గురువారం 6 జనవరి 2011

పెట్రోల్‌ ధరలు మరింత పెరుగుతాయి!

డిసెంబరు మధ్యలో పెట్రోలు ధరలను లీటరుకు రూ.2.95-2.96 పెంచినప్పటికీ చమురు కంపెనీలకు సుమారు రెండు రూపాయల మేర నష్టం వస్తోంది. డీజిల్‌, వంట గ్యాసు ధరలను పెంచడానికి ప్రభుత్వం ఆసక్తి కనపరచకపోవడంతో, చమురు పంపిణీ సంస్థలు (ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు--ఓఎంసీలు) మరో విడత పెట్రో ధరల వడ్డింపుకు.......

ఆరు సూచనలు చేసిన జస్టీస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదిక!!

జస్టీస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదిక బహిర్గతమైంది. కేంద్రం హోం మంత్రి చిదంబరం అధ్యక్షతతన గురువారం ఉదయం11 గంటలకు ప్రారంభమైన అఖిలపక్ష సమావేశంలో నివేదికలోని అంశాలు బహిర్గతమయ్యాయి. ఈ నివేధికలో జస్టీస్‌ శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ఐదు ప్రధాన సూచనలు చేసినట్టు మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది......

'అనంత' చుట్టూ అల్లుకుంటున్న సూరి హత్య కేసు

రాష్ట్రంలో సంచలనం రేపిన మద్దెలచెరువు సూరి హత్యకేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ హత్యలో భాగస్వాములుగా అనుమానం వ్యక్తమవుతున్న ప్లేరన్నీ అనంతపురం జిల్లాకు చెందిన వారివే కావడం గమనార్హం. దీంతో కేసు విచారణ మొత్తం జిల్లా చుట్టూ తిరుగుతోంది. విచారణ చేపట్టిన హైదరాబాదు పోలీసుల బృందం బుధవారం రాత్రి జిల్లాకు చేరుకుంది. ఎసిపి, డిఎస్పీ స్థాయి అధికారులు విచారణ నిమిత్తం ఇక్కడికొచ్చిన వారిలో..........

స్కాలర్‌షిప్‌ అడిగితే లాఠీఛార్జి

పెండింగ్‌ స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని, ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు తేదీని పొడిగించాలని కోరుతూ ఖమ్మం కలెక్టరేట్‌ ముందు ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సంఘటన పూర్తి వివరాలు... దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఆ సమయంలో జెడ్పీలో సర్వసభ్య సమావేశం జరుగుతోంది.

మురికివాడల ముసాయిదాలో లోపాలు పరిశీలించండి

మురికివాడల పునరాభివృద్ధి - పునరావాసం నివారణా చట్టం-2010 ముసాయిదా బిల్లులోని లోపాలను పరిశీలించాలని సిపిఎం మాజీ ఎంపి పెనుమల్లి మధు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. మురికివాడలను అభివృద్ధి చేసే విధంగా, పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరయ్యే విధంగా చట్టంలో తగిన మార్పులు చేయాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన బుధవారం లేఖ రాశారు. లేఖ పూర్తిపాఠం.......

అభివృద్ధి పథంలో వియత్నాం

వియత్నాం అభివృద్ధి పథంలో పురోగమిస్తోంది. 2020 నాటికి ఆధునిక పారిశ్రామిక దేశంగా మారేందుకు బలమైన పునాదులు వేసేందుకు పునరుద్ధరణ క్రమాన్ని ప్రోత్సహిస్తోంది. 25 ఏళ్ళ పునరుద్ధరణ క్రమాన్ని సమీక్షించేందుకు, 1991 నాటి పార్టీ రాజకీయ కార్యక్రమాన్ని నవీకరించేందుకు, 2020 నాటికి ఆధునిక పారిశ్రామిక దేశంగా మారే ప్రయత్నంలో 2011-2020 కాలంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించేందుకు 2011 ప్రారంభంలో వియత్నాం కమ్యూనిస్తు పార్టీ 11వ మహాసభలు జరగబోతున్నాయి..........

పెను సవాలు


మూడవ టెస్టులో విజయం సాధించి సిరీస్‌ కైవసం చేసుకునేందుకు దక్షిణాఫ్రికా భారత్‌కు 340 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగులు వెనుకబడిన దక్షిణాఫ్రికా జాక్స్‌ కల్లిస్‌ వీరోచిత పోరాటం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో 341 పరుగులకు ఆలౌటైంది..........

సైన్స్ ఉద్యమాలు ... ప్రజా సమస్యలు

స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత మన పరిశోధనా స్థానాల్లో జరుగుతున్న పరిశోధన లు ఉన్నతవర్గాలకే పరిమితమవుతున్నా యని, సామాన్యులకు అందటంలేదని కొంత మంది శాస్త్రజ్ఞులు బలంగా అభిప్రాయపడుతుండే వారు. దీనికి విరుగుడుగా, ఈ విజ్ఞానాన్ని సామాన్యులకూ అందించాలనే లక్ష్యంతో వారి భాషలోనే ఈ శాస్త్రజ్ఞులు విజ్ఞాన ప్రచారాన్ని చేప ట్టారు. ఈ ప్రయత్నాలే ఆ తర్వాత ప్రజా సైన్స్‌ ఉద్యమాలుగా మారాయి. ఈ వారసత్వం తోనే నేటి ప్రజాసైన్స్‌ ఉద్యమం కొనసాగు తుంది. ప్రజాసమస్యలను అభివృద్ధి ఎజెండా లోకి తేవ డమే ఈ ఉద్యమ లక్ష్యం.

ఉపాధి హామీకి వెయ్యి కోట్లు

ఉపాధిహామీ పథకానికి రాష్ట్ర వాటాగా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం వినతి పత్రం సమర్పించింది. ఉపాధిహామీతో పాటు పించన్లకు, గ్రామీణ మంచి నీటికి, డ్వాక్రా గ్రూపులకు బడ్జెట్‌ కేటాయింపుల్లో తగు వాట కల్పించాలని సంఘం అఖిల భారత అధ్యక్షులు పాటూరు రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌, రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు బుధవారం సచివాలయంలో మంత్రిని కలిసి కోరారు. చేతినిండా పని లేక, ప్రభుత్వ సహకారం లేక వ్యవసాయ కార్మికులు కనీస సౌకర్యాలకు నోచుకోలేకపో తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు....

రోజుకో మలుపు : "* సూరి హత్యకు విజయవాడ వివాదాలే కారణమా? "*భాను ఫోన్‌ నుంచి ఒకేరోజు వందకు పైగా కాల్స్‌

మద్దెలచెర్వు సూరి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. విజయవాడలో రూ.70 కోట్లపైగా విలువచేసే స్థలం వ్యవహారంలో సూరికి ఆయన అనుచరుడు భానుకు మధ్య మనస్పర్థాలు తలెత్తినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విజయవాడకు చెందిన ఓ వ్యక్తి భానును లొంగదీసుకొని సూరిని హత్య చేయించినట్లు ఆరోపణలు.......

ఎన్‌.టి.ఆర్‌. రాజమౌళి చిత్రం?

ఎన్‌.టి.ఆర్‌. కథానాయకునిగా రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్‌నెం.1, సింహాద్రి, యమదొంగ వచ్చాయి. మళ్ళీ వారి కాంబినేషన్‌లో కొత్త చిత్రం తయారు కాబోతుంది. మంగళవారం, బుధవారంనాడు రామానాయుడు స్టూడియోలో వీరి కాంబినేషన్‌లో షూటింగ్‌ జరిగింది. అయితే ఇది సినిమా షూటింగ్‌ కాదు. ఓ యాడ్‌ ఫిలిమ్..........