గురువారం 30 డిసెంబర్ 2010

అత్యాచారం కేసులో ఇజ్రాయేల్ మాజీ అధ్యక్షుడికి జైలు

ఇజ్రాయేల్‌ మాజీ అధ్యక్షుడు మోషే కత్సవ్‌పై రెండుసార్లు అత్యాచారం కేసులు.........

లెక్కలేన్ని అవకాశాలు

క్వీన్‌ ఆఫ్‌ సైన్స్‌గా గణితాన్ని పిలుచుకుంటాం. ఏ విశ్లేషణైనా దీని సహాయం, సహకారం లేకుండా చేయలేం. కనీసం ప్రాథమిక అవగాహనైనా ఉండాల్సిందే. అన్ని రంగాల్లోనూ గణిత నిపుణుల సేవలు ముఖ్యమైనవి. ఈవైపు నడుస్తున్న విద్యార్థులకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఇంటర్మీడియట్‌ అర్హతతో ఇంటిగ్రేటెడ్..........

చిదంబరం లేఖ రాజకీయ దురుద్దేశంతోనే

బెంగాల్‌లోని జంగల్‌మహల్‌ ప్రాంతంలోని పరిస్థితిపై ౖ కేంద్ర హౌం మంత్రి పి చిదంబరం చేసిన ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య స్పష్టం చేశారు. చిదంబరం రాసిన లేఖకు ఆయన జవాబిస్తూ బుధవారం వాటి ప్రతులను మీడియాకు విడుదల చేశారు. డిశంబర్‌ 28న రాసిన బుద్ధదేవ్‌ లేఖ పూర్తి పాఠం...

ఆఫ్ఘన్‌లో 700 మంది నాటో సైనికుల మృతి

ఆఫ్ఘనిస్తాన్‌లో 2010లో ఏడు వందల మంది నాటో సైనికులు మృతి చెందినట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌ నివేదిక తెలిపింది. తాలిబాన్‌ తిరుగుబాటుదార్లను అణచివేసే ఉద్దేశంతో దేశంలోకి వేలాది అదనపు సంకీర్ణ దళాలను దించారు. దాదాపు దశాబ్ద కాలంగా జరుగుతున్న యుద్ధంలో ఇంతకు ముందెన్నడూ లేనంత అత్యధికంగా ఈ సంవత్సరం నాటో సైనికులు మృతి చెందారు. అయితే దేశ దక్షిణ ప్రాంతంలో ఉగ్రవాదులకు సాంప్రదాయికంగా బలంగా ఉన్న ప్రాంతాల్లో తాము పురోగతి సాధించినట్లు నాటో, అమెరికా చెబుతున్నాయి.

విజయ ఢంకా

 సాధించారు. కీలక సమయంలో సమిష్టిగా రాణించారు. సిరీస్‌లో విజయావకాశాలను సజీవంగా నిలుపుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌ క్రీడాకారులు విజయఢంకా మోగించారు. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన భారత బౌలర్లు జట్టుకు అపురూప విజయాన్ని అందించారు. దర్బన్‌ టెస్టులో 87 రన్స్‌ తేడాతో గెలిచి, సిరీస్‌ నెగ్గాలన్న ఆశలను నిలుపుకున్నారు. మొదటి నుండీ బౌలర్ల హవా కొనసాగిన ఈ పిచ్‌పై జట్టుకు విజయాన్ని అందివ్వాల్సిన బాధ్యతను భారత బౌలర్లు నెరవేర్చారు. జహీర్‌ఖాన్‌, శ్రీశాంత్‌ చెరో మూడేసి వికెట్లు తీసుకోగా, స్పిన్నర్‌ హర్బజన్‌సింగ్‌ రెండు వికెట్లు, ఇషాంత్‌ శర్మ ఒక వికెట్‌ తీశారు.

రేట్ల మార్పులతో ఏడాది మొత్తం బ్యాంకులు బిజీ బిజీ

కఠిన ద్రవ్య విధానం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) తరచూ తీసుకున్న చర్యల కారణంగా సంవత్సరమంతా లెండింగ్‌, డిపాజిట్‌ రేట్లను మార్చడమే బ్యాంకుల పనిగా మారింది. ఆందోళన కలిగిస్తున్న ద్రవ్యోల్బణం కారణంగా యీ ధోరణి 2011లో కూడ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

సోషల్‌ నెట్‌వర్క్‌లో నెo.1

నేటి ఆధునిక సాంకేతిక విప్లవం ప్రభావంతో అంతర్జాలం ఆవశ్యకత రోజురోజుకూ పెరిగి పోతుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమంతా ఓ కుగ్రామంగా మారిపోయింది. ఈ క్రమంలో వివిధ దేశాల్లోని వారితో సంభాషించడానికి అనేక సోషల్‌ నెట్‌వర్క్స్‌లు ఆవిర్భవించాయి. ఈ సోషల్‌ నెట్‌వర్క్‌ల వల్ల కొంత ప్రయోజనమున్నా మరికొంత దుష్ప్రయోజనమూ జరుగుతోంది. ఏదేమైనా సోషల్‌ నెట్‌వర్క్‌ల్లో.....

ఆటుపోట్లసినిమా




చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఆటుపోట్లతో ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు చలనచిత్రరంగ బండి కదిలింది. గత ఏడాదికంటే తక్కువగా సక్సెస్‌ రేటు ఈ ఏడాది వచ్చింది. తమిళ, హిందీ, కన్నడ రంగాల్లో మనకంటే మెరుగైన విజయాలు చవిచూశాయి. మనకు ఈ ఏడాది కనీసం పదిశాతం కూడా చిత్ర విజయాల్లో వృద్ధిరేటు లేదు. పొందిన విజయాలకంటే అపజయాలే ఎక్కువగా ఉన్నాయి. పెద్ద, చిన్న చిత్రాల తేడాల్లేకుండా ప్రేక్షకులు ఒకే సమాధానం చెప్పారు. కాంబినేషన్లతో బడ్జెట్‌లు పెంచుకున్నా కథాబలం, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే లేకపోతే.......

నిత్యానందకు ప్రజాసంఘాల నిరసన

తానే భగవంతుణ్ణంటూ చెప్పుకుంటున్న నిత్యానంద స్వామి రాకను నిరసిస్తూ తిరువన్నామలైలో డివైఎఫ్‌ఐ, ఐద్వా, రైతు సంఘం, తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఇటీవల నిత్యానంద స్వామి సినీ నటి రంజితతో రాసక్రీడలాడుతూ టీవీ కెమెరాకు చిక్కిన విషయం విదితమే. నిత్యానంద 34వ జన్మదినం సందర్భంగా వెల్లూరు జిల్లా తిరువన్నామలైలోని అరుణాచలేశ్వరస్వామి ..........