శనివారం 16 ఎప్రిల్ 2011

కారులేని శతకోటీశ్వరుడు

దేశంలోనే అత్యంత సంపన్నుడైన ఎంపీ అభ్యర్థిగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిలిచారు. కడప లోక్‌సభకు శుక్రవారం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో జగన్‌ దంపతుల ఆస్తుల విలువను రూ.407.02 కోట్లగా పేర్కొన్నారు. 2009 సాధారణ ఎన్నికల సందర్భంగా సమర్పించిన.............

భర్త మరణిస్తే భార్య అమ్మకం : ఒకసారి అమ్ముడైన మహిళ తిరిగి మళ్లీ ఆ గ్రామానికి రాకూడదు. తన పిల్లల్ని చూడటానికి కూడా అవకాశం ఉండదు

ఒకవైపు మానవుడు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దిన దిన ప్రవర్ధమానమౌతుంటే మరోవైపు నాగరికతకు దూరంగా ఉన్న కొన్ని మారు మూల గ్రామాల్లో దురాచారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులోని ఓ మారుమూల గ్రామమైన పావగడ్‌లో సభ్య సమాజం సిగ్గుపడే హేయమైన, అనాగరికమైన దురాచారం ఇంకా కొనసాగుతోంది. అదేమంటే ఆ గ్రామంలో భర్త చనిపోతే భార్యను అతని కుటుంబ సభ్యులే.............

శ్రీకృష్ణ కమిటీ సభ్యులపై కేసు నమోదు

లైంగిక వేధింపులకు ఇక చెక్

చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న లైంగిక వేధింపులు బిల్లుకు త్వరలో మోక్షం లభించనుంది. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించేందుకు, లైంగిక వేధింపుల నిరోధక బిల్లు శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రాబోతుంది. విశాఖ వర్సెస్‌ రాజస్థాన్‌ ప్రభుత్వం (1977 సం||) కేసులో సుప్రీమ్‌ కోర్టు తెలిపిన నిర్వచనాన్ని బిల్లు ప్రతిపాదించింది. శారీరక సంబంధం, లైంగిక చర్యలకోసం ఒత్తిడి, అసభ్య, ద్వందార్థాల వ్యాఖ్యానాలు, అశ్లీల చిత్రాలు చూపించడం వంటివన్నీ లైంగిక వేధింపుల కిందికే వస్తాయి. ఉద్యోగం పోతుందని భయపెట్టటంతోపాటు ఇతర బెదిరింపులూ లైంగిక వేధింపుల చట్టం పరిధిలోకే వస్తాయి.........................

విజయ పాల ధర పెంపు

విజయ పాల ధర లీటర్‌కు రూపాయి పెరగనుంది. విజయ బ్రాండ్‌పై విక్రయించే అన్ని రకాల పాల ధర పెరుగుతుంది. పెరిగిన ధరను శనివారం నుండి జంట నగరాల్లో అమలు చేస్తారు. కొద్ది రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ధరను అమలు చేస్తారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ పేర్కొంది. దేశ వ్యాప్తంగా పాల ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకొని తాను కూడా రేటు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. డెయిరీలు పాల సేకరణ ధర పెంచాయని, ఇదే సమయంలో పాల ఉత్పత్తికి ధరలు పెరిగాయని అందుకే ధర పెంచాల్సి....................

సచిన్‌ హిట్‌, మ్యాచ్‌ ఫట్‌

సచిన్‌, అంబటిరాయుడు మరోసారి చెలరేగి 116 పరుగుల భాగస్వామ్యంతో భారీ స్కోరు అందిం చిన ప్పటికీ ముంబయి ఇండియన్స్‌కు ఉపయోగం లేకుండా పోయిం ది. వరుస విజయాల ఉత్సాహంతో ఉన్న ఆ జట్టుకు కొచ్చి డస్కర్స్‌ కేరళ జట్టు షాక్‌ ఇచ్చింది. ముంబయి ఇండియన్స్‌ నిర్దేశించిన 183 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు 19 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేరుకుంది. బ్రెండన్‌ మెక్‌కలమ్‌, కెప్టెన్‌ జయవర్ధనే తొలి వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యం............

ట్రిపోలీ వీధుల్లో గడాఫీ

లిబియాలో నాటో నేతృత్వంలోని గగనతల దాడులకు సంబంధించి ఐక్యంగా ఉండేందుకు పాశ్చాత్య దేశాలు ఘర్షణ పడుతుండగా ఆ దేశాధ్యక్షుడు ముమ్మర్‌ గడాఫీ రాజధాని ట్రిపోలీ వీధుల్లో పర్యటించారు. ఆయన్ను పదవి నుంచి తొలగించడంలో పాశ్చాత్య దేశాలు ఇప్పటి వరకూ విఫలమయ్యాయి. గడాఫీ గురువారం ట్రిపోలీ నగరంలో ఓపెన్‌ టాప్‌ జీపులో తిరుగుతూ వీధుల్లో బారులుతీరిన తన మద్దతుదారులకు పిడికిలి బిగించి అభివాదం చేశారు. 'అల్లా, లిబియా,.........................

మా ఇబ్బందులను అర్థం చేసుకోవాలి : నిర్మాతల మండలి

సినీకార్మికులు చేస్తున్న సమ్మె ఇంకా కొనసాగుతోంది. కార్మికుల ఫెడరేషన్‌కు, నిర్మాతల మండలికి మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా ఓ కొలిక్కిరాలేదు. ఈ సమస్యకు కారణాలు, కార్మికుల డిమాండ్లు, ప్రస్తుతం అందజేస్తున్న వేతనాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి...మొదలైనవి నిర్మాతల మండలి ఉదహరిస్తోంది. కార్మికుల వేతనాల్లో 32 శాతం పెంపుదలకు సిద్ధమయ్యామని నిర్మాత డి.సురేష్‌బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు..............

'తెలంగాణ కోసం నాయకులు ఏకం కావాలి'

ప్రజలు ఏకమయ్యారు...ఇక ఏకం కావలసింది రాజకీయ నాయకులేనని జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. గురువారం రాత్రి కుత్బుల్లాపూర్‌ మున్సిపల్‌ గ్రౌండ్‌లో ధూం..ధాం.. కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఆయన ఆశయాలను సిద్దాంతాలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ఉద్యమాన్ని అణగదొక్కాలనే ఉద్ధేశంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం...........