విశ్వసిస్తున్నారని ఆదివారం మీడియాలో వార్తలొచ్చాయి. పది లక్షల డాలర్ల ఆ భవనం లోపల ఒసామా ఉన్నారనడానికి సంబంధించి.......

బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం

తెలుగు సాహిత్యంలో ఆంధ్ర ప్రజల ఆచార వ్యవహారాలు, ఆటపాటలు మొదలైన విషయాలు చాలా తక్కువగా వున్న కాలంలో ఆంధ్రుల జీవన గమనంలో వున్న సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వారి సాంస్కృతిక జీవనంలోని ప్రత్యేకతలు మొట్టమొదట మనందరికీ స్పష్టంగా సమగ్రంగా తెలిపిన వారు సురవరం ప్రతాపరెడ్డి. ఈ గ్రంథం యొక్క ప్రత్యేకతయేమంటే రాజుల చరిత్ర వారి చుట్టూ అల్లుకున్న సంబంధాలు, భాషా సంస్కృతికి కాక ఆనాటి ప్రజల చరిత్రకు, వారి సాంఘిక జీవనానికి అద్దం పట్టడం, దానికి ప్రాధాన్యం ఇవ్వటమే ప్రత్యేకమైనదిగా పేర్కొనవచ్చు...................

అమెరికాలో తుపాను బీభత్సం మిస్సౌరీలో 89 మంది మృతి

అమెరికాలో మిస్సౌరీలోని జోప్లిన్‌ పట్టణాన్ని టార్నెడో (భయంకర తుపాను)తో 89 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇళ్ళు, వ్యాపార సంస్థలు నేలమట్టమయ్యాయని, దెబ్బతిన్న ఒక ఆస్పత్రిని ఖాళీ చేయించాల్సి వచ్చినట్లు జోప్లిన్‌ అధికారి మార్క్‌ రోహర్‌ చెప్పారు. విద్యుత్‌ తీగలు తెగిపోయాయి. టెలిఫోన్‌ సంబంధాలు దాదాపుగా నిలిచిపోయాయి. మారో మూడు మధ్య పశ్చిమ రాష్ట్రాలకు చెందిన నగరాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మిన్నెపోలిస్‌, మిన్నెసోటాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అమెరికా ఆగేయ ప్రాంతంలో ఏడు రాష్ట్రాల్లో..............

అవార్డుల కోసం కాదు, అభినయం కోసమే..!

అభినయం కోసం ఆరాటపడే కథానాయకులు కొంతమందే ఉన్నారు. అందులో...భారీ కలెక్షన్స్‌ వస్తాయని, అవార్డులిస్తారని అనే ఆశల్లో తేలకుండా ఆకర్షణీయమైన కథ కోసం పనిచేసే హీరోలు అతికొద్దిమందే. ఈ జాబితాలో తమిళ నటుడు విక్రమ్‌కు చోటు కల్పించొచ్చు. మానసిక వికలాంగుడిగా మరో ప్రయోగాత్మక కథనాన్ని ఎంచుకున్నారు. 'నాన్న' అనే సినిమాను తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. మోహన్‌ నటరాజన్‌ దర్శకత్వం వహించాడు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హీరో విక్రమ్‌ మీడియాతో పలు విషయాలు పంచుకున్నారిలా...............

దేశం కోసం సంవత్సరంలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడడానికి ఇష్టపడతానానని భారత యువ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు

దేశం కోసం సంవత్సరంలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడడానికి ఇష్టపడతానానని భారత యువ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ పేర్కొన్నాడు. భారత జట్టు మితిమీరిని క్రికెట్‌ ఆడుతోందని, 2011 వన్డే ప్రపంచ కప్‌ తరువాత విరామం లేకుండా భారత క్రికెటర్లు ఐపిఎల్‌-4 మ్యాచ్‌లాడుతున్నారని, వారికి విశ్రాంతి అవసరమని డిమాండ్‌ వినిపిస్తున్న నేపధ్యంలో క్రికెటర్లకు విశ్రాంతి కావాలన్న అంశంపై తానేమీ వ్యాఖ్య చేయబోనని స్పష్టం చేశాడు.

23, మే 2011, సోమవారం

100 రోజులు 'ఉపాధి' దొరకడం లేదు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా ఉపాధి కల్పన మాత్రం వంద రోజులు కూడా లేద నిప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది.ీ చట్టం కింద పనుల అమలుపై ప్రపంచ బ్యాంకు అధ్యయనంలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఈ విధమైన చట్టం వినూత్నమైందని, ఇతర కార్యక్రమాలతో పోల్చితే దీనికి ప్రచారం కూడా ఎక్కువగా ఉందని చెప్పింది. అయితే ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేసే విషయంలో అసమానతలున్నాయని, నిధులు దుర్వినియోగమైనట్లు కొన్ని సాక్ష్యాలున్నాయని బ్యాంకు పేర్కొంది. మారుతున్న భారత్‌కు సామాజిక భద్రత పేరుతో.....................

'నిరసనలపై నిషేధం' ఉల్లంఘన

స్పెయిన్‌లో ప్రదర్శనలపై ఎన్నికలకు ముందు విధించిన నిషేధాన్ని ప్రజలు ఉల్లంఘించారు. నిరుద్యోగంపై నిరసన తెలుపుతూ వేలాది మంది శనివారం అర్ధరాత్రి దేశవ్యాప్తంగా మౌన ప్రదర్శన జరిపారు. ప్రభుత్వం అర్ధరాత్రి సమయంలో ప్రదర్శనల వద్ద అధికారులను మోహరించింది. అర్ధరాత్రి 12 గంటలు దాటి మరుసటి రోజులోకి ప్రవేశించగానే ప్రదర్శకులు నోటికి ప్లాస్టర్లు వేసుకొని మౌన ప్రదర్శన జరిపారు. తమకు చెప్పేందుకు చాలా ఉన్నాయని, అయితే మాట్లాడటంపై నిషేధం..................

జర్మనీలో కాంస్యయుగపు యుద్ధభూమి

కాంస్యయుగ ప్రారంభకాలంలో యుద్ధాలు జరిగిన భూమికి సంబంధించిన ఆనవాళ్లను జర్మనీలోని ఒక నది ఒడ్డున పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్కడ లభ్యమైన పుర్రెలు, ఎముకలు తదితర మానవ అవశేషాల ఆధారంగా కాంస్యయుగ ఆరంభకాలం విశేషాలను నిర్ధారించనున్నారు. ఇవన్నీ క్రీ.పూ. 1200 నాటివిగా వాటిని వెలికి తీసిన ఉత్తర జర్మనీలోని టోలెన్స్‌ వాలీ పురావస్తు విభాగం అధికారులు చెబుతున్నారు. ఇక్కడ లభ్యమైన కపా ళాలు,....................

సుకుమార్‌ దర్శకత్వంలో పవన్‌ సినిమా !

బుడ్డా...యాక్షన్‌ థ్రిల్లర్‌ !

22, మే 2011, ఆదివారం

కంగనకు కోపమొచ్చింది !

బజారుకెక్కిన మంత్రులు

పరిమళించిన పల్లె


పదిహేనేళ్ల క్రితం అదో సాదాసీదా గ్రామం. పేదరికం...కరువు...నీటి సమస్య... నిరక్షరాస్యత... చూద్దామన్నా కానరాని మరుగుదొడ్లు... మద్యపాన సేవనం... అనైక్యత... ఎవరికి వారే యమునా తీరే...చందంగా వుండేది. ఇదంతా తల రాత అని సరిపెట్టుకుని వుంటే ఎలా వుండేదో! కానీ ఆ గ్రామస్థులు అలా చేయలేదు. ఎవరికోసమో ఎదురుచూడకుండా .... తమ తల రాతలను తామే రాసుకోవాలనుకున్నారు. సంఘటితమయ్యారు. సాధించారు. పచ్చదనం, పరిశుభ్రత, రోడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, మద్యపాన నిషేధం, వంద శాతం అక్షరాస్యత, పొదుపు, పన్ను........................

బ్రహ్మిగాడి కథ

మాయా'రాజ్యంలో 'రక్షక'కావరం : అర్ధరాత్రి తలుపు చప్పుళ్లు - అభద్రతతో అతివలు

 'అర్థరాత్రి తలుపు మీద పడుతున్న లాఠీల ధ్వనులు మా గుండెల్లో ఆందోళన పెంచుతున్నాయి. ప్రతి క్షణం గండంగా గడుపుతున్నాం. పోలీసులు మమ్ముల్ని కనీసం మనుషుల్లా కూడా చూడటం లేదు. తలుపు తీస్తే చాలు ఇష్టమొచ్చినట్లు కొడుతున్నారు. చెప్పకోలేని విధంగా దుర్భాషలాడుతున్నారు. ఇళ్లలోని సామానంతా చిందరవందర చేస్తున్నారు. విలువైన వస్తువులను నాశనం చేస్తున్నారు. మాలో కొందరి ఇళ్లలో.............

21, మే 2011, శనివారం

లీకవుతున్న ఫేస్‌బుక్‌ వివరాలు

మీరు ఫేస్‌బుక్‌ వాడుతున్నారా..? మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ముఖ్యమైన సమాచారం వుంచుతున్నారా? అయితే మీ సమాచారం భద్రంగా వుందా? అర్జంట్‌గా సరిచూసుకోండి. ఒకవేళ మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ఏదైనా వ్యక్తిగత సమాచారం ఉంటే దాన్ని వెంటనే తొలగించి మరోచోట భద్రపరుచుకోవడం మంచిది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం కలిగిన సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌్‌ ఫేస్‌బుక్‌. ఆర్కుట్‌, హారుకుట్‌ వంటి ఎన్నో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లను వెనక్కు నెట్టి ప్రస్తుతం రెండో ఇంటర్నెట్‌గా అవతరిస్తున్న ఫేస్‌బుక్‌ సెక్యూరిటీ రిస్క్‌లో పడింది..................

పదో తరగతి పరీక్షా ఫలితాలు

గ్వాంటెనామో ఖైదీ ఆత్మహత్య!

క్యూబాలోని అమెరికా ఆక్రమిత గ్వాంటెనామో జైలులో ఆత్మహత్యగా భావిస్తున్న సంఘటనలో ఒక ఆఫ్ఘన్‌ ఖైదీ మరణించినట్లు అమెరికా సైన్యం తెలిపింది. అమెరికా 2002 నుంచి గ్వాంటెనామోకు ఖైదీలను పంపడం ప్రారంభించినప్పటి నుంచీ మరణించిన వారిలో ఇనయతుల్లా ఎనిమిదవ వ్యక్తి. జైలు గార్డులు బుధవారం రోజువారీ తనిఖీలు జరుపుతుండగా మరణించి ఉన్నట్లు కనుగొన్న ఆ ఖైదీని అల్‌ఖైదా సభ్యునిగా.............

ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు.?

ఇలాంటి వార్తలు మనకేం కొత్తకాదు. ఆయా వార్తలు చదవడం, చానళ్లలో 'వివరం'గా చూడటం ఓరకంగా అలవాటైపోయింది. మనసు ఘనీభవించి చాలాకాలమైంది. ప్రస్తుతం స్పందనే కరువైపోయింది. ఆ క్షణంలో అయ్యో అనుకోవడం... మరుక్షణంలో మరో పనిలో మునిగిపోవడం. అతివల అత్యాచారాలు, వేధింపులు, హత్యలు సహజాతిసహజంగా మారిపోయిన సమాజంలో నేడు మనం జీవిస్తున్నాం..................

తెలుగు చిత్రాలకు గుర్తింపు ఎందుకు తగ్గింది?

 


జాతీయ చలనచిత్ర వేదికపై దక్షిణాది సినిమా ప్రభంజనం సృష్టించింది. అయితే మనకంటే ఐదేళ్ళముందుండే తమిళ చిత్రాలకు, ఐదేళ్ళ వెనక్కుండే కన్నడ చిత్రాలకు అవార్డులు రావడం విశేషంగా ఇండిస్టీలో భావిస్తోంది. గత ఏడాది సాంకేతిక అభివృద్ధి విభాగంలో 'మగధీర'కు జాతీయస్థాయి అవార్డులు వచ్చాయనే ఆనందంకంటే ఈ ఏడాది అది కూడా లేదనే బాధ ఇండిస్టీలో నెలకొంది. ఏడాదికి వందకిపైగా చిత్రాలు...

అంతరిక్షంలో 'అనాధ' గ్రహాలు!

20, మే 2011, శుక్రవారం

సచిన్‌ అభినందనే పెద్ద అవార్డ్‌

'చదవమంటారని భయమేసేది' : అల్లరి నరేష్

రజనీకాంత్‌ క్షేమమే : లతా

సుపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు హిమొడయాలసిస్‌తో కూడిన అధునాతన చికిత్సనందించాల్సిన అవసరముందని ఆయన చికిత్స పొందుతున్న శ్రీ రామచంద్ర వైద్య కేంద్రం గురువారం ధ్రువీకరించింది. బుధవారం అర్థరాత్రి రజనీని ఐసియులోకి మార్చారన్న వార్త అభిమానుల్లో ఆందోళన రెకేత్తించిన నేపథ్యంలో అల్లుడు, నటుడు ధనుష్‌, ఆసుపత్రి కార్డియాక్‌ కేర్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఎస్‌ తనికాచలంలతో కలిసి రజనీ భార్య లతా.........

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 58వ ఉత్తమ జాతీయ అవార్డు

  చలనచిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే 58వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా కొడిగట్టిన దీపంలా మిగిలిపోయింది. దక్షిణాదిలో కోట్లాది రూపాయల భారీ బడ్జెటుతో అత్యధికంగా సినిమాలు నిర్మిస్తున్న తెలుగు పరిశ్రమ తెర వెనక్కి వెళ్లిపోయి వెల వెల పోయింది. విద్యా సంబంధమైన ఓ డాక్యుమెంటరీ చిత్రానికి మినహా ప్రధాన స్రవంతి కథా చిత్రాల్లో ఏ ఒక్క దానికీ ఏ విభాగంలోనూ పురస్కారం దక్కలేదు.........

ఉలిక్కిపడే చిత్రమవుతుంది : మంచు మనోజ్‌

19, మే 2011, గురువారం

పేరెంట్స్‌ ప్రోగ్రెస్‌


హ్యాపీడేస్‌ ఫేమ్‌ వంశీకృష్ణ, రుచికా బాబ్బర్‌ నాయికా నాయకులుగా రూపుదిద్దుకున్న చిత్రం 'పేరెంట్స్‌'. శేఖర్‌కమ్ముల శిష్యుడు ఆనంద్‌ రవి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే షూటింగ్‌ పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, వైవిధ్యభరిత చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఒక విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. వైజాగ్‌, హైదరాబాద్‌, అరకు, ముంబై, గోవాలలో షూటింగ్‌ జరిగింది. ఆరు పాటలకు వనమాలి సాహిత్యం సమకూర్చారు. ఎస్‌.కె. బాలచంద్రన్‌ సంగీతం.................

త్వరలో క్యూబా చమురు వెలికితీత

తమ దేశ ఈశాన్య తీరంలోని సముద్రంలో బావుల తవ్వకాన్ని ప్రారంభించనున్నట్లు క్యూబా ప్రకటించింది. చమురు డ్రిల్లింగ్‌ భద్రతపై ట్రినిడాడ్‌, టొబాగోలో జరిగిన అంతర్జాతీయ సమావేశం సందర్భంగా క్యూబా ఈ విషయాన్ని ఈనెల 12న ప్రకటించింది. అక్కడ లభ్యమయ్యే చమురు పరిమాణం చాలా ఎక్కువగానూ, ఎంతో నాణ్యతతోనూ ఉండవచ్చని భావిస్తున్నారు. అది ఆ సోషలిస్టు దేశ ఆర్థిక అవకాశాలను సమూలంగా మార్చే అవకాశాలున్నాయి. దీనిపై అమెరికాలో...................

అంత్య దశలో బాబా అనుమానాల ఆశ్రమం

నెల రోజులుగా అనారోగ్యంతో బాధడుతున్న సత్య సాయిబాబా పరిస్థితి తీవ్రంగా విషమించింది. ఆయన శరీరావయవాలన్నీ పనిచేయడం మానేశాయనీ, చికిత్సకు కూడా స్పందించడం లేదనీ వైద్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా సాయిబాబా గురించీ, ఆయన నిర్మించిన సామ్రాజ్యం, దాన్ని నిర్వహిస్తున్న ట్రస్టు గురించీ మీడియాలో వస్తున్న వార్తా కథనాలు ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. బాబా ఆరోగ్యం గురించీ, ఆయన అనారోగ్యంపాలైన తరువాత ఆశ్రమంలో జరుగుతున్న వ్యవహారాల గురించీ వాస్తవాలు వెల్లడి కాకుండా నిర్వాహకులు ఎంతగా ప్రయత్నిస్తుంటే అంతగా ప్రజల్లో అనుమానాలు బలపడుతున్నాయి. బాబాకు దైవత్వం............

డ్రగ్స్‌ కంపెనీ దాష్టీకం

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్దనున్న హెటిరో డ్రగ్స్‌ కంపెనీ పర్యావరణ నిబంధనలకు పాతరేస్తోంది. కంపెనీ విడుదల చేస్తున్న రసాయన, వ్యర్థ పదార్థాల వల్ల మత్స్య సంపద, వ్యవసాయం దెబ్బతినడంతోపాటు పరిసర ప్రాంత ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. హెటిరో డ్రగ్స్‌ కంపెనీ రాత్రిళ్లు విడిచిపెడుతున్న వాయు కాలుష్యంవల్ల వ్యాపిస్తున్న దుర్గంధాన్ని పది కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు

సచిన్‌ అభినందనే పెద్ద అవార్డ్‌

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ నుంచి మెప్పుుపొందడం తన జీవితంలో ఒక పెద్ద మైలురాయని ఆరంజ్‌ క్యాప్‌ రేసులోముందు వరుసలో ఉన్న కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ పాల్‌ వాల్తాటి తెలిపాడు. 'నా రోల్‌ మోడల్‌ సచిన్‌ అభినందన తెలపడమే నాకు అతి పెద్ద అవార్డ్‌. నేను సచిన్‌, మాథ్యూ హెడెన్‌ నుంచి స్ఫుర్తి పొందుతుంటాను' అని వాల్తాటి పిటిఐకు తెలిపాడు. ఈ ఐపిఎల్‌ టోర్నీలో వాల్తాటి 13 మ్యాచ్‌ల్లో 38.16 సగటు, 137.95 స్ట్రైక్‌రేట్‌, ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో 458 పరుగులు చేశాడు..........

18, మే 2011, బుధవారం

వచ్చారు.. విన్నారు.. వెళ్ళారు

ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు ఎలాంటి సూచనలు ఇవ్వకుండానే రెండురోజుల పర్యటనను ముగించుకుని మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్ళారు. పార్టీ బలోపేతం కంటే ఎవరి వాదనలు వారు వినిపించడానికే నేతలు ప్రాధాన్యత ఇచ్చారు. ఫిర్యాదులు, విజ్ఞప్తులు, సూచనలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే తెలంగాణాలో పార్టీ మనుగడ కష్టమవుతుందని తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌ నేతలు చెప్పుగా, రాష్ట్రాన్ని చీల్చితే రెండు ప్రాంతాల్లోనూ పార్టీ నష్టపోతుందని సీమాంధ్ర నేతలు అన్నారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదంటూ ఆయన జిల్లాకే చెందిన ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కూతుహలమ్మలు ఫిర్యాదు చేస్తూ లేఖలు ఇచ్చారు............

'ది బిజినెస్‌మేన్‌' 'గన్స్‌ డోన్ట్‌ నీడ్‌ అగ్రిమెంట్స్‌'

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు 'ది బిజినెస్‌మేన్‌'గా కనిపించబోతున్నాడు. ఇంతకు ముందు చూపిన 'పోకిరి' అఖండ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈసారి క్లాస్‌గా బిజినెస్‌మేన్‌ కథను చూపించనున్నారు. ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌ పతాకంపై అగ్రనిర్మాత వెంకట్‌ నిర్మిస్తున్నారు. జూలైలో ప్రారంభమై ఆగస్ట్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటుంది...........................

సీట్లు తగ్గినా ఓటింగ్‌ బలం పదిలం

సుమారు 41 శాతం ఓట్లు ఉన్న లెఫ్ట్‌ ఫ్రంట్‌ మునుపెన్నడూ లేని రీతిలో అత్యంత తక్కువ సీట్లు పొందింది. వాస్తవానికి 2009తో పోలిస్తే ఈ ఎన్నికల్లో 11 లక్షల మంది కొత్త ఓటర్లు దానికి ఓటు వేశారు. 2006 ఎన్నికల్లో వామపక్షాలు ఒక కోటీ 98 లక్షల ఓట్లు పొంది 294 స్థానాల శాసనసభలో 235 స్థానాలు గెలుచుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఒక కోటీ 96 లక్షల ఓట్లు పొంది 61 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగాయి.................

దావూద్‌ సోదరుడిపై కాల్పులు

వినయం...రాక్షసత్వం...వీర

గూగుల్‌ 'క్రోమ్'‌

17, మే 2011, మంగళవారం

ఒలింపిక్‌ మారథాన్‌ ఛాంపియన్‌ వాంజీరు ఆత్మహత్య

స్వర్గ నరకాలు కట్టుకథలే

ఒబామా రాజకీయ ప్రయోజనానికే

మా పరిస్థితి ఏమిటో!

గ్రూప్‌-2 రాత పరీక్ష మరో రెండునెలల్లో ఉండవచ్చన్న ప్రచారంతో దరఖాస్తులు తిరస్కరించబడిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తమ దరఖాస్తుల్ని మళ్లీ స్వీకరిస్తారో లేదోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ల నుంచి ఆశగా ఎదురు చూస్తున్న తమకు నిరాశ మిగులుతుందేమోనని వాపోతున్నారు.గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా తర్వాత దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించింది........

కంటిచూపుతో పనిచేసే లాప్‌టాప్‌

''కంటి చూపుతో చంపేస్తా..'' అంటూ ఓ ప్రముఖ హీరో డైలాగ్‌ తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ సుపరిచితమే. ఈ డైలాగ్‌ సినిమా వరకు సరదాగా వున్నప్పటికీ నిజజీవితంలో ఇది ఎంతటి సత్యదూరమో అందరికీ తెలుసు. కంటిచూపుతో ఎదుటివారిని అదుపు చేయడం, ఆజ్ఞాపించడం చాలామందికి అనుభవమే. అయితే కంటిచూపుతో ల్యాప్‌టాప్‌లను కూడా పనిచేయించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. దీనినే ఐ ట్రాకింగ్‌ టెక్నాలజీ అంటారు............