గురువారం 31 మార్చి 2011

'నరసింహ' సినిమాలో సౌందర్య, రమ్యకృష్ణలు ఎర్రనిచీర ధరిస్తే ఎద్దు వారి వెంటపడుతుంది....! పశువులు ఎర్ర రంగుని గుర్తిస్తాయా? తేనె వల్ల వెంట్రుకలు తెల్లగా మారతాయా?

వైఎస్‌, బాబు జాతకాలు బయటపడ్తాయి

భూ కేటాయింపులపై వేయబోతున్న సభాసంఘం ద్వారా తప్పులున్నట్లు తేలితే మాజీ ముఖ్యమంత్రులు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు జాతకాలు బయటికొస్తాయని పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో డిఎస్‌ మాట్లాడారు. భూ కేటాయింపులపై ప్రభుత్వం సభాసంఘం వేయడాన్ని తప్పుపట్టడం సరైంది కాదని చెప్పారు. సభాసంఘం వేయకుంటే ఏదో గూడుపుఠాణీ ఉందంటారని, వేస్తే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంటే ఎలా అని జగన్‌ గ్రూపు ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డిని, ఆయన కుటుంబాన్ని టార్గెట్‌ చేసుకోవాలంటే చాలా రకాలున్నాయని, ఆ ఉద్దేశం తమకు లేదని తెలిపారు. భూ కేటాయింపులు చంద్రబాబు, వైఎస్‌ హయాంలోనే జరిగాయని, సిపిఐ(ఎం), బిజెపి లాంటి పార్టీలు పాలించలేదని, తప్పు తేలితే ఆ ఇద్దరి వ్యవహారమే బయటికొస్తుందని........

సస్యరక్షణ మందులు.. అవశేషాలు.. ప్రభావాలు..

వ్యవసాయోత్పత్తిలో సస్యరక్షణ మందుల వాడకం అనివార్యం చేయబడింది. వీటి వాడకాన్ని పూర్తిగా తగ్గించగల ప్రత్యామ్నాయాలు రైతులకు చేరడం లేదు. వీటి ఆచరణలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ మందుల వాడకాన్ని కనీసస్థాయికి తగ్గించగల సమగ్ర సస్యరక్షణ పద్ధతులు రైతుల ఆచరణకు నోచుకోవడం లేదు. మందుల తయారీ కంపెనీల పరోక్ష, ప్రత్యక్ష ప్రభావం, సంబంధిత ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం సమగ్ర సస్యరక్షణకు నోచుకోక విచక్షణా రహిత మందుల వినియోగానికి దోహదపడుతుంది. ఇది ఉత్పత్తుల్లో అవశేషాలను హాని కలిగించే కనిష్ట స్థాయిని మించుతోంది. మందుల వాడకం, ఆ తర్వాత అధికంగా ఉన్న అవశేషాలు ఆరోగ్య సమస్యల్ని సృష్టిస్తున్నాయి. మందుల వాడకాన్ని తగ్గించడానికే ప్రవేశపెట్టామని చెపుతున్న బిటి పంటలు (బిటి విషాహార పంటలు) కూడా పర్యావరణ, ఆరోగ్య సమస్యలను సృష్టిస్తున్నాయి. మందుల వాడకాన్ని ప్రచారం చేసినట్లుగా తగ్గించలేదు. ఈ నేపథ్యంలో, సస్యరక్షణ మందుల వాడకంలో ఉన్న ఇబ్బందుల్ని, ప్రభావాల్ని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, సుస్థిర వ్యవసాయోత్పత్తి కేంద్రం సహకారంతో రేఖామాత్రంగా విశ్లేషిస్తూ.. ఈవారం 'విజ్ఞాన వీచిక' మీముందుకొచ్చింది................................

కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం

మయన్మార్‌లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారం అనంతరం జుంటా పాలన అధికారికంగా బుధవారం రద్దయింది. మయన్మార్‌ మారుమూల రాజధాని నేయిప్‌టావ్‌లో అధ్యక్షుడు థీన్‌ సీన్‌ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం చేత పార్లమెంటు పదవీ స్వీకార ప్రమాణం చేయించినట్లు ప్రభుత్వ టీవీ, రేడియో తెలిపాయి. థీన్‌ సీన్‌ గత సైనిక ప్రభుత్వంలో ప్రధానిగానూ, అందులో ఒక ఉన్నతస్థాయి సభ్యునిగానూ ఉండేవారు. ప్రజాస్వామ్యానికి మార్పు చెందే క్రమంలో భాగంగా ఈ పరిణామాలు జరిగాయి. అయితే ఇదంతా బూటకమంటూ అంతటా విమర్శలు వచ్చాయి.

ప్రజాతంత్ర హక్కులకు ప్రమాదం

ఈనాటి ప్రపంచ ద్రవ్య పెట్టుబడుల శకంలో సామ్రాజ్యవాదం, మానవ నాగరికత సాగించే ప్రజాతంత్ర పురోగమనంపై బహుముఖ దాడి చేస్తున్నది. ప్రస్తుత కాలంలో ఇది సంక్షేమ రాజ్యం పట్ల విశృంఖల దాడి మినహా మరొకటి కాదు. ఐరోపాలో మనం దీనిని చూడవచ్చు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు వేల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అమెరికన్‌ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. రెండు రోజుల క్రితం లండన్‌ వాసులు నిరసనలు తెలిపారు. ఇదేవిధంగా పలు దేశాలలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. అదేమంటే, ఇప్పుడు సాగుతున్న పోరాటాలన్నీ ఆత్మరక్షణ స్వభావం కలిగినవే. అంటే, ఇంతకుముందు పోరాడి సాధించుకున్న ప్రయోజనాలను కాపాడుకోవటమే ధ్యేయంగా ఈ ఆందోళనలు సాగుతున్నాయి...............

ఒకే ఒక్కడుగు

కామెడీ విలనిజానికి కేరాఫ్‌ అడ్రస్‌

1
దేశం చాలా క్లిష్టపరిస్తితుల్లో ఉంది...అంటూ డైలాగ్‌కు తనదైన మ్యానరిజాన్ని, కామెడీ విలనిజాన్ని జోడించిన అరుదైన నటుడు నూతన్‌ప్రసాద్‌. రావుగోపాల్‌రావు, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ...వంటి ఉద్ధండుల మధ్య ప్రత్యేకత నిలుపుకున్న యాక్టర్‌ ఆయన. బుధవారం ఆయన మృతి చెందారన్న వార్త సినీ అభిమానులందర్నీ బాధపెట్టింది. నాటకరంగం నుంచి వెండితెరకు వచ్చిన అతికొద్దిమంది ఆణిముత్యాల్లో నూతన్‌ ప్రసాద్‌.....

సెన్సార్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా నర్తకి లీలా శామ్సన్‌

సుప్రసిద్ధ భరత నాట్య కళాకారిణి, రచయిత్రి లీలా శామ్సన్‌ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ కొత్త చైర్‌పర్సన్‌గా నియమితు లయ్యారు. లీల ప్రస్తుతం సంగీత, నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా ఉన్న విషయం విదితమే. ఇప్పటి వరకూ రెండుసార్లు సెన్సార్‌బోర్డు చైర్‌పర్సన్‌గా ఉన్న సినీనటి షర్మిలాటాగూర్‌ స్థానంలో....