శనివారం 26 మార్చి 2011

రజనీకాంత్‌ సినిమాలో ఇలియానా

రజనీకాంత్‌ తాజా చిత్రం 'రాణా' ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. రోబో తర్వాత వస్తున్న మరో సంచలనంగా ఇండిస్టీలో వినికిడి. ఇందులో కూడా రజనీకాంత్‌ మూడు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూడు పాత్రలకు సరిజోడుగా జాతీయస్థాయిలో పేరొందిన ప్రముఖ కథానాయికలను పరిశీలించారు. మొదట బాలీవుడ్‌ నటి రేఖని అనుకున్నారు. అయితే పారితోషికం.....

కప్‌ ఎంత దూరం?

ప్రపంచ కప్‌ కీలకమైన దశకు చేరుకుంది. భారత క్రికెట్‌ జట్టు ట్రోఫీకి చేరువైంది. భారత్‌ కప్‌ గెలుచుకోవాలని కోట్లాది మంది అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు. మన క్రికెటర్లు 1983ను పునరావృతం చేసి అభిమానుల ఆశలను నెరవేరుస్తారా? 2003లో మాదిరిగా చివరి దశలో బోల్తా పడ్తారా? అభిమానులందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఇదే !.....

ప్రకటనపై సంతృప్తి చెందకపోతే... సభా సంఘానికి ఓకే

భూముల పందేరం వ్యవహారం శాసనసభను శుక్రవారం కూడా కుదిపేసింది. ప్రతిపక్షాల ఆందోళనలతో సభ పలుమార్లు వాయిదా పడింది. భూముల ధారాదత్తంపై జెఎల్సీ వేయాలని టిడిపి, సిపిఎం, సిపిఐతో పాటు ప్రతిపక్ష సభ్యులంతా కొన్ని రోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. మంత్రి ప్రకటన, దానిపై చర్చ తర్వాత జెఎల్సీ గురించి ఆలోచిద్దామని చెబుతూ వచ్చిన ప్రభుత్వం శుక్రవారం ఒక మెట్టు దిగింది. ప్రభుత్వ ప్రకటన, చర్చ తర్వాత సభ్యులకు అసంతప్తి కలిగితే, అక్రమాలపై నిర్దిష్టమైన ఆధారాలు చూపితే సభాసంఘాన్ని నియమిస్తామని హామీ ఇచ్చింది. రెవెన్యూ, వక్ఫ్‌, దేవాదాయ, ఎపిఐఐసి తదితర ఎన్నో రకాల భూములపై సభ్యులు లేవనెత్తుతున్నారని, దీనిపై ప్రభుత్వం సమాధానం ఎలా చెప్పాలో ప్రతిపక్షాలు నిర్ణయించుకోవాలని మంత్రులు సూచించారు. అందుకు ఉపసభాపతి సాయంత్రం ఫ్లోర్‌లీడర్ల సమావేశం జరిపారు.....................

లిబియాలో సామ్రాజ్యవాదుల జోక్యం

చమురు నిల్వలు పుష్కలంగా వున్న ప్రాంతంపై తన పెత్తనాన్ని నిలబెట్టుకోవటమే పరమావధిగా సామ్రాజ్యవాదులు ఇంతటి దుస్సాహసానికి తెగబడుతున్నారు. అదే విధంగా తన ప్రయోజనాలకు భంగం కలిగించే శక్తుల పునరేకీకరణను అడ్డుకోవటం కూడా ఈ దాడి వెనక వున్న వ్యూహం. 2009 నాటి అంచనాల ప్రకారం ఈ ప్రాంతంలో 10,320 కోట్ల టన్నుల చమురు నిక్షేపాలు ఉన్నాయి. మరో విధంగా చెప్పాలంటే, ప్రపంచవ్యాప్తంగా వున్న చమురు నిల్వల్లో 55.6 శాతం ఇక్కడే ఉన్నాయి. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, మెరుగైన జీవన ప్రమాణాలు కావాలంటూ బహ్రెయిన్‌ ప్రజానీకం ఖలీఫాకు వ్యతిరేకంగా ఏకతాటిపై నిలచినప్పటికీ అమెరికా ప్రోద్బలంతో సౌదీ అరేబియా సైనిక దళాలు ఖలీఫాకు మద్దతుగా బహ్రెయిన్‌లో జోక్యం చేసుకున్నాయి. సామ్రాజ్యవాదుల ద్వంద్వ ప్రమాణాలను ఈ ఉదంతం స్పష్టంగా తెలియజేస్తోంది.....................

నాటోకు 'నో ఫ్లై జోన్‌' బాధ్యత

లిబియాపై నో ఫ్లై జోన్‌ అమలు బాధ్యతను చేపట్టేందుకు నాటో అంగీకరించింది. వరుసగా ఆరో రోజు కూడా సంకీర్ణ దళాలు ట్రిపోలీని లక్ష్యంగా చేసుకొని గగనతల దాడులు జరుపుతున్నాయి. సుదీర్ఘ చర్చల అనంతరం 28 దేశాల కూటమి నో ఫ్లై జోన్‌ అమలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు నాటో సెక్రటరీ జనరల్‌ ఆండర్స్‌ ఫోగ్‌ రాస్‌ముస్సెన్‌ గురువారం వెల్లడించారు. 'గడాఫీ ప్రభుత్వం నుంచి పౌరులను కాపాడే విస్తృత అంతర్జాతీయ చర్యల్లో భాగంగా మేము ఈ చర్య తీసుకుంటున్నాం' అని ఆయన చెప్పారు................

అణు రియాక్టర్‌కు పగుళ్లు?

జపాన్‌లో ఫుకుషిమా దారుచీ అణు రియాక్టర్‌కు పగుళ్లు సంభవించి ఉంటాయని అధికారులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సంక్షోభానికి మూలమైన రియాక్టర్ల వద్ద మరమ్మతు పనులు చేపట్టిన కార్మికులు ముగ్గురు అక్కడి నీటిలో దిగినప్పుడు అణు ధార్మికతకు లోనవడం తమ ఆందోళనలకు ఆధారంగా అధికారులు పేర్కొన్నారు. ఇక్కడున్న ఆరు రియాక్టర్లలోని ఒక దానిలో సంభవించిన పగుళ్ళు గుర్తించడం అసాధ్యంగా.........

మరోసారి జోడి కట్టబోతున్న విక్టరీ వెంకటేష్, త్రిష