ఆదివారం 19 డిసెంబర్ 2010

హోంగార్డుల గోడు పట్టదా?

ఒక వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులతో, కార్మికులతో హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌ దద్ధరిల్లుతోంది. అక్కడా... ఇక్కడా... పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల గుండె కూడా రగులుతోంది.

తరాల ఘర్షణకు సాటిలేని వర్ణ చిత్రణ

ఇవాన్‌ తుర్గెనెవ్‌ రాసిన 'తండ్రులూ కొడుకులూ' అత్యంత ప్రసిద్ధ నవల. ఈ నవల పేరుని బట్టే తండ్రుల తరానికీ కొడుకుల తరానికీ గల ఘర్షణ కథావస్తువని గ్రహించవచ్చు. ఓ ఎస్టేట్‌కి అధిపతులైన 'కిర్సానొవ్‌' సోదరుల్లో పెద్దవాడైన పావెల్‌ పెత్రోవిచ్‌ తండ్రుల పక్షంలో ప్రముఖుడు. ఇక కొడుకుల పక్షంలో 'బజారొవ్‌' ఒక్కడే వున్నాడు. అతనికి చాలామంది కుహనా శిష్యులున్నప్పటికీ అతనికి నిజమైన సహాయకులుగానీ, మిత్రులుగానీ కనబడరు. పావెల్‌ పెళ్ళికాని వృద్ధుడు. అందగాడైన అతడు యవ్వనంలో పలువురు యువతుల్ని బుట్టలో పడేసుకున్నప్పటికీ చివరికి ఓ పెళ్ళైన చపలచిత్త రాకుమారి ప్రేమబంధంలో ..............

అవినీతిపై చర్చిస్తారా!

ఏడాదిన్నరలోనే ఎంత మార్పు ! 2009 లోక్‌సభ ఎన్నికల్లో 200 పైచిలుకు స్థానాలను సాధించిన కాంగ్రెస్‌కు ఇప్పుడు కనుచూపు మేరలో కష్టకాలమే కనబడుతోంది. అవినీతి ఆరోపణలతో మసకబారిన పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను ఎలా కాపాడు కోవాలో ఎఐసిసి అగ్రనేతలకు అంతు బట్టడం లేదు. 70 వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో ముడిపడి ఉన్న కామన్‌వెల్త్‌ క్రీడల నిర్వహణ, క్రికెట్‌కే మచ్చ తెచ్చిన ఐపిఎల్‌ అవకతవకలు, వీర జవానుల పేరు చెప్పి మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమం త్రులు కొల్లగొట్టిన 'ఆదర్శ్‌ హౌసింగ్‌' కుంభకోణం..

భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికా

మన దేశంలోని అమెరికా దౌత్యకార్యాలయం పంపిన కేబుల్స్‌ (ఇప్పటివరకు వికీలీక్స్‌ విడుదల చేసినవి) భారత్‌ అమెరికా సంబంధాల వైనాన్ని వెల్లడించడంతోపాటు మన దేశ అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో అమెరికా జోక్యం ఏ మేరకుందనే విషయాన్ని తెలియజేస్తుందని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. తమ ప్రయోజనాలకు అనుకూలంగా లేని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శిపై ఒక కేబుల్‌లో భారత్‌లోని అమెరికా దౌత్యవేత్త అభ్యంతరకరమైన,.........

వీరి సంగతేంటి ? : చిరంజీవికి నట్టికుమార్‌ ప్రశ్న

'సినీ పరిశ్రమ తన సొంత ఇల్లులాంటిదని చిరంజీవిగారు అంటుంటారు. ఇప్పుడు వారు తీసిన కొమరంపులి, ఆరెంజ్‌ చిత్రాల వల్ల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఆ సినిమా హక్కులు అమ్ముకున్న వాటి నిర్మాతలు బాగానే ఉన్నా, కొన్నవారు తీవ్ర నష్టాల్ని మూటగట్టుకున్నారు. దీనికి కారణం ఆ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోర్లాపడటమే. నిర్మాతల మండలి సమావేశానికి హాజరైన చిరంజీవిగారు ఇక్కడి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఆయన నుంచే నేరుగా మాకు నష్టం జరగితే...