శనివారం 22 జనవరి 2011

ఆ గోళ్లు పొడవు మీటరు

రచ్చబండపై కొత్త రగడ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రచ్చబండ కార్యక్రమంలో మంత్రులకు ప్రాధాన్యత తగ్గనుంది. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో మంత్రుల ఫొటోలకు స్థానం లభించలేదు. స్థానిక శాసనసభ్యుల ఫోటోలను మాత్రమే ముద్రించాలని నిర్ణయించడంతో మంత్రుల బొమ్మలూ వారి నియోజకవర్గాలకే.......

వికలాంగులపై అత్యాచారాలు


చట్టానికి కళ్లులేవు. చెవులే ఉన్నాయి. రుజువులు చూపిస్తేనే అది శిక్షిస్తుంది. లేకుంటే సాక్షాల్లేవంటూ దోషులను వదిలేస్తుంది. ప్రభుత్వాలనే తల్లకిందులు చేయగల ఘనులున్న మన వ్యవస్థలో సాక్ష్యాలను తల్లకిందులు చేయగల 'సాక్షాసురులకు' (సాక్ష్యాలను తారుమారు చేయగల రాక్షసులు) కొదువలేదు. అందువల్లే అత్యాచారాలకు గురైన మహిళలూ, వైవాహిక జీవితంలో.......

'మిరపకాయ్' సంక్రాంతి సంబరాన్ని నింపింది

మైక్రోఫైనాన్స్‌కు ఊపిరిపోసిందెవరు?

దారిద్య్ర నిర్మూలనా కార్యక్రమాల వైఫల్యం మైక్రో ఫైనాన్స్‌ సంస్థల పెరుగుదలకు దారితీసింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ చక్కటి ఉదాహరణ. ఇక్కడ తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే కార్యక్రమాలు నిలచి పోవటంతో మైక్రోఫైనాన్స్‌ సంస్థలపై జనం ఎక్కువగా ఆధారపడ్డారు. ఈ సంస్థలకు సంబంధించి ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది. దానిలోని విశేషమేమంటే, ఈ సంస్థలు వసూలు చేసే వడ్డీపై పరిమితి గురించిన ప్రస్తావనే లేదు..........

'గ్వాంటెనామో' మూసివేత యోచన విరమణ

క్యూబాలోని గ్వాంటెనామో తీరంలోని జైలును మూసివేయాలనే యత్నాలను ఒబామా ప్రభుత్వం మానుకొంది. నిందితులుగా ఉన్న ఉగ్రవాదులను అమెరికా కోర్టుల్లో విచారించాలనే అధ్యక్షుని పథకాన్ని కాంగ్రెస్‌ అడ్డుకోవడంతో కొత్తగా విచారణలు ప్రారంభించనున్నారు. కొత్త సైనిక ట్రిబ్యునళ్ళను ప్రారంభించడాన్ని నిలిపివేస్తూ రెండేళ్ళ క్రితం ఒబామా పదవీ స్వీకారం సందర్భంగా విధించిన ఉత్తర్వును రక్షణ మంత్రి రాబర్ట్‌ గేట్స్‌ త్వరలో ఎత్తివేయనున్నారని భావిస్తున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వివరించింది. 30 మందికి పైగా ఖైదీలకు వ్యతిరేకంగా నూతన అభియోగాలు మోపేందుకు కొద్ది వారాల్లోనే విచారణ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు...........

ఈవివి ఇక లేరు


   తెలుగు చలన చిత్ర రంగంలో హాస్య బ్రహ్మగా కీర్తినొందిన జంధ్యాల వద్ద ఈవివి శిష్యునిగా పనిచేశారు. ఈవివి పూర్తిపేరు ఈదర వీర వెంకట సత్యనారాయణ. జంధ్యాల వారసునిగా అనేక హాస్య, కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు. మరెన్నో చిత్రాలను స్వీయదర్శకత్వంలో 51 చిత్రాలు నిర్మించి తెలుగు తెరపై తనదైన ముద్రవేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఈవివి నాన్న వెంకటరావు, తల్లి వెంకటరత్నమ్మ. ఈవివికి చిన్ననాటి నుంచి సినిమాలంటే అమితమైన ఆసక్తి. నిడదవోలులో ఇంటర్మీడియట్‌కు చేరేవరకు..............

మహేష్‌బాబు, పూరిజగన్నాథ్ ల కాంబినేషన్ లో "ది బిజినెస్‌ మేన్‌''

ప్రభుదేవా దర్శకత్వంలో నయనతార యమకంత్రి