శుక్రవారం 25 మార్చి 2011

'శ్రీకృష్ణ' పక్షపాతం

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడమే లక్ష్యంగా శ్రీకృష్ణ కమిటీ పనిచేసిందని కాంగ్రెస్‌ తెలంగాణా ఎంపీలు విమర్శించారు. సీమాంధ్ర నేతల కుట్రల వల్లే కమిటీ పక్షపాతంతో కూడిన నివదికనిచ్చిందని ఆరోపించారు. రాష్ట్ర హైకోర్టు చొరవతో బహిర్గతమైన నివేదక 8వ అధ్యాయమే ఇందుకు స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. ఎంపీలు మంద జగన్నాథం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, బలరాం నాయక్‌........

వధువుకు 17, వరుడికి 75

హైటెక్‌ రంగులు దిద్దుకుని అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న తరుణంలో పల్లెల్లో ఇంకా మూఢనమ్మకాలు ఏవిధంగా ఉన్నాయనేదానికి మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో గురువారం జరిగిన సంఘటనలు నెలువెత్తు నిదర్శనం. మన్యంకొండలోని అలవేలు మంగమ్మ దేవాలయంలో వృద్ధునితో, బాలిక వివాహం జరిపించి జోగినిగా మార్చారు. మెదక్‌లో మగ సంతానం కోసం 52 ఏళ్ల ప్రభుత్వ అధికారి 16 సంవత్సరాల బాలికను.......

జిల్లాలో రెండు సార్లు పర్యటించిన మహాత్మాగాంధీ

బ్రిటీష్‌ వారిని భారతదేశం నుండి వెళ్లగొట్టేందుకు శాంతియుత పోరాటమే ఆయుధంగా ఉద్యమం సాగింది. స్వాతంత్య్రం సాధించిన మహాత్మాగాంధీ చిత్తూరు జిల్లాలో రెండు సార్లు పర్యటించారు. మహాత్మాగాంధీ తన జీవిత కాలంలో ప్రజా ఉద్యమ విరాళాల కోసం సాగించిన యాత్రలో ఆయన రెండుసార్లు జిల్లాను సందర్శించారు. ఆయన పర్యటన అంటరానితనాన్ని చీల్చి చెండాడే ప్రసంగాలు, ఖద్దరు నిధి, హరిజనాభివృద్ధి నిధుల సేకరణకు పరిమితమైంది. తొలుత 1929 మే, 14వ తేదీన మహాత్మా గాంధీ చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టారు. మూడు రోజుల పాటు సాగిన ఆయన తొలి పర్యటనలో జిల్లాలోని శ్రీకాళహస్తి, పుత్తూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పుంగనూరులలో విరాళాల సేకరణ సాగింది........

ఛాప్టర్‌-8పై దుమారం

జస్టీస్‌ శ్రీకృష్ణ కమిటీ ఫాసిస్ట్‌ నైజాన్ని చాటుకుందని, అది పూర్తిగా కుట్రపూరితంగా ఏర్పాటైందని, టిఆర్‌ఎస్‌ శాసన సభ్యులు హరీష్‌రావు వ్యాఖ్యానించారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీ రూపొందించిన ఎనిమిదో అధ్యాయం పరిశీలిస్తే సీమాంధ్ర నేతలకు అమ్ముడుపోయిందని రుజువైందని ఆరోపించారు. న్యాయవ్యవస్థకే మచ్చ తెచ్చేవిధంగా నివేదిక తయారు చేసిన శ్రీకృష్ణ కమిటీపై న్యాయపోరాటం చేస్తామన్నారు. కమిటీ సభ్యులకు శిక్షలు పడేవరకు వదిలిపెట్టేదిలేదన్నారు. శ్రీకృష్ణ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు.........

'చిరు' అల్లుడి ముందస్తు బెయిల్‌కు నో

వరకట్నం కేసులో నిందితుడిగా ఉన్న పిఆర్‌పి అధ్యక్షుడు చిరంజీవి అల్లుడు శిరీష్‌ భరద్వాజ్‌కు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిలు తిరస్కరించింది. శిరీష్‌ భార్య శ్రీజ ఈనెల 14వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిసిఎస్‌ మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు తప్పదని భావించిన శిరీష్‌, అతని తల్లి ముందస్తు బెయిలు కోసం ఆరు రోజుల క్రితం నాంపల్లి కోర్టులో..........

ఆసీస్‌ ఆట కట్టు


 

టీం ఇండియా... ఆసీస్‌ ఆట కట్టించింది. ప్రపంచ ఛాంపియన్‌ క్వార్టర్స్‌ స్థాయిలోనే ఇంటిబాట పట్టింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో సమిష్టిగా రాణించిన భారత్‌... కంగారూలను కంగారెత్తించింది. టీం ఇండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌, రైనా రెచ్చిపోయి ఆడడంతో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించిన........