.
20, ఫిబ్రవరి 2011, ఆదివారం
కంపెనీలకు దాసోహం - పర్యావరణానికి ద్రోహం
మహారాష్ట్రలోని జైతపూర్ అణువిద్యుత్ ప్రాజెక్టు, ఒరిస్సాలోని పోస్కో ప్రాజెక్టు( రేవు, ఉక్కు, విద్యుత్కేంద్ర నిర్మాణం), జార్ఖండ్లోని చిరియ గనుల తవ్వకం... ఈ మూడు ప్రాజెక్టులకు వర్తింపచేసిన నిబంధనలను చూసినట్లయితే విదేశీ పెట్టుబడులు ఎక్కువగా ఉన్నచోట పర్యావరణ ప్రభావ అంచనా పద్ధతులను ప్రభుత్వం పట్టించుకోనట్లుగా కనిపిస్తుంది. చిరియా గనుల విషయంలో విధించిన నిబంధనలతో పోలిస్తే, జైత్పూర్ (ఇక్కడ ఉన్నది ప్రభుత్వరంగ సంస్థయైనప్పటికీ ప్రధానంగా లాభించేది ఫ్రెంచ్ అణు సంస్థలు), పోస్కో (భారతదేశంలో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కలిగిన సంస్థ్ధ) లకు విధించిన నిబంధనలు సరళంగా ఉంటాయి. పోస్కో, జైతపూర్లపై సాంకేతికపరమైన అనేక నిబంధనలను విధించినప్పటికీ పర్యావరణ ప్రభావ అంచనా పద్ధతులు చాలా బలహీనంగా ఉన్నాయి. ఈ కంపెనీలకు ఈ వెసులుబాటు ఎందువల్ల ఇచ్చినదీ మంత్రిత్వ శాఖే తెలపాలి................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి