31, డిసెంబర్ 2010, శుక్రవారం
నివేదిక ఇచ్చేశారు
ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర ప్రదేశ్ డిమాండ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులపై శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఛైర్మన్ జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ సభ్యులు గడువుకు ఒకరోజు ముందుగా, కేంద్ర హోం మంత్రి చిదంబరానికి గురువారమిక్కడ నివేదికను సమర్పించారు. జనవరి 6న నివేదికను బహిర్గతం చేస్తామని, అదే రోజు ఆంధ్రప్ర దేశ్లోని 8 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని అనంతరం చిదంబరం ప్రకటించారు. గురువారం ఉదయం ఇక్కడి విజ్ఞాన్ భవన్లో శ్రీకృష్ణ కమిటీ సమావేశ మయ్యింది. నివేదిక ప్రతులపై ఈ సందర్భంగా సభ్యులందరూ.......
"రగడ" బడ్జెట్ కంట్రోల్ చేశాం : నాగ్
పరమవీర చక్ర ఆడియో ఫంక్షన్ లో నందమూరి హీరోల సందడి
యాభైరోజులు పూర్తయిన 'ఏమైంది ఈవేళ'
30, డిసెంబర్ 2010, గురువారం
చిదంబరం లేఖ రాజకీయ దురుద్దేశంతోనే
బెంగాల్లోని జంగల్మహల్ ప్రాంతంలోని పరిస్థితిపై ౖ కేంద్ర హౌం మంత్రి పి చిదంబరం చేసిన ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య స్పష్టం చేశారు. చిదంబరం రాసిన లేఖకు ఆయన జవాబిస్తూ బుధవారం వాటి ప్రతులను మీడియాకు విడుదల చేశారు. డిశంబర్ 28న రాసిన బుద్ధదేవ్ లేఖ పూర్తి పాఠం...
ఆఫ్ఘన్లో 700 మంది నాటో సైనికుల మృతి
ఆఫ్ఘనిస్తాన్లో 2010లో ఏడు వందల మంది నాటో సైనికులు మృతి చెందినట్లు అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక తెలిపింది. తాలిబాన్ తిరుగుబాటుదార్లను అణచివేసే ఉద్దేశంతో దేశంలోకి వేలాది అదనపు సంకీర్ణ దళాలను దించారు. దాదాపు దశాబ్ద కాలంగా జరుగుతున్న యుద్ధంలో ఇంతకు ముందెన్నడూ లేనంత అత్యధికంగా ఈ సంవత్సరం నాటో సైనికులు మృతి చెందారు. అయితే దేశ దక్షిణ ప్రాంతంలో ఉగ్రవాదులకు సాంప్రదాయికంగా బలంగా ఉన్న ప్రాంతాల్లో తాము పురోగతి సాధించినట్లు నాటో, అమెరికా చెబుతున్నాయి.
సోషల్ నెట్వర్క్లో నెo.1
ఆటుపోట్లసినిమా
29, డిసెంబర్ 2010, బుధవారం
బాలచందర్కు అక్కినేని అవార్డు
కేసులన్నీ ఎత్తేస్తాం
ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర ఆందోళనల సందర్భంగా విద్యార్థులు, ఇతరులపై పెట్టిన కేసుల ఎత్తివేతకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రబద్ధంగా అంగీకరించింది. ఈ మేరకు పెట్టిన కేసులన్నిటినీ ఎత్తివేస్తామని లిఖితపూర్వకంగా తెలియజేసింది. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తెలంగాణా ప్రాంత మంత్రులతో మంగళవారం జరిపిన సుదీర్ఘ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రకటనతో తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు రెండు రోజులుగా చేస్తున్న నిరవధిక దీక్షను సాయంత్రం నాలుగు గంటలకు విరమించారు. ప్రభుత్వ పత్రికా ప్రకటనను ఎంపీలకు మంత్రులు అందజేశారు.
'పెన్డౌన్'పై సర్కారుకు నోటీసు
తాము ఎదుతాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల 19, 20, 21 తేదీల్లో నిర్వహించతలపెట్టిన పెన్డౌన్, చాక్డౌన్, టూల్డౌన్ ర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల 19, 20, 21 తేదీల్లో నిర్వహించతలపెట్టిన పెన్డౌన్, చాక్డౌన్, టూల్డౌన్ కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జెఎసి నోటీసులిచ్చింది. మంగళవారం సచివాలయంలో జెఎసి చైర్మన్ వి గోపాల్రెడ్డి నేతృత్వంలో వెళ్లి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్కు నోటీసు అందజేశారు.
రాళ్లు... చెప్పులు...
కాంగ్రెస్ పార్టీలో అనంతపురం జిల్లా గ్రూపు రాజకీయాలు మళ్లీ రచ్చకెక్కాయి. కాంగ్రెస్ కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి కుమ్ములాటకు దిగారు. పరస్పరం రాళ్లు, చెప్పులతో కొట్టుకున్నారు. ఫర్నీచరు ధ్వంసం చేశారు. కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన 125వ వ్యవస్థాపక దినోత్సవం గ్రూపు తగాదాలకు వేదికగా మారింది. చాలా కాలంగా జిల్లాలో మాజీ మంత్రి జెసి.దివాకర్రెడ్డి, మంత్రులు రఘువీరారెడ్డి, శైలజనాథ్ మధ్య పొసగడం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆధిక్యత కోసం ప్రయత్నిస్తున్నారు.
మెజార్టీ ప్రజలను సంతృప్తి పరుస్తాం
' రాష్ట్రంలోని అత్యధిక ప్రజలకు అతి ఎక్కువ సంతృప్తినిచ్చే విధంగా నివేదికను రూపొందించాం ' అని రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్రం నియమించిన కమిటీ ఛైర్మన్ జస్టిస్ శ్రీకృష్ణ వ్యాఖ్యానించారు. నివేదిక రూపకల్పన పూర్తయిందని ఆయన ప్రకటించారు. డిసెంబర్ 31లోపు కేంద్ర హౌం మంత్రికి సమర్పిస్తామని తెలిపారు. నివేదికలోని అంశాలు ఏ విధంగా ఉన్నప్పటికీ హింసకు ఏ ఒక్కరూ తావివ్వరాదని విజ్ఞప్తి చేశారు. తమ నివేదిక శాశ్వత పరిష్కారం చూపుతుందని భావిస్తున్నామన్నారు. కమిటీ సభ్యులు, ఇతర నిపుణులతో కలిసి మంగళవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. గడువు పూర్తవుతోన్న నేపథ్యంలో ఇక్కడి ఆంధ్రప్రదేశ్ భవన్లో కమిటీ విలేకరుల సమావేశం నిర్వహించింది.
ఎన్నికలప్పుడే రాజకీయాలు
ఎన్నికలప్పుడే రాజకీయాలు... ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టిసారించాలి.. అధికార, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వైద్య కళాశాలకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టరేట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం మాట్లాడారు. 'నిజామాబాద్ జిల్లాకు నాకు చాలా అనుబంధముంది. నేను క్రికెట్ క్రీడాకారుడిగా ఉన్నప్పుడు అత్యధిక స్కోర్ నమోదు చేసింది ఇక్కడే. అందుకే జిల్లాలో రూ.200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాను' అని అన్నారు.
2జి సెక్ట్రమ్ కుంభకోణం జెపిసిపై బిజెపిలో విభేదాలు?
2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై దర్యాప్తు విషయంలో బిజెపికి బీటలు వారుతున్నాయా? ఈ విషయంలో మంగళవారం ఆ పార్టీ నేతలు స్పందించిన తీరు చూస్తుంటే ఇదే అనుమానం కలుగుతుంది. ప్రజా పద్దుల కమిటీ(పిఎసి)కి ఛైర్మన్గా ఉన్న మురళీ మనోహన్ జోషి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ కుంభకోణంపై దర్యాప్తు చేసే సమర్థత కమిటీకి ఉందని పేర్కొనగా, లోక్సభలో ఆ పార్టీ నేత సుష్మా స్వరాజ్ మాత్రం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి)యే మరింత పదునైందని అన్నారు.
హైతీలో కలరా మరణాలు 2,707
హైతీలో అక్టోబర్లో అకస్మాత్తుగా పెచ్చరిల్లిన కలరా వ్యాధి వల్ల 2,707 మరణాలు సంభవించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంకా ఈ వ్యాధి దేశవ్యాప్తంగా 1,28,251 మందికి సోకినట్లు తెలిపింది. ఈ వ్యాధి దేశం మొత్తానికీ వ్యాపించిందని, ఉత్తర ప్రాంతంలోని ఆర్టీబోనైట్లో తీవ్ర రూపంలో ఉందని ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. దక్షిణ ప్రాంత రాష్ట్రం నిప్పెస్లో తాజాగా వ్యాధి వ్యాపించి 44 మంది మృతి చెందినట్లు వార్తలందాయి. దేశ నైరుతీ ప్రాంతంలోని గ్రాండ్ అన్సేలో పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లు పేర్కొంది. ప్రజలలో చైతన్యం పెంపొందించేందుకు, ఆరోగ్య చర్యల గురించి వారికి తెలియజేసేందుకు, ప్రధా
"మెగా "ఫ్యామిలి మెంబర్స్ వేసవికి సిద్ధమవుతున్నారు ...
అందరిచూపూ బుల్లితెరవైపే...
'ఒక సీరియల్ నిర్మిస్తే 200 మంది కుటుంబాలకు పోషణ లభిస్తుంది. ఒకప్పుడు సీరియల్ అంటే చిన్నచూపు ఉండేది. ప్రస్తుతం అగ్రహీరోలు సైతం బుల్లితెరవైపు చూస్తున్నారు. దానికున్న ఆదరణ గ్రహించారు. 1988లో విశ్వామిత్ర సీరియల్ చేశాను. అంతేకాకుండా మొట్టమొదటగా బీటాకామ్ వాడింది నేనే. ఆ తర్వాత సినిమాలపరంగా బిజీగా ఉండటంతో..
28, డిసెంబర్ 2010, మంగళవారం
బాలీవుడ్లో... మేడిన్ చైనా
నాణ్యమైన, చవకైన వస్తువులకు మారుపేరుగా భారత్లో వినిపించే పదం...మేడిన్ చైనా. మనదేశంలోనే కాకుండా, ప్రపంచమార్కెట్లోనూ నమ్మకమైన స్థానాన్ని చైనా ఉత్పత్తులు సంపాదించుకున్నాయి. రానున్న రోజుల్లో భారతీయ సినిమా పోస్టర్పైనా చైనా-భారత్ కథలు కనిపించనున్నాయి. షాంఘై, బీజింగ్...మొదలైన చైనా నగరాల్లో మన షారూక్ఖానో, సల్మాన్ఖానో, షాహిద్ కపూరో...........
ఫలించని చర్చలు
ప్రత్యేక తెలంగాణా ఆందోళనల నేపథ్యంలో విద్యార్థులపై పెట్టిన కేసులను పూర్తిగా, బేషరతుగా ఎత్తివేయాలంటూ తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ ఎంపిలు నిరవధిక దీక్ష చేపట్టారు. సోమవారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎంపిలు కె కేశవరావు, సర్వే సత్యనారాయణ, మందా జగన్నాథం, జి వివేక్, గుత్తా సుఖేందర్రెడ్డి, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి దీక్షలో కూర్చున్నారు.
2 జి కుంభకోణం పిఎసికి కాగ్ వివరణ
బిజెపి నేత మురళీ మనోహర్ జోషి ఆధ్వర్యంలోని ప్రజాపద్దుల కమిటీ(పిఎసి) ఎదుట భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వినోద్ రారు సోమవారం హాజరయ్యారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై సమర్పించిన నివేదికలోని అంశాలను జోషికి సంక్షిప్తంగా వివరించారు. దాదాపు రూ.1.76 లక్షల కోట్ల కుంభకోణాన్ని వెలికి తీసేందుకు తాము ఏ విధంగా తనిఖీలు చేపట్టిందీ విపులీకరించారు. స్వతంత్ర భారత చరిత్రలోనే 2జి కుంభకోణం అతి పెద్దది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) వేయడం ద్వారానే ఈ కుంభకోణానికి సంబంధించిన వాస్తవ విషయాల వెల్లడవుతాయని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
మళ్ళీ రెచ్చగొట్టిన ద.కొరియా
రోశయ్యపై కేసు
మాస్ చిత్రాలే ఆడుతున్నాయి
శ్రీకాంత్ హీరోగా సుధాకర్నాయుడు (జీవీ) దర్శకత్వంలో సి.ఆర్. మనోహర్ నిర్మించిన చిత్రం 'రంగ ది దొంగ'. ఈ చిత్రం ఈనెల 30న విడుదలకానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ పలు విషయాలు వెల్లడించారు. చిత్ర కథ గురించి చెబుతూ.. మూడేళ్ళనాడు కథ విన్నాను. ఈ సినిమాలో దొంగ పాత్ర వినోదంగా ఉంటుంది. ఫ్యాక్షనిస్టు పాత్ర సీరియస్గా ఉంటుంది. ఈ రెండు పాత్రలు బాగా నచ్చాయి..........
27, డిసెంబర్ 2010, సోమవారం
ఆత్మకథ ప్రచురణకు అసాంజే ఒప్పందం
కౌలు రైతు నోట మట్టి
భుక్తికి మిగిలినా చాలనుకుని కౌలు సాగుకు దిగిన నిరుపేదలను సార్వాలో అతివృష్టి కాటేసింది. ప్రకృతి విలయతాం డవంలో చిక్కుకున్న కౌలుదారులను ఆదుకో వలసిన ప్రభుత్వం మాటలతో సరిపెడు తోంది. కౌలు రైతులకు ప్రభుత్వం మనోధైర్యం కలిగించే చర్యలు చేపట్టిన దాఖలాలే లేవు. ప్రస్తుతం అధికారులు రూపొందిస్తోన్న నష్ట అంచనాల జాబితాల్లో కౌలు రైతుల పేర్లు చోటు చేసుకోవటం లేదు.
ఇక రైల్వే వాత
ఉప్పు, చక్కర రవాణా ఛార్జీలను రైల్వే శాఖ పెంచింది. అవే కాకుండా ముడి ఇనుము, ఉక్కు, బొగ్గు, సిమెంట్, కాస్టిక్ పొటాష్, పెట్రోలియం ఉత్పత్తులపై 4 శాతం మేరకు రవాణా ఛార్జీలను పెంచింది. నూతన ఛార్జీలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయి. రైల్వేల నిర్వహణ ఖర్చు, ఇంధన ఛార్జీలు, ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతనాలు పెరగడం వల్ల సరుకు రవాణా ఛార్జీలను పెంచక తప్పడం లేదని సీనియర్ అధికారి ఒకరు రైల్ భవన్లో మీడియాతో అన్నారు.
బుల్లితెరపై సినీస్టార్స్ !
26, డిసెంబర్ 2010, ఆదివారం
సొంత అజెండాలతో మీడియా
ఆన్లైన్లో డైరీ...
నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, లక్ష్యాలు నిర్దేశించుకోవడం పరిపాటి. ఆ నిర్ణయాలను, లక్ష్యాలను, రోజువారీ వ్యాపకాలను నిక్షిప్తం చేసుకోవడం ప్రపంచంలో ఎంతోమందికి ఒక వ్యాపకంగా వుంటుంది. ఆ వ్యాపకమే డైరీ రాయడం, లేదా ముఖ్యమైన తేదీలను, విషయాలను రాసుకోవడం, ముఖ్యమైన లెక్కలు రాసుకోవడం... ఇవన్నీ సర్వసాధారణం. అయితే..........
మత్తు వదిలించిన మహా సంక్షోభం
పాత ఇంజనే కారణమా?
హీరో నెగెటివ్ పాత్రలూ చేయాలి
'నాగవల్లి' చిత్రం గురించి మాట్లాడుతూ చిత్ర యూనిట్ నేడు ప్రధాన సమస్య అయిన రైతుల గురించి స్పందించడం విశేషం. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు. ప్రకృతివైపరీత్యాలు సందర్భంగా ఆదుకునే పరిశ్రమ రైతుల కోసం ఏదో ఒకటి చేయడానికి సిద్ధంగా ఉందని పరుచూరి.....
25, డిసెంబర్ 2010, శనివారం
గ్రీటింగ్ కథ...!
వెనిజులా మహిళల జీవితాలు గణనీయంగా మెరుగుదల
యోలీ ఫెర్నాండెజ్ వెనిజులాలోని వలెసినా నగరంలో నివశిస్తుంటారు. అధ్యక్షుడు హ్యుగో ఛావెజ్ నేతృత్వంలోని యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులా (పిఎస్యువి) సభ్యురాలిగా వున్న ఆమె మిషన్ మెర్కాల్లో పనిచేస్తున్నారు. ఈ సంస్థ పేద ప్రజలకు సబ్సిడీ ధరలకు ఆహారాన్ని అందచేస్తుంటుంది. వెనిజులాలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక మార్పుల్లో మహిళలు పోషిస్తున్న పాత్రపై యోలీ ఫెర్నాండెజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విశేషాలు...
మహిళా ఉద్యమాల ఆవశ్యకత పెరిగింది : బృందాకరత్
రాజకీయంగా అసాధ్యం : యుఎస్కు తన అప్పగింతపై అసాంజే
బ్రిటిష్ ప్రధాని కామెరూన్ చేతు ల్లోనే తన భవిష్యత్తు ఉందని, అయితే తనను అమెరికాకు అప్పగించడం రాజకీయంగా అసాధ్యమని వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే అన్నాడు. తనపై గూఢచర్య ఆరోపణలకు సంబంధించి అసాంజే ఈ విధంగా స్పందించాడు. ఎల్లింగ్హామ్ హాల్లో తనంతట తానుగా గృహనిర్బంధంలో ఉంటున్న ఆయన గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.........
24, డిసెంబర్ 2010, శుక్రవారం
దాల్ మస్కా
రాజ్మా: 100 గ్రా, మినుములు: 50 గ్రా, టమాటా సాస్: 4 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు: 100 గ్రా, నూనె: 50 గ్రా, అల్లం వెల్లుల్లి : 2 టేబుల్ స్పూన్లు, కారం: టీ స్పూను, పసుపు: చిటికెడు, గరంమసాలా: చిటికెడు, జీడిపప్పు: టేబుల్ స్పూను, గసగసాలు: టేబుల్స్పూను, ఆరెంజ్ కలర్: పావు టీస్పూను, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కట్ట, వెన్న: ఒకటిన్నర టేబుల్ స్పూను.......
కొత్తదనంతో... ప్రేమకావాలి
మనిషిగా విజయం
మన దేశంలోనంటే వందలాది పండుగలు, ఏడాదికి బోలెడన్ని సెలవులు వున్నాయి కానీ, పాశ్చాత్యదేశాల్లో క్రిస్మస్ మాత్రమే పెద్ద పండుగ. పండుగంటే కేవలం కొత్తదుస్తులు, పిండివంటలు మాత్రమే కాదు. ప్రతి పండుగ వెనుకా ఏదో ఒక పరమార్థం వుంటుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు, ఆ పండుగరోజే కాదు, జీవితమే సఫలమూ..! మరి క్రిస్మస్నుండి ఏం నేర్చుకుందాం అని ప్రశ్నించుకుంటే...
మెయిన్స్ నెగ్గాలంటే... ప్రణాళిక, పట్టుదల రెండూ అవసరం
అసలు సిసలు భారత రత్న సచిన్
వారిద్దరూ వారివారి రంగాల్లో లెజెండ్లే. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి వల్లమాలిన అభిమానం. ఏమాత్రం ప్రశంసించేందుకు అవకాశం లభించినా దానిని వారు వదులుకోరు. వారే సినీ గానకోకిల లతా మంగేష్కర్, క్రికెట్లో ఆధునిక డాన్ సచిన్ టెండూల్కర్. సచిన్ వంటి సాటిలేని మేటి కుమారుడు కావడం తన అదృష్టమని లతా మంగేష్కర్ కొనియాడారు. దేశంలో ఎంతమంది మేటి క్రీడాకారులను తయారుచేసినప్పటికీ సచిన్కు సాటి మరొకరు ఉండబోరని, అతడికి అతడే సాటి అని లత......
ఒక్క రూపాయీ పెంచేదిలేదు : అఖిలపక్షంలో సిఎం
రైతాంగాన్ని ఆదుకోవడానికి ఇప్పటికే ప్రకటించిన ప్యాకేజికి అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్కుమార్రెడ్డి తెగేసి చెప్పారు. సచివాలయంలో గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో మరింత మెరుగైన ప్యాకేజి కావాలన్న ప్రతిపక్షాల డిమాండ్ను ఆయన తోసిపుచ్చారు. కనీస మొత్తంగా 8వేల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ రైతులకు చెల్లించాలన్న విజ్ఞప్తికి సైతం తిరస్కారమే.........
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)