ఆదివారం 20 ఫిబ్రవరి 2011
కురుల నుంచి సిరులు
'జుట్టున్నమ్మ ఏ కొప్పయినా పెడుతుంది' అనేది నానుడి...అయితే జుట్టున్నయ్య (శ్రీవారు) కొప్పు పెట్టట్లేదు కానీ... కోట్లు గడిస్తున్నాడు.. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా ఏడాదికి 300 కోట్ల రూపాయల సంపాదన. 'పాపాలన్నీ పోతాయి' అన్న భక్తుల సెంటిమెంట్ సిరులు కురిపిస్తోంది.....
'దొంగలముఠా' మార్చి 18న
రాంగోపాల్వర్మ దర్శకత్వంలో వస్తున్న మరో సంచలన ప్రాజెక్ట్ 'దొంగలముఠా'. ఐదు రోజుల్లో షూటింగ్ పార్ట్ పూర్తిచేస్తానని చెప్పి, నాలుగున్నర రోజుల్లోనే వర్మ పూర్తిచేశారు. రవితేజ, చార్మి, ప్రకాష్రాజ్, లక్ష్మీ మంచు, బ్రహ్మానందం.........
డ్యాన్స్లు, పాటలు కాకుండా కథను నమ్ముకున్నా
నిత్యమీనన్, ప్రియా ఆనంద్, సిద్ధార్థ్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం 'సిద్ధార్థ్ 180'. జయేంద్ర దర్శకత్వంలో అగల్ ఫిల్మ్ ప్రొడక్షన్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమవుతున్న సిద్ధార్థుడి గురించి...........
మధుమేహ రాజధాని భారత్
మధుమేహానికి భారత్ రాజధానిగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్తో బాధ పడుతున్న వారిలో భారతీయులే నాలుగో వంతు మంది ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ఓ), అంతర్జాతీయ డయాబెటిస్ ఫెరడేషన్ (ఐడిఎఫ్) పేర్కొంటున్నాయి. దీంతో భారత్లో వాస్తవంగా ఎంత మంది మధుమేహంతో బాధ పడుతున్నారో తెలుసుకోవడానికి భారత వైద్య పరిశోధన........
కంపెనీలకు దాసోహం - పర్యావరణానికి ద్రోహం
మహారాష్ట్రలోని జైతపూర్ అణువిద్యుత్ ప్రాజెక్టు, ఒరిస్సాలోని పోస్కో ప్రాజెక్టు( రేవు, ఉక్కు, విద్యుత్కేంద్ర నిర్మాణం), జార్ఖండ్లోని చిరియ గనుల తవ్వకం... ఈ మూడు ప్రాజెక్టులకు వర్తింపచేసిన నిబంధనలను చూసినట్లయితే విదేశీ పెట్టుబడులు ఎక్కువగా ఉన్నచోట పర్యావరణ ప్రభావ అంచనా పద్ధతులను ప్రభుత్వం పట్టించుకోనట్లుగా కనిపిస్తుంది. చిరియా గనుల విషయంలో విధించిన నిబంధనలతో పోలిస్తే, జైత్పూర్ (ఇక్కడ ఉన్నది ప్రభుత్వరంగ సంస్థయైనప్పటికీ ప్రధానంగా లాభించేది ఫ్రెంచ్ అణు సంస్థలు), పోస్కో (భారతదేశంలో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కలిగిన సంస్థ్ధ) లకు విధించిన నిబంధనలు సరళంగా ఉంటాయి. పోస్కో, జైతపూర్లపై సాంకేతికపరమైన అనేక నిబంధనలను విధించినప్పటికీ పర్యావరణ ప్రభావ అంచనా పద్ధతులు చాలా బలహీనంగా ఉన్నాయి. ఈ కంపెనీలకు ఈ వెసులుబాటు ఎందువల్ల ఇచ్చినదీ మంత్రిత్వ శాఖే తెలపాలి................
వీరేంద్ర విరాట్ విహారం
ఆట మొదలైంది... పరుగుల వేటా మొదలైంది. 2011 వరల్డ్కప్లో ఆడిన తొలి మ్యాచ్లోనే భారత్ పరుగుల సునామీ సృష్టించింది. సెంచరీలతో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించింది. నాలుగేళ్ల క్రితం ఎదురైన పరాభవానికి తగిన విధంగా బదులు తీర్చుకుంటామన్న భారత బ్యాట్స్మెన్, అందుకు ఏ మాత్రమూ వెనక్కితగ్గకుండా చెలరేగారు. ఇన్నింగ్స్ మొత్తం క్రీజులో నిలబడతానని, బంగ్లా బౌలర్ల భరతం పడతానన్న సెహ్వాగ్ అన్నంత పనీ చేశాడు...........
నియంతృత్వంపై తుది వరకూ పోరు
హోస్నీ ముబారక్ను గద్దె దింపటంతో తమ పని పూర్తికాలేదని, నియంతృత్వంపై తుది దాకా పోరు కొనసాగిస్తామని ఈజిప్షియన్లు కృత నిశ్చయంతో చెబుతున్నారు. 1998లో తొలిసారిగా తిరుగుబాటు చేసి అరెస్టయిన 33 ఏళ్ల హోస్సామ్ ఎల్ హమ్లావీ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఈజిప్ట్లో నియంత గద్దె దిగినప్పటికీ నియంతృత్వానికి తెరపడలేదని, అణచివేత ఆగిపోలేదని అన్నారు. గత మూడు వారాలుగా యువత చేసిన తిరుగుబాటు ఇంకా పూర్తి కాలేదని, ఇంకా అణచివేత, హక్కుల కాలరాత కొనసాగుతోందని చెప్పారు...............
అభిమానుల సమక్షంలో 'శక్తి' ఆడియో
ఎన్టీఆర్, ఇలియానా, మంజరి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'శక్తి'. వైజయంతీ మూవీస్ పతాకంపై మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈనెల 27న హైదరాబాద్లోని లలితకళా తోరణంలో అభిమానుల సమక్షంలో ఆడియో ఆవిష్కరణ........
నకిలీ పెన్ డ్రైవ్ లతో జరభద్రం
టెక్నాలజీ పెరిగాక అసలు...నకిలీ సమస్య బాగా పెరిగింది. కంప్యూటర్ వాడకంతోపాటే కంప్యూటర్ పరికరాల వాడకం కూడా ఎక్కువైంది. సీడీలు, పెన్డ్రైవ్లు...ఆ కోవకు చెందినవే. బ్రాండెడ్ వాటికి ఏమాత్రం తీసిపోకుండా నకిలీవాటిని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. రోడ్లపక్కనే కాదు, పేరుమోసిన షాపుల్లో సైతం నకిలీ........
మందుకొట్టే గుర్రం
బార్లో ఎవరు కనిపిస్తారు? చిన్నా పెద్దా... అంతా దర్శనమిస్తారు. అదే విదేశాల్లో అయితే ఆడవాళ్లూ అగుపిస్తారు. కానీ...బార్లో దర్జాగా మందేసే గుర్రాన్ని ఎక్కడైనా చూశారా! లేదుకదూ. అయితే మీరు స్టాఫార్డ్షైర్ వెళ్లాల్సిందే. అక్కడ ఓ పబ్కి రోజూ ఓ గుర్రం.........
క్రొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)