.

21, ఫిబ్రవరి 2011, సోమవారం

ఊదేశాయ్

ప్రపంచకప్‌ రెండో రోజు మ్యాచ్‌ల్లో మిన్ను విరిగి మీద పడలేదు. అద్భుతం ఏమీ జరగలేదు. అగ్రశ్రేణి జట్లు పసికూన వంటి జట్లపై సునాయాస విజయాలు సాధించాయి. కెన్యాపై కివీస్‌, కెనడాపై శ్రీలంక ఘన విజయాలు నమోదు చేసుకున్నాయి. రెండు మ్యాచ్‌ల్లోనూ సెకండ్‌ బ్యాటింగ్‌ జట్లు ఘన విజయం సాధించాయి. గత ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకుని సంచలనాలు సృష్టించిన కెన్యా ఈ సారి తొలి మ్యాచ్‌లో చేతులెత్తేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 69 పరుగులకు కుప్పకూలింది. కివీస్‌ ఎనిమిది ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా 72 పరుగులు చేసి సునాయాస విజయం సాధించింది. ఆదివారం నాడు జరిగిన మరో మ్యాచ్‌లోనూ అదే పరిస్థితి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి