శుక్రవారం 17 డిసెంబర్ 2010

ఉసిరి... సద్గుణాల రాశిఉసిరి... సద్గుణాల రాశి

ఉసిరికాయలంటే చిన్నా పెద్దా అందరికీ మక్కువే. ఈకాలంలో ఉసిరికాయలను ఉప్పు, కారం వేసి తింటుంటే వుండే మజానే వేరు! రాచ ఉసిరి తిని, వెంటనే మంచినీళ్లు తాగితే వచ్చే తియ్యని అనుభూతి అందరికీ సుపరిచితమే! పెద్ద ఉసిరికాయలను కాచి చల్లార్చిన నీటిలో వేసి దానికి ఉప్పు, మిరపకాయ ముక్కలు వేసి వుంచితే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. ఇక ఉసిరి పచ్చడి అంటే ప్రాణం పెట్టేవాళ్లూ వున్నారు. ఉసిరిలోని పోషకాలు నాశనం కాకుండా తొక్కుపచ్చడి చేసుకునేవారూ వున్నారు. ఇక పులిహోర సంగతి చెప్పనవసరం లేదు. ఏదేమైనా ఉసిరిలోని సద్గుణాలను సద్వినియోగం చేసుకోవడంలో మన తరువాతే.......

ఎమ్మెల్యేను చితకబాదిన భర్త

సమాజంలో సగ భాగమైన మహిళలు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా వారిపై చిత్రహింసలు, వేధింపులూ తప్పడంలేదని తాజా ఘటన మరోసారి రుజువుచేసింది. బీహార్‌లోని రుపౌలి నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన భారతిని ఆమె భర్త మండల్‌, కారు డ్రైవరు కలిసి అతి క్రూరంగా చితకబాదిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాక్షాత్తూ పాట్నాలోని ఎమ్మెల్యే ఫ్లాట్‌లోనే మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గూండాగా అపఖ్యాతి పాలైన మండల్‌ పూర్ణియా జిల్లా పరిషత్‌ సభ్యుడు........

మైత్రి పెంచుకుందాం

తమకు 'మంచి పొరుగుదేశం' అయిన భారత్‌లో ప్రస్తుతం తాను జరుపుతున్న పర్యటనతో ఉభయదేశాల సంబంధాలు మరింత విస్తరించనున్నాయని చైనా ప్రధాని వెన్‌జియాబావో ఉద్ఘాటించారు. భారత్‌తో మైత్రిని మరింత పెంపొందించు కోవటం, వాస్తవిక సహకారాన్ని విస్తరించుకోవటం, ప్రజలతో నేరుగా సంబంధాలను పెంచుకోవటం వంటి ప్రయోజనాలకు తాను భారత నేతలతో చర్చలు జరుపనున్నా నన్నారు. గురువారం రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు భారత ప్రభుత్వం అధికారికంగా స్వాగతం పలికింది.

కన్నవారే ఖైదు చేశారు

కడుపుతీపి కడు గొప్పది. ప్రపంచంలోనే ప్రసిద్ధికెక్కినది. బిడ్డలకోసం కన్నవారు ఏమైనా చేస్తారనేది లోకప్రశస్తిగాంచిన వాస్తవం. పిల్లల సంతోషంకోసం తల్లిదండ్రులు ఎంతైనా శ్రమిస్తారనేది కాదనలేని సత్యం. అలాంటి నమ్మకానికి తూట్లుపొడిచే సంఘటనలు నేటి సమాజపు చీకటి గాయాలు ా. గుడ్డిగా నమ్మిన విశ్వాసంకోసం పేగుబంధాన్ని విస్మరించి ప్రాణాలు తోడే కర్కశ హృదయులు నేడెందరో. అందుకు కారణం 'పరువు' అనే భూతం. కులప్రతిష్ట, కుటుంబ పరువు అని ప్రాకులాడుతూ రక్తమాంసాలు హరిస్తున్నవి 'కుల దురహంకార హత్యలు'. ఆ దౌష్ట్యానికి బలికాబోయినా వెనుకంజవేయక... ధైర్యంగా ఎదుర్కొన్న హర్యానాకు చెందిన పానిపట్‌ నివాసి ముకేష్‌ మల్లిక్‌ జ్ఞాపకాలే ఇవి...

మనసు మార్చుకున్న భార్యాభర్తలు

కొత్తగా రెక్కలు తొడిగిన సీతాకోక చిలుకకు హద్దులే ఉండవు. ఈ ప్రపంచమంతా తనదే అనుకుంటుంది. తోటలోనైనా, అడవిలోనైనా స్వేచ్ఛగా విహరిస్తూనే ఉంటుంది. ఆ సీతాకోక చిలుకలాంటిదే ఈ అనిత కూడా. యవ్వనంలోకి అడుగిడిన ఒక అడవి మల్లె. ఆదిలాబాద్‌ జిల్లాలోని తలమడుగు మండలంలోని ఓ చిన్న పల్లెలో అన్నదమ్ముళ్ల మధ్య అనిత అల్లారుముద్దుగా పెరిగింది. ఆమె ఓ గిరిజన గోండు యువతి. ప్రేమాప్యాయతలకు లోటులేకుండా పెరిగిన తరుణి. అందరిలాగే ఆటపాటలతో ఆమె జీవితం చక్కగా సాగుతోంది.

ఎంత అవసరం?

ఆహారంలో తీసుకునే కొవ్వు పదార్థాలు శరీరానికి అవసరమే. కానీ ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలరీత్యా నూనె పదార్థాలు ఎక్కువగా వద్దని ప్రతివారూ చెబుతుంటారు. అదీ నిజమే! కనుక కొవ్వు పదార్థాలు ఎంతవాడాలి, ఎందుకు వాడాలి, వాటి అవసరమేంటి అనే అంశాలు తెలుసుకుంటే మనం తీసుకునే ఆహారాన్ని నియంత్రించుకోవచ్చు. తద్వారా ఆరోగ్యంగా వుండొచ్చు.

మహిళలతో పెట్టుకుంటే కుర్చీలు కదులుతాయి

మహిళలతో పెట్టుకుంటే పాలకుల కుర్చీలు కదులుతాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ హెచ్చరించారు. బుధవారంనాడు ఐకెపి యానిమేటర్లపై పోలీసులు జరిపిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. పోలీసుల దుశ్శాసన పర్వం అనంతరం కూడా ఐకెపి యానిమేటర్లు ఇందిరాపార్కు వద్ద తమ నిరసనలు గురువారం కొనసాగించారు. వీరి పోరాటానికి విస్తృత మద్దతు లభించింది. సిఐటియు, ఐద్వా జాతీయ నాయకులు, అంగన్‌వాడీ హెల్పర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌, తెలుగునాడు మహిళా సంఘం నేతలు, పలువురు ఎమ్మెల్సీలు దీక్షా శిబిరాన్ని సందర్శించారు. సిఐటియు జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎకె పద్మనాభన్‌, తపన్‌ సిన్హాతో కలిసి దీక్షా శిబిరాన్ని బృందాకరత్‌ కూడా సందర్శించారు.

బిపిపై అమెరికా దావా నష్టపరిహారం రాబట్టేందుకు చర్యలు ప్రారంభం

గల్ఫ్‌ చమురు లీక్‌కు కారణమైన బిపి, పలు ఇతర కంపెనీలపై నష్టపరిహారం కోసం అమెరికా న్యాయ విభాగం బుధవారం దావా వేసింది. లీక్‌ వల్ల లెక్కలేనంతగా జరిగిన ఆర్థిక, పర్యావరణ నష్టాన్ని రాబట్టేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆ కంపెనీలు బావి తవ్వడంలో ఫెడరల్‌ రక్షణ నిబంధనలను బేఖాతరు చేసినట్లు ప్రభుత్వం విమర్శించింది.

ఆస్కార్‌బరిలో రెహమాన్‌

మొజార్ట్‌ ఆఫ్‌ మద్రాస్‌ ఎ.ఆర్‌.రెహమాన్‌ మరోసారి ఆస్కార్‌ అవార్డుల బరిలో నిలబడనున్నారు. డానీ బోయెల్‌ తీసిన '127 అవర్స్‌' చిత్రానికి రెహమాన్‌ మ్యూజిక్‌ అందించారు. ఇందులోని 'ఇఫ్‌ ఐ రైజ్‌' అనే పాట, ఓరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ అవార్డుకు పోటీ పడనుంది. మొత్తం 41 పాటలు ఆస్కార్‌ పురస్కారం కోసం పోటీ పడుతున్నాయి. ఇందులో అత్యధిక నామినేషన్లు పొందిన మొదటి ఐదు పాటల్ని, తుది పోరుకు సిద్ధం చేస్తారు. ఫైనల్‌ టాప్‌ 5 నామినేషన్‌కు ఎంపికయ్యే జాబితా జవవరి 6న అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్........

మరో చంద్రముఖి

సీక్వెల్స్‌తో మెప్పించగలడం సాహసమైతే...రజనీకాంత్‌ వంటి నటుడు చేసిన పాత్రను మళ్ళీ మరొకరు చేయడం మరింత సాహసమే. వెంకటేష్‌ అటువంటి సాహసం చేసి కొంత మెప్పించగలిగాడు. పిల్లల్ని, పెద్దల్ని అలరించే పాత్రలు పోషించిన వెంకటేష్‌కు 25 ఏళ్ళ కెరీర్‌లో, ఛాలెంజ్‌గా తీసుకుని చేసిన చిత్రం నాగవల్లి. డాక్టర్‌గా, రాజుగా, అఘోరాగా మెప్పించాడు. చంద్రముఖి దర్శకుడు పి.వాసు నాగవల్లికీ దర్శకత్వం వహించారు. కన్నడలో ఆప్తమిత్ర, ఆప్తరక్షకగా సీక్వెల్‌ చేసిన ఆయన తెలుగులోనూ అదే ప్రయోగం చేశాడు. స్క్రీన్‌ప్లే చేయడంలో కాస్త గందరగోళపడ్డాడనే చెప్పాలి...

వాణిజ్య ప్రకటనలు మహిళల పతిష్టకు మరకలు

స్త్రీలను మూసపద్ధతిలోనూ, శృంగార నాయికలుగానూ చూపటంలో నయా మార్కెట్‌ ఆర్థికవ్యవస్ధకు లాభం ఉన్నది. అంతేకాక, మరో రెండు ప్రయోజనాలు కూడా నెరవేరతాయి. ఒకవైపున వారిని పితృస్వామ్య వ్యవస్థలోనే బంధించి ఉంచవచ్చు. మరోవైపున, ప్రపంచ మార్కెట్‌లోని దోపిడీ శక్తులకు అమ్మకపు సరకుగా అందుబాటులో.........

సౌత్‌ సెంట్రల్‌ రైల్వే నుంచి గ్రూప్‌-డి పోస్టులు

సౌత్‌ సెంట్రల్‌ రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ సికింద్రాబాద్‌ భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రూప్‌-డి పోస్టులైన ట్రాక్‌మెన్‌-5005, యార్డ్‌ పోర్టర్‌-1100, హెల్పర్‌-2061, హమాల్‌- 380, సపారువాలా- 138, ప్యూన్‌-45...ఖాళీలు ప్రకటించారు. అర్హత 10వ తరగతి , ఐటీఐ పాసై ఉండాలి. వయసు 18 నుండి 33 సంవత్సరాల లోపు ఉండాలి. దరఖాస్తుల దాఖలకు చివరి తేది........

వినదగునెవ్వరు చెప్పిన...

ఎవరైనా ఒక లక్ష్యం నిర్దేశించుకున్నాక ఇతరుల సలహా అడుగుతారు. కొంతమంది ఇతరుల సలహా మీదనే తమ లక్ష్యం సరిదిద్దుకుంటుంటారు. ఈ రెండింటికి తేడా ఉంది. 'ఇతరుల సలహాలతోనే లక్ష్యాన్ని సరిదిద్దుకుంటే, ఎన్నటికీ లక్ష్యం చేరలేరు' అన్నది మానసిక శాస్త్రవేత్తల........