దశాబ్దం కిందట సొంతంగా మొబైల్ ఫోన్ వుండటమే ఓ విలాసం. ఇప్పుడు పరిస్థితి చెప్పక్కర్లేదు. జీవితంలో మొబైల్ ప్రాథమిక అవసరమై పోయింది. సాంకేతిక రంగంలో ఇదో విప్లవం. చేతిలో ఇమిడిపోయే ఈ ఫోన్లోనే మొబైల్ ఇంటర్నెట్ రూపంలో మరో విప్లవం చోటుచేసుకుంది. ప్రపంచం ఇక మీ అరచేతిలోనే. మొబైల్లోనే బ్రౌజింగ్, ఇమెయిల్స్, ఛాటింగ్, ఇ-బ్యాంకింగ్ వంటి అనేక ఫీచర్లు వుండడంతోపాటు దేశంలో 3జి సేవలు అందుబాటులోకి రావడంతో మొబైల్ ఇంటర్నెట్కు తెరలేచింది. అత్యంత వేగవంతమైన ఈ 3జి సేవల వలన మొబైల్ ఇంటర్నెట్ వినియోగదార్ల సంఖ్య మరింతగా ఊపందుకుంది. మొబైల్ ఇంటర్నెట్ మార్కెట్ పురోగతిపై ప్రపంచవ్యాప్తంగా ''బిజ్సిటి'' అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో మొదటి పది దేశాల్లో మనదేశంతోపాటు చైనా కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది.......................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి