సోమవారం 14 మార్చి 2011

జగన్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకొస్తా

తెలుగుజాతినే కించపర్చుకున్నాం

ట్యాంక్‌బండ్‌పై ఉన్న మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడమంటే తమకు తాము తెలుగు జాతిని కించపర్చుకున్నట్లేనని పలువురు మేధావులు, రాజకీయ పార్టీల నేతలు, భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. విగ్రహాల కూల్చివేతను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని విమర్శించారు. విగ్రహాల పున: ప్రతిష్టించాలని వారు డిమాండ్‌ చేశారు. తెలుగు తేజాల కూల్చివేతను నిరసిస్తూ ఆదివారం ట్యాంక్‌బండ్‌పై జన చైతన్య వేదిక అధ్యక్షులు వి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు ఎబికె ప్రసాద్‌ మాట్లాడుతూ మహనీయుల విగ్రహాల ధ్వంసం వల్ల సాధించిందేమిటో...........

బెంగాల్‌ ఎన్నికల్లో కొత్త రక్తం

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అధిక శాతం మంది కొత్త అభ్యర్ధులను బరిలోకి దింపుతూ బెంగాల్‌ వామపక్ష కూటమి తన జాబితాను ఆదివారం నాడు ప్రకటించింది. కాంగ్రెస్‌, టిఎంసిల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు వాయిదాలు పడుతుండగా వామపక్ష కూటమి తన అభ్యర్థుల జాబితాను ముందుగానే ప్రకటించింది. జాబితాను మీడియాకు విడుదల చేసిన కూటమి ఛైర్మన్‌ బిమన్‌ బసు మాట్లాడుతూ మొత్తం 294కు గాను 292 స్థానాలకు ప్రకటించిన అభ్యర్ధుల్లో 149 మంది కొత్తవారిని ఎంపిక చేసినట్లు చెప్పారు...............

వీడని ముప్పు

శనివారం ఫుకుషిమా అణువిద్యుత్‌ కేంద్రంలో ఏర్పడిన ముప్పు భయం తొలగిపోక ముందే రెండో రియాక్టర్‌ ఆదివారం పేలేందుకు సిద్ధంగా వుందన్న సమాచారం జపాన్‌ ప్రజానీకంలో తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ అణువిద్యుత్‌ కేంద్రంలో రెండో నెంబర్‌ రియాక్టర్‌లో కూలింగ్‌ వ్యవస్థ వైఫల్యంతో దీనిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి చుట్టూ ఉన్న ఉక్కు రక్షణ కవచం కరిగిపోవటం ప్రారంభించిందని అధికారులు చెప్పారు. దీనితో మరో అణు ప్రమాదం సంభవించవచ్చన్న భయాందోళన లు వ్యక్తమవుతున్నాయి..................

ఎనిమిది పదుల ఎనలేని వింత

మన దేశంలో వెండితెర మీద బొమ్మ మాట్లాడడం మొదలై ఇప్పుడు సరిగ్గా 80 ఏళ్ళు కావస్తోంది. మాటలు లేని మూగ సినిమాల (మూకీల) యుగం నుంచి భారతీయ సినిమా మాట, పాట నేర్చిన (టాకీల) స్థాయికి ఎదిగిన కథ ఎన్నో గమ్మత్తయిన అనుభవాల సమాహారం. తొట్టతొలి భారతీయ టాకీ 'ఆలం ఆరా' ఇప్పటికి సరిగ్గా ఎనిమిది దశాబ్దాల క్రితం 1931 మార్చి 14న విడుదలైంది. మూకీ చిత్రాల నుంచి మాట్లాడే సినిమాల వైపు జనం ఎలా విపరీతంగా ఆకర్షితులయ్యారనే సంగతులు ఇవాళ్టికీ మనకు ఆసక్తి కలిగిస్తాయి, అబ్బురపరుస్తాయి. ఆ విశేషాల ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళదాం. రండి!............

అణు విద్యుత్‌ వద్దు

జపాన్‌ అణు విద్యుత్‌ ప్లాంట్‌లో సంభవించిన పేలుడు జర్మనీలో ఆ సాంకేతిక పరిజ్ఞానపు భవిష్యత్తుపై దీర్ఘ కాలంగా కొనసాగుతున్న వివాదానికి కొత్తగా ఆజ్యం పోసింది. దేశంలోని అణు విద్యుత్‌ కేంద్రాల జీవిత కాలాన్ని పెంచాలనే ప్రణాళికలకు వ్యతిరేకంగా జర్మనీలో వేలాది మంది శనివారం ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శకులు నెకార్‌వెస్తీమ్‌ అణు ప్లాంటు నుంచి స్టట్‌గార్ట్‌ వరకూ 28 మైళ్ళ పొడవున (45 కిమీ) మానవహారం ఏర్పాటు చేసినట్లు ప్రదర్శన నిర్వాహకులు చెప్పారు. 'అణు విద్యుత్‌ - వద్దు' అని రాసి ఉన్న పసుపుపచ్చ జెండాలను కొందరు ఊపినట్లు వారు తెలిపారు. పోలీసులు వెంటనే ప్రదర్శకుల సంఖ్యను వెల్లడించలేదు...............

పేరులేని ఉపేంద్ర సినిమా... గాలిమేడలు+లవ్‌స్టోరీ

ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన పేరులేని సినిమా కన్నడనాట సంచలన విజయం సాధించింది. తెలుగులోనూ అదే విధంగా కేవలం చేతి బొమ్మ మాత్రమే పోస్టర్‌పై ముద్రించి నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ విడుదల చేశారు. సమాజం పట్ల, దేశం పట్ల సామాన్య పౌరుడు తన బాధ్యతను మరిచాడని, ఓటు అమ్ముకొని తప్పు చేస్తున్నాడని, ఇది అనేక దారుణాలకు దారితీస్తుందని కథనంలో దర్శకుడు పేర్కొన్నాడు. కఠిన నిర్ణయాలు తీసుకొని, రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడాలన్నది అంతిమంగా చెప్పదల్చుకున్న పాయింట్‌. ఈ విషయాన్నిఓ లవ్‌స్టోరీతో పోల్చాడు. కథలో ఈ పోలిక గందరగోళానికి దారితీసింది............

కలా? నిజమా?

లా? నిజమా? - అని జపనీయులంతా విలవిలలాడిపోతున్నారు. ప్రకృతి కన్నెర్రకు కకావికలమైన వాస్తవ పరిస్థితుల నుండి తేరుకునేందుకు శతథా ప్రయత్నిస్తున్నారు. సునామీ తాకిడి నుంచి తేరుకునే లోపుగానే అణుథార్మిక ప్రమాదం జపనీయులను ఆందోళన అగాథంలోకి నెట్టివేసింది. అణుప్రమాదాలు, సునామీ తుఫానులు జపాన్‌కు కొత్త ఏమీ కానప్పటికీ రెండు రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపం, దాని వెన్నంటిన సునామీ అలలు ఈశాన్య జపాన్‌లో వేలాది మంది జపనీయుల ప్రాణాలను తమలోకి లాగేసుకున్నాయి. ఇది నిజం కాకూడదు... కలైతే బాగుండని అనుకునే వారు కొందరైతే, అచ్చు సినిమాలోలా అనుభూతికి లోనైనానని 50 ఏళ్ల ఇచిరొ సకమోటో వాపోయాడు. ...........