సీఫా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కన్నడంలో విజయం సాధించిన 'జయహే' చిత్రాన్ని తెలుగులో 'లేడీ బ్రూస్లీ' పేరుతో అనువదిస్తున్నారు. అయేషా టైటిల్ పాత్ర పోషించింది. ఆకాష్, గౌరీపండిట్, థ్రిల్లర్మంజు, అవినాష్ ప్రధాన పాత్రల్లో నటించారు. థ్రిల్లర్మంజు ఫైట్స్తోపాటు దర్శకత్వం కూడా వహించారు. ఈనెల 7న విడుదల కానుంది.....బుధవారం 5 జనవరి 2011
తండ్రి ప్రాణాల కోసం పోరాడే...లేడీ బ్రూస్లీ
సీఫా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కన్నడంలో విజయం సాధించిన 'జయహే' చిత్రాన్ని తెలుగులో 'లేడీ బ్రూస్లీ' పేరుతో అనువదిస్తున్నారు. అయేషా టైటిల్ పాత్ర పోషించింది. ఆకాష్, గౌరీపండిట్, థ్రిల్లర్మంజు, అవినాష్ ప్రధాన పాత్రల్లో నటించారు. థ్రిల్లర్మంజు ఫైట్స్తోపాటు దర్శకత్వం కూడా వహించారు. ఈనెల 7న విడుదల కానుంది.....తేల్చాల్సింది పార్టీలే
ప్రత్యేక తెలంగాణా అంశం ఎంత కాలంలో పరిష్కారమౌతుందో తేల్చాల్సింది రాష్ట్ర రాజకీయ పార్టీలేనని కేంద్ర హోం శాఖా మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. 6వ తేదీన జరిగే అఖిలపక్ష భేటీలో ఏమి జరుగుతుందో తనకు తెలియదన్నారు. ఈ విషయాన్ని కూడా పార్టీలే నిర్ణయింంచాల్సి ఉందన్నారు. భేటీకి పార్టీకి ఇద్దరు చొప్పున పిలవడంలో తప్పేమీలేదన్నారు. గత ఏడాది జరిగిన భేటీలో సిపిఎం, సిపిఐ తదితర పార్టీల నుండి ఇద్దరు ప్రతినిధులు వచ్చినా, ఒకే వైఖరిని చెప్పారని గుర్తు చేశారు. టిఆర్ఎస్, బిజెపి సహా 8 పార్టీలూ గురువారం సమావేశానికి హాజరవుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో తెలంగాణా అంశంపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు.........కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుతో... ఎస్ఎల్బిసి ప్రశ్నార్థకం
'కొండ నాలుకకు మందేస్తే... ఉన్న నాలుక ఊడిన' చందంగా జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవ్వక ముందే నిర్దేశించిన నీటి కేటాయింపులు లేకుండా పోయింది. రాష్ట్ర సర్కార్ పసలేని వాదనల వల్ల మిగులు జలాలను వినియోగించుకునే అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో శ్రీశైలం ఎడమగట్టు సొరంగ మార్గం ప్రాజెక్టు (ఎస్ఎల్బిసి) ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా చేపట్టిన నక్కలగండి ఎత్తిపోతల పథకం ద్వారా నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలో 3.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు, పానగల్ ఉదయసముద్రం ఎత్తిపోతల ద్వారా మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందకుండా పోనుంది. ఇటీవల కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల కరువు పీడిత ప్రాంతంగా ఉన్న నల్గొండ జిల్లా ఎడారిగా మారే ప్రమాదమేర్పడింది..........సగానికి ఎసరు ...!
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం రైతాంగానికి పెను శాపంగా మారనుంది. సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి వచ్చిన అంశాలను సైతం ట్రిబ్యునల్ ముందుంచడంలో ప్రభుత్వం విఫలమైంది. ఫలితంగా ట్రిబ్యునల్ కేటాయించిన 1001 టిఎంసీల నీరు సైతం దిగువకు రావడం ప్రశ్నార్ధకంగా మారింది. ఎగువ రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులు, వాటి నీటి నిలువ సామర్ధ్యాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకుపోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, ఫలితంగా ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీటిలో 530కిపైగా టిఎంసీల నీటిని నిలువచేసుకునే ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఎగువ రాష్ట్రాలు పూర్తి చేసుకునే అవకాశం లభించింది........
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)
