.

28, ఫిబ్రవరి 2011, సోమవారం

నకిలీ లైసెన్స్‌తో విమాన సారథ్యం

ఫోర్జరీ పత్రాలతో సంపాదించిన పైలట్‌ లైసెన్స్‌తో ప్రయాణికుల విమానాలకు సారథ్యం వహిస్తున్న ఓ మహిళా పైలట్‌ గుట్టు రట్టయింది. గత నెల 11న గోవా విమానాశ్రయంలో జరిగిన ఒక ఘటనలో ఈ ఉదంతం వెలుగులోకి రావటంతో పౌర విమానయాన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఆమె లైసెన్స్‌ను రద్దు చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కెప్టెన్‌గా పనిచేస్తున్న........

పరీక్షల్లో ఒత్తిడి సహజమే కానీ...

పరీక్షల సీజన్‌ వచ్చేసింది. మార్చి మొదటి వారం నుంచి మే వరకు వార్షిక పరీక్షల సీజన్‌. పరీక్షలు రాసే విద్యార్థుల్లో అప్పుడే ఒత్తిడి మొదలైంది. సరిగ్గా రాస్తామో లేదో? చదువుకున్నవి వస్తాయా? లేక పేపర్‌ టఫ్‌గా వస్తుందా? అనే చర్చలు విద్యార్థులో మొదలయ్యాయి. ఈ ఒత్తిడి సెగకూడా తల్లిదండ్రులకూ తగిలింది. పరీక్షల్లో ఒత్తిడి ఎంత మేరకు అవసరం, ఎందుకు? ఎక్కువైన ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి? పరీక్షలకు ముందు ఎలా మానసికంగా సిద్ధమవ్వాలి, ఒత్తిడిని ఎలా చిత్తు చేయాలో తెలుసుకుందాం........

ఫిప్టీ-ఫిప్టీ

 వన్డే క్రికెట్‌ మజాను భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌ రుచి చూపించింది. చివరి బాల్‌ వరకు నువ్వా, నేనా అన్న రీతిలో సాగిన ఈ మ్యాచ్‌ చివరకు టైగా ముగిసింది. ఇరు జట్లు చెరొక పాయింట్‌ గెలుచుకుని సమ ఉజ్జీగా నిలిచాయి. టాస్‌ గెలిచిన భారత్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. సచిన్‌ విజృంభణతో 338 పరుగులు భారీ స్కోరు సాధించింది. ఇందుకు సమాధానంతో ఇంగ్లండ్‌ నిర్ణిత 50 ఓవర్లలో 338 పరుగులు చేసింది. మునాఫ్‌ వేసిన చివరి ఓవర్లలో తొలి బంతికి స్వాన్‌ రెండు పరుపగులు తీసుకున్నాడు...........

వారసత్వం నాకులేదు: అక్కినేని

బ్రేకింగ్‌న్యూస్‌ బాబూరావ్‌

శివాజీ కొత్త అవతారమెత్తాడు. 'బ్రేకింగ్‌ న్యూస్‌ బాబూరావ్‌' అంటూ కొత్త చిత్రం ద్వారా పలుకరించబోతున్నాడు. అయితే ఇది జర్నలిజానికి సంబంధించిన కథ కాదనీ, 'టాటా బిర్లా మధ్యలో లైలా' తరహాలో పూర్తివినోదాత్మకంగా ఉంటుందని చెబుతున్నారు. ఆదివారం ఛాంబర్‌లో ఆయన చిత్ర విశేషాలను తెలియజేశారు. కర్రి బాలాజీ చెప్పిన కథ నచ్చిందనీ, ఆయనే ఈ చిత్రానికి దర్శకునిగా పరిచయమవుతున్నారన్నారు. తేజస్వి క్రియేషన్స్‌, సూరితల్లి క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించనున్న

భారతీయుల అష్టకష్టాలు

 లిబియాలోని కొందరు భారతీయ ఉద్యోగులు ప్రాథమిక అవసరాలు అందని దైన్య స్థితిని ఎదుర్కొంటున్నారు. లిబియాలోని అనేక ప్రాంతాల్లో తాగునీరు, ఆహార కొరత తీవ్ర సమస్యగా పరిణమించింది. దిగజారిన లిబియా జీవన స్థితిగతులకు ఇది అద్దం పడుతోంది. ఈ పరిస్థితి అనేక పట్టణాలకు వ్యాపించింది. దీంతో బాధలు పడలేక వారిలో కొందరు తెగించి లిబియాలోని జవియా పట్టణం నుంచి సరిహద్దును దాటి పొరుగునే ఉన్న ట్యునీషియా లోకి ప్రవేశించారు. అధ్యక్షుడు ముమ్మర్‌ గడాఫీ అనుకూల సాయుధ బలగాలకు, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులకు మధ్య భీకర పోరు జరుగుతోంది. 42 సంవత్సరాల గడాఫీ పాలనకు చరమ గీతం పాడాలనే ధృఢసంకల్పం ఆందోళనకారుల్లో కన్పిస్తోంది.

వారసత్వం నాకులేదు: అక్కినేని

''నటనలో వారసత్వం నాకులేదు. మా తల్లిదండ్రులకు ఆ గొడవేతెలీదు. నా తర్వాత వారికి అది వచ్చింది. అదేవిధంగా కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌కు ఆయన తర్వాత వారసత్వం వచ్చింది. ఆయన మంచి వ్యక్తి. ఆయన లక్షణాలను ఆయన ముగ్గురు కుమారులు పుణికిపుచ్చుకున్నారని'' అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. పునీత్‌రాజ్‌కుమార్‌ నటించిన 'జాకీ' చిత్రాన్ని తెలుగులో సూరజ్‌ ఫిలింస్‌ బేనర్‌పై నాదెళ్ళ సుజాత విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథి అల్లు అర్జున్‌ ఆడియోసీడీని విడుదలచేసి అక్కినేనికి, కైకాలకు అందజేశారు. ఈ సందర్భంగా అక్కినేని... రాజ్‌కుమార్‌తో తనకుగల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

గణతంత్ర దినోత్సవంలో దళితులకు అవమానం

యావత్‌ దేశం గౌరవించాల్సిన జాతీయ జెండాను, దాని కోసం నిర్మించిన గద్దెను అక్కడ దళితులు నిర్మించుకోవడమే తప్పయింది. కొంత మంది దళిత యువకులు కలిసి నిర్మించిన గద్దెను గ్రామంలోని అగ్రకులాల పెద్దలు పట్టపగలే కూల్చేసి దళితులను అవమానించారు. అదెక్కడో మారుమూల పల్లె కాదు జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న ఓ గ్రామం. ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు..........

భారతీయులను అప్రతిష్టపాలు చేసే పాఠ్యాంశంపై నిరసన తెలిపినందుకు మలేషియాలో భారతీయుల అరెస్టు

27, ఫిబ్రవరి 2011, ఆదివారం

ఢిల్లీకి సూట్‌కేసులు

హిందూజా సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై శాసనమండలిలో తీవ్ర దుమారం రేగింది. ప్రభుత్వానికి, టిడిపికి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ప్రభుత్వానికి ఎందుకింత ప్రేమ? అని మండలి ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. హిందుజా సంస్థలను రక్షించడానికి ఢిల్లీ నుంచి గల్లీ దాకా సూట్‌కేసులు చేతులు మారాయని ఆరోపించారు. రాష్ట్రం తగలబడి పోతున్నా కాంగ్రెస్‌ వారికి సూట్‌కేసులే కావాలని.........

అమ్మా.. శిథిలాల కిందున్నా !

టీనేజీ బాలికలకు తిండి కొరత

అరచేతిలో విశ్వదర్శనం

దశాబ్దం కిందట సొంతంగా మొబైల్‌ ఫోన్‌ వుండటమే ఓ విలాసం. ఇప్పుడు పరిస్థితి చెప్పక్కర్లేదు. జీవితంలో 'ప్రాథమిక' అవసరమై పోయింది. సాంకేతిక రంగంలో ఇదో విప్లవం. చేతిలో ఇమిడిపోయే ఈ ఫోన్‌లోనే మొబైల్‌ ఇంటర్నెట్‌ రూపంలో మరో విప్లవం చోటుచేసుకుంటోంది. చేతిలోనే విశ్వసందర్శనం చేసే వీలు కల్పిస్తోంది. అత్యంత వేగవంతమైన 3జి సేవలు అందరికీ అందుబాటులోకి వస్తే మొబైల్‌ ఇంటర్నెట్‌ వినియోగదార్ల సంఖ్య మరింతగా ఊపందుకుంటుంది. మొబైల్‌ ఇంటర్నెట్‌ మార్కెట్‌ పురోగతులపై బిజ్‌సిటి నిర్వహించిన ప్రపంచవ్యాప్త  ...........

తెలంగాణాపై తేల్చండి

ప్రత్యేక తెలంగాణా అంశంపై ఏదో ఒక వైఖరిని వెల్లడించక తప్పదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానానికి తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా, సాధ్యమైనంత త్వరగా తెలంగాణా అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్రనేత ప్రణబ్‌ ముఖర్జీతో శనివారం ఆయనిక్కడ విడివిడిగా సమావేశమయ్యారు. తొలుత ప్రణబ్‌తో మధ్యాహ్నం అరగంటకు పైగా సమావేశమయ్యారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు సోనియాగాంధీతో అరగంట పాటు చర్చలు జరిపారు. ఈ భేటీ ముగిసిన తర్వాత నేరుగా హైదరాబాద్‌ వెళ్లాలని తొలుత ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. ఈమేరకు తన లగేజిని కూడా సిద్ధం చేసుకున్నారు..........

సెన్సార్‌ పూర్తయిన 'మంగళ'

 చార్మి ప్రదాన పాత్ర పోషిస్తోన్న 'మంగళ' సెన్సార్‌ పూర్తిచేసుకుంది. దర్శక నిర్మాత ఓషో తులసీరామ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. చిత్రం గురించి చెబుతూ...'మంత్ర తరహాలోనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అంశాలతో రూపొందింది. రక్తం కన్పించకుండా థ్రిల్‌ కలిగించే విధంగా తీశాం. మంగళ అనేది చార్మి పాత్ర పేరు. ఆమె జీవితంలో ఎదురైన సంఘటనలకు ఎలాంటి చర్యలను తీసుకుందనేది పాయింట్‌. ప్రతి పాత్రా వైవిధ్యంగా ఉంటుంది...........

లాడెన్‌ బతికే ఉన్నాడు

26, ఫిబ్రవరి 2011, శనివారం

కోడలిపై మామ అత్యాచార యత్నం

కోడలిపై మామ అత్యాచారానికి యత్నించిన సంఘటన శుక్రవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మునారాయణ పురానికి చెందిన బాడితమాని ఎల్లయ్య తన కోడలు రమణమ్మపై శుక్రవారం రాత్రి అత్యాచారానికి యత్నించాడు. కొంతకాలంగా ఆమెను ఎల్లయ్య వేధిస్తున్నాడు. కుమారుడు ఇంట్లో లేని సమయంలో అల్లరి చేయడంతో తండ్రీ కొడుకుల మధ్య తరచూ గొడవలు.............

మాటల బురిడీ

విలువైన కాలం

 కాలం ఎంతో విలువైనది. అమూల్యమైనది. ఒక్క క్షణం వృథాగా జారిపోతే తిరిగి సంపాదించుకోలేం. ఆస్తులు చేజారిపోతే తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ, గడచిపోయిన కాలాన్ని తిరిగి పొందలేం. దీని విలువ తెలుసుకోకుండా ఎందరో సమయాన్ని వృథా చేసుకుని తర్వాత తీరిగ్గా విచారిస్తారు. అప్పుడు ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. గతించిన కాలాన్ని వెనక్కు తీసుకురావడం అసాధ్యం.  .............

మధ్య ప్రాచ్యంలో చారిత్రక మార్పులు

స్ధూలంగా చూసినట్లయితే మధ్య ప్రాచ్య ఆందోళనల్లో మూడు లక్షణాలు కన్పిస్తాయి. అవి: 1) ప్రజాస్వామ్యంపట్ల ప్రజల ఆకాంక్ష 2) ఆర్థికపరమైన బాధలు 3) సామ్రాజ్యవాద వ్యతిరేక భావనలు. ఈ దేశాలలోని పరిస్థితి లెనిన్‌ చెప్పినట్లుగా, ''దిగువ వర్గాలు పాత మార్గాలలో జీవించజాలవు'' అన్నట్లుగా ఉన్నది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా, ''అణగారిన వర్గాల లేమిడి, వేదనలు సాధారణ పరిస్థితిలోకన్నా తీవ్రతరమయ్యాయి'',

వరకట్నం - వికృతరూపాలు

మనిషి మనుగడలో నేడు పాశ్చాత్యీకరణ ప్రభావం బలంగా కనపడుతుంది. ఐతే అది సాంఘిక మార్పుకు దారితీసింది. కానీ వ్యక్తిగత మార్పుకు దారితీయలేదు. ఇక్కడ ఆధునికతకు తప్ప అభ్యుదయానికి ప్రాధాన్యత లేదు. మనిషి తన స్వార్థానికి అనుకూలమైన మార్పును ఒప్పుకుంటాడు. అందులో భాగంగానే అత్యున్నత జీవనంకోసం ఆధునికతను అంగీకరిస్తాడు. కానీ మూఢనమ్మకాలు, దుస్సంప్రదాయాలను తెంచుకోవాలని చూడడు. మనిషి జీవితంలో మధురానుభూతిగా మిగిలిపోయే వివాహం నేడు గుదిబండగా మారడానికి వరకట్నం అనే దుస్సంప్రదాయమే ప్రధానమైనది..............

సభలో మమత అలక

కొండలను కొడుక్కు రాసిచ్చిన మాజీ సిఎం

ఏడు కొండల్లో రెండు కొండలు తిరుమల తిరుపతి దేవస్థానానికి (టిటిడి) చాలని, మిగిలిన ఐదు కొండలను కొడుకు, అల్లునికి మాజీ ముఖ్యమంత్రి రాసిచ్చారని మండలి ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు ఆరోపించారు. అబ్బాయికి, అల్లుడికి ఇచ్చినట్లు ఎక్కడుందని మంత్రి పార్థసారధి, కాంగ్రెస్‌ సభ్యులు ప్రశ్నించారు. దీంతో ఈ వ్యాఖ్యలు.......

25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

అతనికి నిద్ర రాదు

ఇద్దరు ఒక్కటైతే!

నేటి యువతుల్లో ఆత్మవిశ్వాసం మెండు. మారిన సాంఘిక పరిస్థితులు, అందుబాటులోకి వచ్చిన విద్య, తల్లిదండ్రుల ప్రోత్సాహం... వారి వ్యవహారశైలిలో చెప్పుకోదగ్గ మార్పులు తీసుకొచ్చాయి. పూర్వం పెళ్లి సంబంధాల్లో అమ్మాయికి వంటపని, ఇంటిపని ఇవే ప్రాతినిధ్యాలు. కానీ నేడు చదువు, ఉద్యోగం ఇవే ముఖ్యాంశాలు. నాగరికత మారుతున్న మనుషుల ఆలోచన దృక్పథాన్ని మార్చేసింది. ఇంతమారినా కట్నం అలానే.......

తప్పు జరిగింది

బిట్‌శాట్‌ - 2011 సమర్థతకు సవాలు

అత్యున్నత సాంకేతిక నైపుణ్యం కలిగిన నిపుణులు భారతదేశానికి ఎంతగానో అవసరం. పలు రంగాల్లో వీరి కొరత చాలా ఉంది. దానికోసం జాతీయ స్థాయిలో ఏర్పాటైన విద్యా సంస్థ బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిఐటిఎస్‌). ప్రతిభ గల విద్యార్థులను ఎంపిక చేసి, అత్యున్నతమైన విద్యనందిస్తారు. గత కొన్నేళ్లుగా పేపర్‌ బేస్డ్‌గా ఉన్న ఈ బిట్స్‌ పరీక్ష, ఇపుడు ఆన్‌లైన్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. మొదటి క్యాంపస్‌ రాజస్తాన్‌లోని పిలానీలో ప్రారంభమైంది. ఇప్పుడు హైదరాబాదు, గోవాలలో తమ శాఖలను విస్తరించింది. ఉన్నతమైన ప్రమాణాలతో విద్యనందిస్తున్న జాతీయ సంస్థల్లో బిట్స్‌ ఒకటి. ఐఐటి, ఎన్‌ఐటి మొదలయిన వాటి తర్వాత యువత దృష్టి వీటిపై ఎక్కువగా ఉంది. స్వేచ్ఛగా, సృజనాత్మకమైన ఆలోచనా విధానానికి బిట్స్‌ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులెంతో మంది ఈ పరీక్ష కోసం ఎదురుచూస్తున్నారు. వాటి వివరాలు....

విద్యాహక్కు నిబంధనలు - సవాళ్లు

ప్రమాదంలో ఆఫ్ఘన్‌ బాలికా విద్య

ఆఫ్ఘనిస్తాన్‌లో 2001లో తాలిబాన్‌ పాలనను కూలగొట్టిన నాటి నుంచి మహిళలు సాధించిన అతి పెద్ద విజయాల్లో ఒకటైన బాలికల విద్య అభద్రత, నిధుల లేమి, పరికరాల కొరత, చాలా నాసిరకంగా ఉన్న ఉపాధ్యాయ శిక్షణ వంటి వాటి మూలంగా ప్రమాదంలో ఉన్నట్లు సహాయ గ్రూపులు గురువారం తెలిపాయి. తాలిబాన్ల పాలనా కాలంలో బాలికలు చదువుకోవడాన్ని నిషేధించారు. ఇప్పుడు అదే గ్రూపు తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే............

2011-12 రైల్వే బడ్జెట్‌ బడ్జెట్‌ ముఖ్యాంశాలు

* 2011-12 వార్షిక ప్రణాళిక రూ.57,630 కోట్లు
* రైల్వే బడ్జెట్‌ 1,06,239 కోట్లు
* లక్షకోట్ల మార్కు దాటిన రైల్వే ఆదాయం
* మార్కెట్‌ రుణాలు రూ.2,059 కోట్లు
* ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో 85 ప్రతిపాదనలు
* 20:20 విజన్‌లో భాగంగా కొత్త కోచ్‌ల నిర్మాణప్లాంట్‌లు
* దేశ ఆర్థిక వృద్థి శాతం కంటే రైల్వేలది అధికం
* వరంగల్‌ జిల్లా ఖాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ  ..............

'బుడుగు' సజీవం

 


తెలుగువారి జీవన విధానాన్ని, అందులోని మాధుర్యాన్ని, చక్కలిగింతలు పెట్టే విమర్శనాత్మక శైలిని చూపిన అరుదైన రచయిత ముళ్లపూడి వెంకటరమణ. సినిమారంగంలోనూ కథా రచయితగా తనదైన ముద్రను పాదుకొల్పారు. వివిధ ప్రక్రియల్లో కథావిష్కరణ చేశారు. వ్యంగ్య రచనల్లో చేయి తిరిగిన వాడు. ప్రాణ స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు బాపుతో కలిసి ఎన్నో.....

ప్రపంచ కప్‌లో చీకటి కోణాలు

అంచనాల తారు మారు, అనూహ్య ప్రదర్శనలు, గెలుపు-ఓటమలు, వ్యక్తిగత ప్రతిభ, ఊహకందని రాబడి, రికార్డులను తలదన్నే రికార్డులు, మెరుపులు-మరకలు వెరసి ప్రపంచకప్‌ చరిత్ర. మరకలు తప్ప మిగిలిన అన్ని విషయాలను సహజంగా అంతా చెప్పుకుంటూనే ఉంటారు. మరి మరకల సంగతి? మరకల నమోదులోను ప్రపంచకప్‌కు మినహాయింపేమీ లేదు. అది హరారేలో చేతికి పట్టీలు(ఆర్మ్‌ బ్యాండ్స్‌) ధరించడం కావచ్చు కొల్‌కతలో బాణాసంచా పేలుళ్లు కావచ్చు........

పేరు గొప్ప... ఊరు దిబ్బ

24, ఫిబ్రవరి 2011, గురువారం

పెళ్లి కళ వచ్చేసిందే బాలా...!

దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి వివాహం గురువారం స్థానిక బూచేపల్లి ఇంజనీరింగ్‌ కళాశాలలో రంగరంగ వైభవంగా జరగనుంది. ముండ్లమూరు మండలం, జమ్మలమడక గ్రామానికి చెందిన కాపా రమణారెడ్డి కుమార్తె నందినితో ఆయన మనువాడనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగు తున్నాయి. గత వారం రోజులుగా విశాలమైన స్థలంలో పెళ్లి సెట్టింగ్‌లు నిర్మించడంలో పలువురు నిమగమయ్యారు. వివాహానికి గతంలో ఈ ప్రాంతంలో జరగని విధంగా ఏర్పాట్లు జరపాలని నిర్ణయించారు...........

సచిన్‌ లెప్ట్‌ హ్యాండ్‌ బ్యాటింగ్‌సచిన్‌ లెప్ట్‌ హ్యాండ్‌ బ్యాటింగ్‌

చేతుల్లో పాపతో తల్లి మృతి

న్యూజిలాండ్‌లో దక్షిణ దీవిలోని క్రిస్ట్‌చర్చిలో మంగళవారం సంభవించిన భూకంపంలో చేతులపై బిడ్డతో తల్లి మరణించిన సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.3 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం విధ్వంసాన్ని సృష్టించింది. దాదాపు 75 మంది ప్రాణాలను బలి తీసుకుంది. భూకంపం సంభవించినప్పుడు క్రిస్ట్‌చర్చిలోని.......

మోహనకృష్ణ దర్శకత్వంలో సుశాంత్‌


క్రియేటివిటీతో అందలం

క్రియేటివిటీ... ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ వినిపిస్తున్న పదం ఇది. కాలంతో పాటు పరుగెత్తాల్సిన ఈరోజుల్లో ఇది అత్యంత ఆవశ్యం కూడా. క్రియేటివిటీ ఏ ఒక్కరి సొత్తూ కాదు. పుట్టుకతోనే ఎవరూ క్రియేటివ్‌ కారు. మనలో అంతర్లీనంగా ఉండే శక్తి అది. దాన్ని తట్టి లేపితే అందరూ అద్భుతాలను సృష్టించొచ్చు. సమాజంలో విజేతలుగా తమ పేరును సుస్థిరం చేసుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా రొటీన్‌కు భిన్నంగా ఆలోచించడమే.........

గడాఫీపై పెరిగిన ఒత్తిడి

లిబియా ఉన్నత స్థాయి అధికారుల రాజీనామాలు, ఐరాస భద్రతా మండలి ఖండనతో ఒంటరిపాటైన ఆ దేశాధ్యక్షుడు గడాఫీపై ఒత్తిడి పెరిగింది. గడాఫీకి గట్టిగా అండగా ఉంటారని పరిగణిస్తున్న అంతర్గత వ్యవహారాల మంత్రి అబ్దెల్‌ ఫలా యూనెస్‌ తన పదవికి రాజీనామా చేసి ప్రతిపక్షంలో చేరిపోయారు. విప్లవం కొద్ది రోజులు లేదా గంటల్లోనే విజవంతమవు తుందని ఆయన అన్నారు. ప్రజలతో చేరాల్సిందిగా ఆయన లిబియా భద్రతా దళాలకు పిలుపునిచ్చారు. భద్రతా దళాలకు చెందిన పలువురు అధికారులు ఇప్పటికే ఫిరాయించినట్లు ఆయన చెప్పారు.............

శరవేగంగా 'శ్రీరామరాజ్యం'

బాలకృష్ణ రాముడిగా, నయనతార సీతగా నటిస్తోన్న 'శ్రీరామరాజ్యం' షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. బాపు దర్శకత్వం వహిస్తున్నారు. యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 35శాతం షూటింగ్‌ పూర్తయింది. కొంత గ్యాప్‌ తర్వాత మళ్ళీ మార్చి 25 నుంచి నిర్వరామంగా జరిగే షూటింగ్‌తో పూర్తి చేయనున్నారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ...........

పాంటింగ్‌ టివి పగులకొట్టలేదు

బుధవారం గ్రూప్‌-ఎలో జింబాబ్వేతో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ రనౌట్‌ అయిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో టివీ పగలగొట్టినట్టు వచ్చిన వార్తలపై ఆసీస్‌ మీడియా మేనేజర్‌ స్పందించారు. 'అతను టివి పగులకొట్టలేదు. ఒక బాక్స్‌ను గోడకేసి కొట్టడంతో అది వెళ్ళి టివి వెనక పడింది. దాంతో టివిలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ సంఘటన పట్ల వెంటనే పాంటింగ్‌ క్షమాణాలు చెప్పాడు. టీమ్‌ మేనేజర్‌కు వివరణ కూడా ఇచ్చాడు. దాంతో ఈ సమస్య అప్పటితో ముగిసిపోయింది' అని ఆసీస్‌ టీమ్‌ మీడియా మేనేజర్‌ లాకె పాటర్సన్‌ తెలిపాడు..................

జీవించడానికి ఆక్సిజనే అవసరమా? నత్రజని సరిపోదా? మేఘాలు ఎందుకుంటాయి?

 మనిషి బతకడానికి ప్రధాన అవసరం శక్తి. యంత్రాల్లాగా పెట్రోలుతో నడిచే చక్రాలు, బిసలు(knobs), ముషలకాలు(pistons), కరెంటుతో నడిచే మోటార్లు, సర్క్యూట్‌ బోర్డులు జీవుల్లో లేవు. జీవుల్లో ఉన్న శక్తి పూర్తిగా రసాయనిక శక్తే. ఈ రసాయనిక శక్తిని మనం ఆహారంలో ఉండే పోషక పదార్థాల(nutrients) నుంచి పొందుతాము. తాళం తీయడానికి తాళం చెవి ఎలా అవసరమో పోషక పదార్థాల్లో దాగున్న శక్తిని........

బాదుడు బడ్జెట్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి లక్ష కోట్ల రూపాయలకుపైగా బడ్జెట్‌ను ప్రతిపాదించింది. లక్ష కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. 2011-12 ఆర్థిక సంవత్సరానికి రూ.1,28,542 కోట్ల బడ్జెట్‌ను బుధవారం శాసనసభలో ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ప్రవేశపెట్టారు. సస్పెన్షన్లు, నిరసనలు, బాయికాట్‌లతో పాటు స్వపక్షంలోనే విపక్షంగా వ్యవహరిస్తున్న.....

పాంటింగ్‌ క్షమాపణ

23, ఫిబ్రవరి 2011, బుధవారం

మూడో పెళ్లికి సిద్ధపడిన ఘనుడు

ఒక మహిళను వివాహమాడి ఆమెకు విడాకులిచ్చి, తరువాత మళ్లీ పెళ్లి చేసుకుని ఆమెను ఇప్పుడు కాదని మూడో పెళ్లికి సిద్ధపడిన ఓ ప్రబుద్దుని ఉదంతమిది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... చినగదిలి నేతాజీనగర్‌లో నివాసం ఉంటున్న బి.శ్రీనివాసరావు ఐదేళ్ల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో తెలియకుండా జరిగిన ఈ పెళ్లి ఇరువురి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో విడాకులు  ............

చిన్నారుల ఆవేదన

ఇటీవలే తల్లి హత్యకు గురైంది. ఆ కేసులో తండ్రి, చిన్నాన్నలు నిందితులుగా ఉన్నారు. తమని బంధువులు కూడా ఆదరించడంలేదు. తిరిగి బంధువుల తమ ఆస్తిని విక్రయించి అనాథలను చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఇద్దరు చిన్నారులు విలేకరుల వద్ద మంగళవారం వాపోయారు. వివరాల్లోకి వెళ్తే నరసన్నపేట మండలం లకిమేరకు చెందిన ఇద్దరు ...............

తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారు

తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు ప్రయత్ని స్తున్నారని టిఆర్‌ఎస్‌ పేర్కొంది. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోనూ చేతులు కలపడానికి వెనకాడరని విమర్శించింది. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యులు జగదీశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌ మాట్లాడారు. టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ చేత చంద్రబాబు.............

పరిటాల హత్యకేసు మరో నిందితుడి హత్య

పరిటాల హత్యకేసులోని మరో నిందితుడిని హత్య చేశారు. దుండగులు ఇంట్లోకే వచ్చి తుపాకితో కాల్చి పరారయ్యారు. అనంతపురం జిల్లా కేంద్రం సాయినగర్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... తగరకుంట కొండారెడ్డి (55) ఇంట్లో వున్న సమయంలో సాయంత్రం 6.30 గంటలకు టోపీలు పెట్టుకున్న ముగ్గురు యువకులు వచ్చారు. 'అన్న ఉన్నాడా' ..............

జేజమ్మా...తెలంగాణా ఇచ్చెయ్ !

ఆయనొక నిఘంటువు

దేశంలోనే ఉన్నా

22, ఫిబ్రవరి 2011, మంగళవారం

వ్యాధి నిరోధకాలు

సరిగ్గా ఉపయోగిస్తే ఏంటీ బయాటిక్స్‌ (వ్యాధినిరోధకాలు) చాలా ఉపయోగకరమైనవి. అవి బ్యాక్టీరియా అనే సూక్ష్మజీవి వల్ల వచ్చిన అంటువ్యాధులతోను, జబ్బులతోనూ పోరాడతాయి. అందరికీ తెలిసిన ఏంటీబయాటిక్స్‌ పెన్సిలిన్‌, టెట్రాసైక్లిన్‌, స్ట్రెప్టోమైసిన్‌, క్లోరాంఫినికాల్‌. వ్యాధి నిరోధక టీకాలు ఏలా ఉపయోగించాలి ? జాగ్రత్తగా ఎలా వాడాలి ? ఏంటీ బయాటిక్‌ పనిచేయకపోతే ఏం చేయాలి ? ఆ వివరాలు చూద్దాం...........

ప్రాణం నిలిపే సేవలో డివైఎఫ్‌ఐ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌

పిడిఎఫ్‌ అభ్యర్థుల నామినేషన్‌

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థులు విటపు బాలసుబ్రమణ్యం, యండపల్లి శ్రీనివాసులురెడ్డి సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. మూడు జిల్లాల నుంచి వేలాది మంది మేధావులు, ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. అలాగే మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గంలో పాతూరి సుధాకర్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు............

నమిత 'లవ్‌ కాలేజీ'

నమిత ప్రధాన పాత్రలో రూపొందు తోన్న చిత్రం 'లవ్‌ కాలేజీ'. అల్లరి చిల్లరగా తిరిగే విద్యార్థులకు బుద్ధి చెప్పి, ఓ దారికి తీసుకొచ్చే లెక్చరర్‌గా కనిపించనుంది. ఎం.రవితేజరెడ్డి నిర్మాత. సారథి స్టూడియోస్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకుంది. రాకేశ్‌ మాస్టర్‌ ఆధ్వర్యంలో చివరి పాటను రామానాయుడు స్టూడియోలో చిత్రించినట్లు నిర్మాత తెలిపారు.

జయంతో ఆరంభం

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా 2011 ప్రపంచ కప్‌ను విజయంతో ప్రారంభించింది. సోమవారం జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌లో 91 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. జింబాబ్వేను 46.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్‌ చేసింది. మిచెల్‌ జాన్సన్‌ 19 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడ గొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు................

కురుల నుంచి సిరులు

అమెరికాకు పాకిన ఈజిప్టు ఉద్యమ స్ఫూర్తి

మరణ శిక్ష ఖరారు

రికార్డుల వేట

21, ఫిబ్రవరి 2011, సోమవారం

క్రికెట్‌ అభిమానులకు సైబర్‌ వల

'ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ఉచిత టికెట్లు..విజేతలతో పసందైన విందు..విలాసవంతమైన సౌకర్యాలు..పది మంది అతిథులకు రాచమర్యాదలు..ఇవన్నీ ఉచితంగానే సుమా!'..ఏంటిదంతా అనుకుంటున్నారా? సైబర్‌ నేరగాళ్ల సరికొత్త పన్నాగమిది. తమ వెబ్‌సైట్లలో సభ్యత్వం తీసుకుంటే లక్కీ విజేతలకు ప్రపంచకప్‌ ఫైనల్‌మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పిస్తామని ప్రకటనలు...........

మార్చి 6న అల్లు అర్జున్‌ వివాహం

సూరి హత్యకు సంబంధించి పోతులను విచారించిన సిసిఎస్‌ పోలీసులు

50 చిత్రాలకు దర్శకత్వం వహిస్తా : విజయనిర్మల

ఊదేశాయ్

ప్రపంచకప్‌ రెండో రోజు మ్యాచ్‌ల్లో మిన్ను విరిగి మీద పడలేదు. అద్భుతం ఏమీ జరగలేదు. అగ్రశ్రేణి జట్లు పసికూన వంటి జట్లపై సునాయాస విజయాలు సాధించాయి. కెన్యాపై కివీస్‌, కెనడాపై శ్రీలంక ఘన విజయాలు నమోదు చేసుకున్నాయి. రెండు మ్యాచ్‌ల్లోనూ సెకండ్‌ బ్యాటింగ్‌ జట్లు ఘన విజయం సాధించాయి. గత ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకుని సంచలనాలు సృష్టించిన కెన్యా ఈ సారి తొలి మ్యాచ్‌లో చేతులెత్తేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 69 పరుగులకు కుప్పకూలింది. కివీస్‌ ఎనిమిది ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా 72 పరుగులు చేసి సునాయాస విజయం సాధించింది. ఆదివారం నాడు జరిగిన మరో మ్యాచ్‌లోనూ అదే పరిస్థితి.

అన్ని భాషల్లో నటించాలన్నది కోరిక - సమీరారెడ్డి

మానసిక వికలాంగురాలిపై మానవమృగం పైశాచికం

20, ఫిబ్రవరి 2011, ఆదివారం

కురుల నుంచి సిరులు

'దొంగలముఠా' మార్చి 18న

డ్యాన్స్‌లు, పాటలు కాకుండా కథను నమ్ముకున్నా

మధుమేహ రాజధాని భారత్‌


 

మధుమేహానికి భారత్‌ రాజధానిగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్‌తో బాధ పడుతున్న వారిలో భారతీయులే నాలుగో వంతు మంది ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్‌ఓ), అంతర్జాతీయ డయాబెటిస్‌ ఫెరడేషన్‌ (ఐడిఎఫ్‌) పేర్కొంటున్నాయి. దీంతో భారత్‌లో వాస్తవంగా ఎంత మంది మధుమేహంతో బాధ పడుతున్నారో తెలుసుకోవడానికి భారత వైద్య పరిశోధన........

కంపెనీలకు దాసోహం - పర్యావరణానికి ద్రోహం

మహారాష్ట్రలోని జైతపూర్‌ అణువిద్యుత్‌ ప్రాజెక్టు, ఒరిస్సాలోని పోస్కో ప్రాజెక్టు( రేవు, ఉక్కు, విద్యుత్‌కేంద్ర నిర్మాణం), జార్ఖండ్‌లోని చిరియ గనుల తవ్వకం... ఈ మూడు ప్రాజెక్టులకు వర్తింపచేసిన నిబంధనలను చూసినట్లయితే విదేశీ పెట్టుబడులు ఎక్కువగా ఉన్నచోట పర్యావరణ ప్రభావ అంచనా పద్ధతులను ప్రభుత్వం పట్టించుకోనట్లుగా కనిపిస్తుంది. చిరియా గనుల విషయంలో విధించిన నిబంధనలతో పోలిస్తే, జైత్‌పూర్‌ (ఇక్కడ ఉన్నది ప్రభుత్వరంగ సంస్థయైనప్పటికీ ప్రధానంగా లాభించేది ఫ్రెంచ్‌ అణు సంస్థలు), పోస్కో (భారతదేశంలో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కలిగిన సంస్థ్ధ) లకు విధించిన నిబంధనలు సరళంగా ఉంటాయి. పోస్కో, జైతపూర్‌లపై సాంకేతికపరమైన అనేక నిబంధనలను విధించినప్పటికీ పర్యావరణ ప్రభావ అంచనా పద్ధతులు చాలా బలహీనంగా ఉన్నాయి. ఈ కంపెనీలకు ఈ వెసులుబాటు ఎందువల్ల ఇచ్చినదీ మంత్రిత్వ శాఖే తెలపాలి................

వీరేంద్ర విరాట్‌ విహారం


ఆట మొదలైంది... పరుగుల వేటా మొదలైంది. 2011 వరల్డ్‌కప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారత్‌ పరుగుల సునామీ సృష్టించింది. సెంచరీలతో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించింది. నాలుగేళ్ల క్రితం ఎదురైన పరాభవానికి తగిన విధంగా బదులు తీర్చుకుంటామన్న భారత బ్యాట్స్‌మెన్‌, అందుకు ఏ మాత్రమూ వెనక్కితగ్గకుండా చెలరేగారు. ఇన్నింగ్స్‌ మొత్తం క్రీజులో నిలబడతానని, బంగ్లా బౌలర్ల భరతం పడతానన్న సెహ్వాగ్‌ అన్నంత పనీ చేశాడు...........

నియంతృత్వంపై తుది వరకూ పోరు

హోస్నీ ముబారక్‌ను గద్దె దింపటంతో తమ పని పూర్తికాలేదని, నియంతృత్వంపై తుది దాకా పోరు కొనసాగిస్తామని ఈజిప్షియన్లు కృత నిశ్చయంతో చెబుతున్నారు. 1998లో తొలిసారిగా తిరుగుబాటు చేసి అరెస్టయిన 33 ఏళ్ల హోస్సామ్‌ ఎల్‌ హమ్లావీ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఈజిప్ట్‌లో నియంత గద్దె దిగినప్పటికీ నియంతృత్వానికి తెరపడలేదని, అణచివేత ఆగిపోలేదని అన్నారు. గత మూడు వారాలుగా యువత చేసిన తిరుగుబాటు ఇంకా పూర్తి కాలేదని, ఇంకా అణచివేత, హక్కుల కాలరాత కొనసాగుతోందని చెప్పారు...............

అభిమానుల సమక్షంలో 'శక్తి' ఆడియో

నకిలీ పెన్‌ డ్రైవ్ లతో జరభద్రం

టెక్నాలజీ పెరిగాక అసలు...నకిలీ సమస్య బాగా పెరిగింది. కంప్యూటర్‌ వాడకంతోపాటే కంప్యూటర్‌ పరికరాల వాడకం కూడా ఎక్కువైంది. సీడీలు, పెన్‌డ్రైవ్‌లు...ఆ కోవకు చెందినవే. బ్రాండెడ్‌ వాటికి ఏమాత్రం తీసిపోకుండా నకిలీవాటిని మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నారు. రోడ్లపక్కనే కాదు, పేరుమోసిన షాపుల్లో సైతం నకిలీ........

మందుకొట్టే గుర్రం

19, ఫిబ్రవరి 2011, శనివారం

సోనియాకు అద్వానీ క్షమాపణ

ఎన్టీఆర్‌, శృతి హాసన్‌ చిత్రం ప్రారంభం

సలలిత రాగ సుధారస మూర్తి సుసర్ల దక్షిణామూర్తి

అయిదున్నర దశాబ్దాల క్రితం 'సంతానం' (1955) చిత్రం కోసం ఘంటసాల పాడిన 'చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో...' పాట ఇప్పటికీ మనసు దోచే మధుర గీతం. అదే చిత్రం ద్వారా లతా మంగేష్కర్‌ పాడిన తొలి తెలుగు సినీగీతం 'నిదురపోరా తమ్ముడా...' మనసును తడి చేసే మంచి పాట! ఒరియా గాయకుడు రఘునాథ్‌ పాణిగ్రాహి 'ఇలవేలుపు' (1956) చిత్రం కోసం పాడిన 'చల్లని రాజా ఓ చందమామా...' నేటికీ ఓ మధురానుభూతి. 'నర్తనశాల' (1963) చిత్రంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన 'సలలిత రాగ సుధారస సారం...' లాంటి పాటలు తెలుగువారు ఎవరైనా, ఎన్నటికైనా మరిచిపోగలిగేవేనా? మరి, మంగళంపల్లి, లతా మంగేష్కర్‌, రఘునాథ్‌ లాంటి అగ్రశ్రేణి కళాకారులను మొట్టమొదటిగా తెలుగు సినిమాల్లోకి తెచ్చి, ఇలాంటి మధుర గీతాలు పాడించిన సంగీత దర్శకుడు ఎవరో ఎందరికి గుర్తున్నారు? 90 ఏళ్ళ వయస్సులో ఆయన ఇవాళ్టికీ మన మధ్యనే ఉన్నారని ఎందరికి తెలుసు? సంప్రదాయ సంగీతాన్ని ప్రాతిపదికగా చేసుకొని, దక్షిణ భారత సినీ సంగీతంలో సినిమాలోని సన్నివేశానికీ, సాహిత్యానికీ కొత్త సొబగులు చేకూర్చిన ఆ సంగీత దర్శకుడు - సుసర్ల దక్షిణామూర్తి..............

మీర్పూర్‌ విజేత ఎవరు ?

పదవ ప్రపంచకప్‌లో ప్రారంభమ్యాచ్‌ శనివారం నాడు భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరగనుంది.. ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుండటం విశేషం. నాలుగేళ్ల క్రితం ఏ జట్టు చేతిలోనైతే ఓటమి చవిచూసిందో ఆ జట్టుతోనే ప్రారంభమ్యాచ్‌ను ఆడుతుండటం సహజంగానే కొంత ఒత్తిడి కలిగిస్తుంది. అయితే రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో సాధించిన విజయాలు, దక్షిణాఫ్రికాతో సాధించిన విజయాలతో ఉత్సాహంగా ఉన్న భారత జట్టుఆ ఓటమి విషయాన్ని పక్కనపెట్టి ఈ సారి విజయం సాధించాలని పట్టుదలగా ఉంది...............

ప్రజాశక్తి సత్తా చాటాం


30 ఏళ్ల పాటు నియంతృత్వంగా దేశాన్ని పాలించిన ముబారక్‌... అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఈజిప్టు ప్రజలు శుక్రవారం దేశవ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. నూతన సైనిక పాలకులకు ప్రజాశక్తి బలాన్ని గుర్తు చేసేలా వారం రోజుల తర్వాత చేపట్టిన ఈ ప్రదర్శనలు జరిగాయి. 18 రోజుల తిరుగుబాటులో మరణించిన 365 మంది ప్రజల సంస్మరణార్థం జరిగిన ఈ ప్రదర్శనలు ఈజిప్టు ప్రజాశక్తి స్థాయిని, పౌర పాలనకు మారాలనే జాతీయ భావాన్ని తెలియచెప్పాయి............

ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో భారీ ‌ సోషియోఫాంటసీ చిత్రం