సోమవారం 14 ఫిబ్రవరి 2011

ఇంటి వైద్యం - నమ్మకాలు

అమెరికా ఉచ్చులో భారత్‌

చనిపోయేందుకు అనుమతించండి

కెరటం

అరబ్బుల ప్రజాస్వామ్య దాహం


ఈజిప్టు అనగానే మనకు గుర్తు వచ్చేది క్లియోపాత్రా, పిరమిడ్లు, నైలు నది, భయంకరమైన ఎడారి ! సహారా, లిబియా ఎడారులుగా పిలిచే ఈ ప్రాంతంలో సంభవించే ఇసుకతుపాను 30 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఇప్పుడు అంతకంటే పెద్దదైన ప్రజాస్వామిక జన తుపానుకు నియంత హోస్నీ ముబారక్‌ ఏక్షణంలో అయినా కొట్టుకుపోయే స్థితిలో ఉన్నాడు.........

ఇ-మెయిల్‌కు ఎన్నోళ్లో తెల్సా!

అదో మిస్టరీ!

సౌరవ్‌గంగూలీ (38)... భారత మాజీ కెప్టెన్‌. ఈ బెంగాలీ బాబు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి రెండు సంవత్సరాలైంది. అయితేనేం ప్రపంచ వ్యాప్తంగా ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకోగలగడంలో గంగూలీకి గంగూలీయే సాటి. ఆటగానిగా ముఖాముఖి తలపడటం గంగూలీ నైజం. సాదాసీదాగా కాక అంకితభావంతో ఆటను ఆస్వాదించ గలిగాడు ఈ బెంగాలీ బాబు అందుకే అభిమానులు గంగూలీని క్రికెట్‌ యోధునిగా రారాజుగా నేటికీ కీర్తిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ రంగం నుంచి నిష్క్రమించినా వాడి వేడి తగ్గని గంగూలీకి ఇటీవల ఐపిఎల్‌ -4లో స్థానం లభించలేదు. వేలంప్రక్రియ ప్రారంభదశలో గంగూలీకి ఎదురవుతున్న పరాభవాన్ని పసిగట్టిన అభిమానులు స్వచ్ఛందంగా ఆందోళనలకు దిగారు..............

ప్రయత్న లోపం లేకుండా ప్రయోగాలు చేయాలి...

'ఒకే విధమైన పాత్రలు చేస్తున్నానేమో ! అన్న అభిప్రాయం కలుగుతోంది. ఒక్కోసారి తెరమీద నన్ను నేను చూసుకొని బోర్‌ కొడుతుంది. నిజంగా నిజమేమంటే...నా దగ్గరికి వచ్చే పాత్రలన్నీ ఒకే విధంగా ఉంటున్నాయి. పది సినిమాలు చేస్తే...గతంలో చేసినట్టు ఐదు పాత్రలు ఉంటున్నాయి' అని తన మనసులోని మాటను బయటపెట్టారు ప్రకాష్‌రాజ్‌. తమిళంలో నిర్మాతగా 'గగనం' నిర్మించారు. నటుడిగా, నిర్మాతగా తన అనుభవాల్ని ఇలా వెలిబుచ్చుతున్నారు................

ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లడాన్ని మాలమహానాడు తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఎమ్మెల్సీ, మాలమహానాడు అధ్యక్షులు జూపూడి ప్రభాకార్‌రావు తెలిపారు. వర్గీకరణను ఎదిరించడానికి మాలమహానాడు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14, 15 తేదిల్లో మండల, జిల్లా వ్యాప్త ధర్నాలు చేయాలని నిర్ణయించినట్టు హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జూపూడి తెలిపారు. సుప్రీంకోర్టు తిరస్కరించిన వర్గీకరణ అంశాన్ని ఆచరణలో పెట్టడానికి, తన కుటిల నీతిని చాటుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు.