శుక్రవారం 4 మార్చి 2011

రాష్ట్రాన్ని తగలబెడుతున్నారు

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్‌ను తగలబెడుతున్నారని టిడిపి పొలిట్‌ బ్యూరో సమావేశం విమర్శించింది. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడినా సోనియా గాంధీ కళ్లు తెరవకపోవడం విచారకరమని పేర్కొంది. సోనియా భారతీయురాలు అయివుంటే ఇక్కడి సమస్యలు తెలిసేవని, ఇటాలియన్‌ కాబట్టే మౌనంగా ఉందని విమర్శించింది. గురువారం చంద్రబాబు నివాసంలో జరిగిన పొలిట్‌బ్యూరో.........

మాజీ ఎమ్మెల్యే, రెండు టివి ఛానళ్లకు కోర్టు ధిక్కరణ నోటీసులు

న్యాయస్థానంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, న్యాయమూర్తి చేయని వ్యాఖ్యలను ఆయనకు అంటగడుతూ మీడియాకు ఎక్కిన విజయవాడ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్‌కు, ఈ వార్తను పదే పదే ప్రసారం చేసిన రెండు టివి ఛానళ్లకు హైకోర్టు గురువారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌ శ్రీకృష్ణపై కించపర్చే వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి జస్టిస్‌ నరసింహారెడ్డిపై చర్య తీసుకోవాలంటూ జయప్రకాష్‌ రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదును సుమోటో కోర్టు ధిక్కరణ కేసుగా స్వీకరిస్తూ జస్టిస్‌ ఎల్‌. నరసింహారెడ్డి జయప్రకాష్‌కు.........

మన మాటల్లో, సంగీత పరికరాల ధ్వనుల్లో తేడాలెందుకు?

'బ్లాక్‌మనీ'

కెసిఆర్‌కు అద్వానీ షాక్‌

టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌కు బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ గురువారం పెద్ద షాక్‌ ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ డిమాండుతో లోక్‌సభా కార్యక్రమాలను అడ్డుకోవడం తగదన్న అద్వానీ వ్యాఖ్యలతో ఆశ్యర్యపోవడం కెసిఆర్‌ వంతైంది. పలు వాయిదాల అనంతరం లోక్‌సభ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైంది. ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ టిఆర్‌ఎస్‌ ఎంపీలు కెసిఆర్‌, విజయశాంతితో పాటు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు మరోసారి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎల్‌కె అద్వానీ మాట్లాడుతూ... 'ప్రస్తుతం తెలంగాణ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్న విషయం వాస్తవం. అయితే తెలంగాణ డిమాండుతో సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదు. పార్లమెంటును ఉయోగించుకుని,...............