డిసెంబరు మధ్యలో పెట్రోలు ధరలను లీటరుకు రూ.2.95-2.96 పెంచినప్పటికీ చమురు కంపెనీలకు సుమారు రెండు రూపాయల మేర నష్టం వస్తోంది. డీజిల్, వంట గ్యాసు ధరలను పెంచడానికి ప్రభుత్వం ఆసక్తి కనపరచకపోవడంతో, చమురు పంపిణీ సంస్థలు (ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు--ఓఎంసీలు) మరో విడత పెట్రో ధరల వడ్డింపుకు.......
గురువారం 6 జనవరి 2011
పెట్రోల్ ధరలు మరింత పెరుగుతాయి!
డిసెంబరు మధ్యలో పెట్రోలు ధరలను లీటరుకు రూ.2.95-2.96 పెంచినప్పటికీ చమురు కంపెనీలకు సుమారు రెండు రూపాయల మేర నష్టం వస్తోంది. డీజిల్, వంట గ్యాసు ధరలను పెంచడానికి ప్రభుత్వం ఆసక్తి కనపరచకపోవడంతో, చమురు పంపిణీ సంస్థలు (ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు--ఓఎంసీలు) మరో విడత పెట్రో ధరల వడ్డింపుకు.......
ఆరు సూచనలు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక!!
స్కాలర్షిప్ అడిగితే లాఠీఛార్జి
పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, ఆన్లైన్ దరఖాస్తు గడువు తేదీని పొడిగించాలని కోరుతూ ఖమ్మం కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సంఘటన పూర్తి వివరాలు... దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఆ సమయంలో జెడ్పీలో సర్వసభ్య సమావేశం జరుగుతోంది. మురికివాడల ముసాయిదాలో లోపాలు పరిశీలించండి
మురికివాడల పునరాభివృద్ధి - పునరావాసం నివారణా చట్టం-2010 ముసాయిదా బిల్లులోని లోపాలను పరిశీలించాలని సిపిఎం మాజీ ఎంపి పెనుమల్లి మధు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని కోరారు. మురికివాడలను అభివృద్ధి చేసే విధంగా, పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరయ్యే విధంగా చట్టంలో తగిన మార్పులు చేయాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన బుధవారం లేఖ రాశారు. లేఖ పూర్తిపాఠం.......అభివృద్ధి పథంలో వియత్నాం
వియత్నాం అభివృద్ధి పథంలో పురోగమిస్తోంది. 2020 నాటికి ఆధునిక పారిశ్రామిక దేశంగా మారేందుకు బలమైన పునాదులు వేసేందుకు పునరుద్ధరణ క్రమాన్ని ప్రోత్సహిస్తోంది. 25 ఏళ్ళ పునరుద్ధరణ క్రమాన్ని సమీక్షించేందుకు, 1991 నాటి పార్టీ రాజకీయ కార్యక్రమాన్ని నవీకరించేందుకు, 2020 నాటికి ఆధునిక పారిశ్రామిక దేశంగా మారే ప్రయత్నంలో 2011-2020 కాలంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించేందుకు 2011 ప్రారంభంలో వియత్నాం కమ్యూనిస్తు పార్టీ 11వ మహాసభలు జరగబోతున్నాయి..........ఉపాధి హామీకి వెయ్యి కోట్లు
ఉపాధిహామీ పథకానికి రాష్ట్ర వాటాగా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్కు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వినతి పత్రం సమర్పించింది. ఉపాధిహామీతో పాటు పించన్లకు, గ్రామీణ మంచి నీటికి, డ్వాక్రా గ్రూపులకు బడ్జెట్ కేటాయింపుల్లో తగు వాట కల్పించాలని సంఘం అఖిల భారత అధ్యక్షులు పాటూరు రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి వెంకట్, రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు బుధవారం సచివాలయంలో మంత్రిని కలిసి కోరారు. చేతినిండా పని లేక, ప్రభుత్వ సహకారం లేక వ్యవసాయ కార్మికులు కనీస సౌకర్యాలకు నోచుకోలేకపో తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు....ఎన్.టి.ఆర్. రాజమౌళి చిత్రం?
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)

Read Document

