శుక్రవారం 11 ఫిబ్రవరి 2011

డ్రగ్స్‌తో పట్టుబడ్డ ప్రముఖ నటి జీవిత సోదరుడు

అమెరికాకు ముఖ్యమైన 12 దేశాల్లో చైనా ఫస్ట్‌, భారత్‌ లాస్ట్‌

పేరే మనది... పెత్తనం 'ఏడిబి'దే

భారత్‌లో 840 కిలోమీటర్ల రైలు మార్గాన్ని డబులింగ్‌ చేయాలని, 640 కిలోమీటర్లను విద్యుదీకరించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఎడిబి) రుణం తీసుకోనున్నామని, ఆసక్తి గల కాంట్రాక్టర్లు తమను సంప్రదిస్తే మరిన్ని వివరాలు అందిస్తామని భారత రైల్‌ వికాస్‌ నిగం చేసిన ప్రకటనను గురువారం ఎడిబి తన వెబ్‌సైట్‌లో ఉంచింది. నిజానికి ఇది ఒక ప్యాకేజీ మాత్రమే. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. దాని ప్రకారం ఈ పనులకు అవసరమైన వస్తువులను ఎడిబి మార్గదర్శక సూత్రాల ప్రకారం సమకూర్చుకోవాలని, సివిల్‌ పనులకు అంతర్జాతీయ టెండర్ల విధానాన్ని పాటిస్తామని, ఎడిబి నిధులతో పనిచేసే కన్సల్టెంట్‌లను ఉపయోగించుకోవాలని పేర్కొన్నది. ఈ పనులను అమలు చేసేది రైలు వికాస్‌ నిగమ్‌ సంస్థ. రైల్వేలను సేవా దృక్పథం నుంచి తప్పించి ...........

పెళ్లికి నిరాకరించిందని...వివాహితపై వృద్ధుడు కత్తితో దాడి

పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఒక వృద్ధుడు మహిళపై కత్తితో దాడి చేసిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరులో గురువారం చోటు చేసుకుంది. చెయ్యేరు అగ్రహారానికి చెందిన దార్ల శ్రీరాములు (60) భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది. అప్పట్నుంచీ అతడు ఒంటరిగా జీవిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మడికి శ్రీదేవి (30) రెండేళ్ల క్రితం భర్తను కోల్పోయి ఇద్దరి పిల్లలతో జీవిస్తోంది. తనను పెళ్లిచేసుకోవాలని శ్రీదేవిని శ్రీరాములు వేధించసాగాడు.

ఈజిప్టు సంక్షోభం విదేశీ జోక్యం వద్దు : చైనా


ఈజిప్టులో కొనసాగు తున్న సంక్షోభం పట్ల చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశంలోని వివిధ పక్షాల మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు బయటివారు చేస్తున్న యత్నాలను వ్యతిరేకించింది. ఈజిప్టు ప్రధాన అరబ్‌-ఆఫ్రికా దేశమని, దాని సుస్థిరత పశ్చిమాసియాలోని శాంతి, సుస్థిరతను ప్రభావితం చేస్తుందని విదేశాంగ శాఖ ప్రతినిధి మా జోక్సూ గురువారం తెలిపారు. ఈజిప్టు వ్యవహారాలను ఆ దేశమే స్వతంత్రంగా నిర్ణయించు కోవాలని చైనా విశ్వసిస్తోందని, విదేశీయులు జోక్యం చేసుకోరాదని రోజువారీ జరిగే విలేకరుల సమావేశంలో మా చెప్పారు..........

యూసుఫ్‌, నెహ్రాకు కోచ్‌ పాఠాలు

ఈ నెల 19న ప్రారంభం కానున్న ఐసిసి ప్రపంచకప్‌ అనంతరం కోచ్‌ పదవికి గుడ్‌బై చెప్పనున్న గ్యారీ కిర్‌స్టీన్‌ ఇక్కడ జరుగుతున్న భారత జట్టు శిక్షణా శిబిరంలో ప్రతి ఒక్క క్రీడాకారుని పట్ల ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరిస్తున్నారు. బుధవారం నాటి కార్యక్రమంలో గాయాల నుండి కోలుకొని జట్టులో చేరిన గౌతం గంభీర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ పట్ల ప్రత్యేక శ్రద్ధతో వ్యవహ రించారు. రెండో రోజు ప్రాక్టీస్‌లో ఆల్‌ రౌండర్‌ యూసుఫ్‌ పఠాన్‌, మీడియం పేసర్‌ ఆశిష్‌ నెహ్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

రగడ అర్థ శతదినోత్సవం

ఫోన్‌ నెంబర్‌ ఇవ్వనందుకు కబడ్డీ క్రీడాకారిణి హత్య

ఫోన్‌ నెంబరు ఇవ్వలేదన్న కారణంతో కబడ్డీ క్రీడాకారిణిని సిఆర్‌పిఎఫ్‌ జవాన్‌ హత్య చేశాడు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. 34వ జాతీయ క్రీడల కోసం పాట్నా స్టేడియంలో ప్రాక్టీస్‌ ముగించుకొని తిరిగి వెళుతున్న మనీషా కుమారి అనే కబడ్డీ క్రీడాకారిణిని సిఆర్‌పిఎఫ్‌ జవాన్‌ జస్వంత్‌ సింగ్‌ బుధవారం తుపాకితో కాల్చి చంపినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఆమెను హత్యచేసిన అనంతరం జవాను తుపాకితో కాల్చుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడని, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ నెల 12న ప్రారంభం కానున్న జాతీయ క్రీడల్లో పాల్గొంటున్న ...........

ఇది 'ఇంటర్నెట్‌ విప్లవం'

'నేను విప్లవం కోసం చావడానికైనా సిద్ధమే'' అని గూగుల్‌ ఎగ్జిక్యూటివ్‌ వాయెల్‌ ఘోనిమ్‌ చెప్పారు. అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ వ్యతిరేక నిరసనల ప్రధాన నిర్వాహకుల్లో ఆయన ఒకరు. ముబారక్‌ పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలను ఆయన 'ఇంటర్నెట్‌ విప్లవం'గా అభివర్ణించారు. ''దీన్ని నేను విప్లవం 2.0గా పిలుస్తాను'' అని ఆయన సిఎన్‌ఎన్‌ ఇంటర్నేషనల్‌కు గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ముబారక్‌ వైదొలగక తప్పని స్థితి ఏర్పడింది. ఆయన పాలనను ఇంకేమాత్రం ఆమోదించేది లేదనే దృఢసంకల్పంతో రాజధాని కైరోలోని తెహ్రీర్‌ స్క్వేర్‌లోని నిరసనకారులు ఉన్నారు................

సెల్‌ఫోన్‌లో ప్రపంచకప్‌

మహ్మద్‌ రఫీ ఇంకెన్నాళ్ళు