గురువారం 10 మార్చి 2011
అమితాబ్తో పూరీ హిందీ చిత్రం బుడ్డా
అమితాబ్ బచ్చన్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వయాకామ్ 18 అండ్ ఎ.బి. కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న హిందీ చిత్రం 'బుడ్డా' (హోగా తేరా బాప్). ఈ చిత్రం షూటింగ్ ముంబాయి వెర్సోవాలోని ఖోజా బంగ్లాలో ప్రారంభమైంది. సోనూ సూద్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశంతో షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారారు బచ్చన్, సోనాల్ చౌహాన్....
పోలీసుల సహకారంతోనే... చట్టవిరుద్ధ కార్యకలాపాలు
* శృంగార కేంద్రాలుగా పబ్లు : దాడి
పోలీసుల సహకారంతోనే చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయని మండలిలో ప్రతిపక్షనేత దాడి వీరభద్రరావు అన్నారు. స్థానిక పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి కార్యకలాపాలకు తావుండదన్నారు. వైన్షాపులు బార్లుగా, బార్లు పబ్లుగా మారుతున్నాయని చెప్పారు. బార్లు, పబ్లు శృంగార కేంద్రాలుగా .............
'భద్రత'ను విస్మరించారు..!
టెలికమ్యూనికేషన్ రంగంలో ప్రతికూల అంశాలున్న విదేశీ కంపెనీలకు సైతం 2జిస్పెక్ట్రమ్ను కేటాయించి దేశభద్రత అన్న అంశాన్ని విస్మరించారని సుప్రీంకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారీయెత్తున విదేశీ పెట్టుబడులను రాబట్టుకోవటం కోసం దేశ భద్రతతో రాజీ పడ్డారని న్యాయమూర్తులు జిఎస్సింఘ్వి, ఎజి గంగూలీతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. టెలికం రంగంలో 2జి కేటాయింపులు జరిపిన రెండు కేసుల్లో భద్రతకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు జరుగుతున్నదని, ఈ కంపెనీల విషయంలో హౌం మంత్రిత్వశాఖ వ్యక్తంచేసిన అభ్యంతరాలు అత్యంత తీవ్రమైనవని న్యాయమూర్తులు గుర్తు చేశారు...........
ధాన్యానికి బోనస్ ఇవ్వాలి
రైతులకు మద్దతు ధర కల్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు విమర్శించాయి. వరి రైతుకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశాయి. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయంపై జరిగిన చర్చలో తెలుగు దేశంతోపాటు విపక్షపార్టీల సభ్యులు మద్దతు ధర లభించని నేపధ్యంలో వరిరైతుకు బోనస్ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బియ్యం ఎగుమతులకు కేంద్రం నుండి అనుమతి తీసుకోవాలని కోరారు............
బీటీ ఆహారం స్సై సామాజిక కోణాలు
జన్యు మార్పిడి పంటల్లో బీటీ ఆహారం ఒక ప్రత్యేక రకానికి చెందిన ఆహారం. ఈ పంట మొక్కల్లో అంతర్గతంగా సీతాకోకచిలుక జాతి కీటకాలను చంపే బీటీి విషం నిరంతరం ఉత్పత్తి అవుతుంది. ఈ ఆహారాన్ని తింటే, దీనితోబాటు బీటీ విషాన్ని కూడా తినాల్సి వస్తుంది. అందువల్ల, బీటీ విషం కలిగిన ఆహారాన్ని 'బీటీి విషాహారం'గా పిలవడం ఉచితం. కానీ, ఇలా పిలవడానికి వీనిని రూపొందించి, అమ్మే కంపెనీలు గానీ, వీరికి మద్దతు ఇస్తున్నవారు కానీ అంగీకరించరు. ఇలా పిలిస్తే, తినే ఆహారంలో విషం వుందని తెలుసుకుని చూస్తూ, చూస్తూ తినడానికి ఎవరూ ముందుకురారు. బీటీి వంగ రూపంలో బీటీ విషాహారాన్ని తినిపించడానికి ప్రయత్నాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నాయి.................
పేదలకు సబ్సిడీ కోత-ధనికులకు రాయితీల పెంపు!
ఆమ్ఆద్మీ, సమీకృత పురోగతి అంటూ ఎంత ఆర్భాటం చేసినప్పటికీ ప్రస్తుత బడ్జెట్ ఆర్థిక అసమానతలను విపరీతంగా పెంచుతుంది. గత రెండేళ్ళ కాలంలో శతకోటీశ్వరుల సంఖ్య దాదాపు రెట్టింపైంది. సంఖ్య రీత్యా చూస్తే 52మంది ఉండొచ్చు. కానీ, వీరందరి ఆస్తుల విలువ కలిపిచూస్తే మన జిడిపీలో నాల్గవవంతుకు సమానం. ఈ ఏడాది వీరి సంఖ్య 69కి పెరిగినట్లు సమాచారం (ఈ తెగ ఇంకా పెరగవచ్చు). అయినప్పటికీ మన జిడిపీలో ప్రజారోగ్యానికి 3 శాతాన్ని, విద్యకు 6 శాతాన్ని కేటాయించటానికి మనం చాలా దూరంలో ఉన్నాము..........
ఆఫ్ఘన్ యుద్ధం రికార్డు స్థాయిలో పౌరుల మృతి ఐరాస వెల్లడి
ఆఫ్ఘనిస్తాన్లో దాదాపు దశాబ్ద కాలంగా జరుగుతున్న యుద్ధంలో సాధారణ పౌరులే రికార్డు స్థాయిలో మృతి చెందారని ఐక్యరాజ్యసమితి వెల్లడిం చింది. ముఖ్యంగా గత ఏడాది కాలంలో పౌరులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు రెట్టింపయ్యాయని ఐరాస తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. గత ఏడాది కాలంలో మొత్తం 462 హత్యలు జరగ్గా ఇందులో సగానికి పైగా దక్షిణాన తాలిబన్లకు గట్టి పట్టున్న ప్రాంతాల్లో జరిగినవే. ఈ ప్రాంతాల్లో తమ దళాలు పట్టు సాధిస్తున్నాయంటూ అమెరికా చేస్తున్న ప్రచారంలోని డొల్ల తనాన్ని ఈ నివేదిక ఎండగట్టింది. ఈ పదేళ్ల యుద్ధకాలంలో మొత్తం 2,777 మంది సాధారణ పౌరులు మృత్యువాత పడగా 2010లో ఇది మొత్తమ్మీద 15 శాతం పెరిగిందని, గత నాలుగేళ్లుగా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోందని వివరించింది.............
దిల్షాన్ డోపింగ్ ?
ప్రపంచ కప్లో శ్రీలంక తరఫున ఆడుతున్న ఆల్రౌండర్ తిలకరత్నే దిల్షాన్ డోపింగ్ టెస్ట్లో పట్టుబడినట్లు శ్రీలంక మీడియా తెలియజేసింది. రాండమ్ డోపింగ్ టెస్టులో భాగంగా తిలకరత్నేను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎంపిక చేసి పరీక్ష నిర్వహించిదని, ఆ పరీక్షలో దిల్షాన్ నిషేధిత ఉత్పేరకాలు తీసుకున్నట్లు వెల్లడయ్యిందని మీడియా తెలియజేసింది...............
మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు : తెలంగాణా కాంగ్రెస్ ఎంపీల ఆరోపణ
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. అణిచివేత ద్వారా ఉద్యమాన్ని అడ్డుకోవాలన్న వైఖరిని ప్రభుత్వం విడనాడాలని వారు హితవు పలికారు. ప్రస్తుత సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం కూడా ఎంపీలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మిలియన్ మార్చ్కు మద్దతుగా సమావేశాలకు.........
రోశయ్యపై కేసు
హైదరాబాద్ అమీర్పేటలోని మైత్రీవనం భూబదిలీ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్యతో సహా 14 మందిపై ఏసిబి కేసులు నమోదు చేసింది. వీరిపై ఐపిసి 404, 409, 420, 120 బి అవినీతి నిరోధక చట్టం 11, 12, 13 సెక్షన్ల కింద ఏసిబి కేసులు నమోదు..........
క్రొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)