గురువారం 16 డిసెంబర్ 2010

నారారోహిత్‌ హీరోగా చిత్రం

'బాణం' ఫేమ్‌ నారా రోహిత్‌ కథానాయకునిగా 'సింహా' చిత్ర నిర్మాత పరుచూరి కిరీటి ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. హన్సిక హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి సుకుమార్‌దగ్గర పనిచేసిన ప్రకాష్‌ తోలేటి దర్శకునిగా.....

సౌరసునామి, సౌర తుపాను అంటే?

సౌరసునామి, సౌరతుపాను అంటే ఏమిటి? ఇవి ఏ పరిస్థితులలో వస్తాయి? '2012 డిసెంబర్‌ 21వ తేదీ' పేరుతో వచ్చే వ్యాఖ్యలలో సౌర తుపాను ఒకటి అని ప్రచార సాధనాలు చెపుతున్నాయి. ఇది నిజమేనా? పూర్వం కూడా ఇవి ఏర్పడ్డాయా? - డి.హర్ష, అద్దంకి, ప్రకాశంజిల్లా.  నాలుగు కోట్ల కిలోమీటర్ల మేరకు ఎటు చూసినా మనకు కనిపించే అతి పెద్ద వస్తువు సూర్యుడు. భూమ్మీద జీవం ఏర్పడడానికి, బతికి బట్టకట్టడానికి భూమ్మీద ఉన్న అంతరంగిక పరిస్థితులెంత నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయో అంతకన్నా ఎక్కువ.........

ఖరీదైన జీవితం

''వ్యాపారవేత్త భూపాల్‌ను ఎవరో మూడునెలల క్రితం హత్య చేశారు. మనకు హంతకుడు ఎవరైంది తెలియలేదు. భూపాల్‌ సూట్‌కేసులో పదిలక్షలు తీసుకుని వస్తుండగా డబ్బుకోసం ఈ హత్య జరిగిందని వాళ్ల కుటుంబసభ్యులు చెబుతున్నారు. దీనిపై ఆ రాత్రి డబ్బు ఇచ్చిన శేఠ్‌ని అనుమానించి ప్రశ్నించాం. ఒక చేత్తో ఇచ్చి కారును వెంబడించి మరో చేత్తో హత్యచేసి ఆ డబ్బును తీసుకున్నావనే అభియోగంతో ఇంటరాగేషన్‌ చేశాం. కానీ, అతడు అలాంటి ఘాతుకానికి పాల్పడలేదని తేలింది. స్వరూప్‌, నీవు ఎలాగైనా ఈ కేసును సాల్వ్‌ చేయాలి. నీవు ఎవరిని అనుమానించినా వారిని వదలకుండా వెతికిపట్టుకో!'' అన్నాడు పోలీసుకమిషనర్‌.భూపాల్‌ హత్యాస్థలం పరిధిలోగల పోలీస్‌ ఠాణాకు స్వరూప్‌ వెళ్లాడు........

పెట్రో భారంపై పెల్లుబికిన నిరసన

 

పెట్రో ధరల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. ఇష్టారీతిన భారాలు మోపుతోన్న యుపిఎ-2 ప్రభుత్వ తీరుపై వినియోగదారులు మండిపడ్డారు. సిపిఎం, సిపిఐ, టిడిపి, ప్రజాసంఘాల ఆధ్వర్యాన ప్రదర్శనలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మ దగ్ధం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో రాస్తారోకో చేస్తోన్న సిపిఎం జిల్లా కార్యదర్శి జి ఓబుళకొండారెడ్డి, నగర నాయకులు ప్రసూన తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జగదాంబ జంక్షన్‌ వద్ద రాస్తారోకో చేసి, దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఉమ్మడి ప్రగతికి విస్తృత అవకాశాలు

ప్రస్తుత ప్రపంచంలో భారత్‌, చైనా ప్రగతిపథంలో పురోగమించేందుకు అనేక అవకాశాలున్నాయని చైనా ప్రధాని వెన్‌జియాబావో ఉద్ఘాటించారు. నాలుగు రోజుల అధికార పర్యటన కోసం వచ్చిన ఆయన బుధవారం ఇక్కడ ఉభయదేశాల పారిశ్రామిక మండళ్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన పారిశ్రామికవేత్తల సమావేశంలో ప్రసంగించారు. భారత్‌, చైనా సహకార భాగస్వాములే కానీ ప్రత్యర్థులు కాదని ఆయన స్పష్టం చేశారు.

సార్వత్రిక సమ్మెతో స్తంభించిన గ్రీస్‌

గ్రీస్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన కార్మిక సంస్కరణలు, పొదుపు చర్యలను నిరసిస్తూ బుధవారం జరిగిన సార్వత్రిక సమ్మెతో దేశం స్థంభించిపోయింది. ఉద్యోగ, కార్మిక సంఘాల పిలుపు మేరకు జరిగిన ఈ సమ్మె కారణంగా విమాన సర్వీసులు స్థంభించిపోగా, ఫ్యాక్టరీలు, ఆస్పత్రులు, రవాణా సంస్థలు మూతపడ్డాయి. సెంట్రల్‌ ఏథెన్స్‌లో జరిగిన రెండు వేర్వేరు ప్రదర్శనల్లో దాదాపు ఏడు వేల మందికి పైగా ఆందోళనకారులు పాల్గొని సంస్కరణల పర్వంపై తమ నిరసన తెలియచేశారు.

వాస్తు .. జ్యోతిష్యాలు.. రోశయ్య విషయంలో?!

రోశయ్యగారు 2009 సెప్టెంబరులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కానీ ముఖ్యమంత్రి అధికార క్యాంపు కార్యాలయం నుండి కార్యకలాపాలను 2010 మార్చి 22న ఉదయం 8-46 గంటల నుండే ప్రారంభించారు. ఎందుకని ఇన్ని నెలల ఆలస్యం? దీని కారణాల్ని 'టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా' పత్రిక 18-2-10న ఇలా వివరించింది. ''రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ అధికారి మాట్లాడుతూ.. 'రోశయ్యగారికి వాస్తుపై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. ఆయన కోరిక మేరకు కొంతమంది పురోహితులు, క్యాంపు కార్యాలయాన్ని ఈ సంవత్సరం జనవరిలో దర్శించి, కొన్ని పెద్ద వాస్తు మార్పులనే సూచించారు. వాటిని కొద్దివారాలలో చేయబోతున్నాము'.........

నిర్మాతగా వర్మ కూతురు

రాంగోపాల్‌వర్మ కుమార్తె రేవతి సినీ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టు టాలీవుడ్‌ విశ్వసనీయ సమాచారం ! ఆయా రంగాల్లోని ప్రముఖులు తమ వారసులనూ అదే రంగంలోకి తీసుకురావటం ఆశ్చర్యపరిచే విషయమేమీ కాదని కొంతమంది సినీ ప్రముఖులు  అభిప్రాయపడుతున్నారు. మోహన్‌బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న మొదట యాంకర్‌గా బుల్లితెర ప్రవేశం చేశారు. అక్కడ తనదైన గుర్తింపును సాధించుకొని వెండితెర వైపూ........

మీకు తెలుసా?


ప్రయోగశాలల్లో కృత్రిమంగా మొక్కల్లో ఉత్పరివర్తకాలను ప్రేరేపించే పదార్థాలను ఉత్పరివర్తకాలు అంటారు. ఇవి భౌతికమైనవి. ఎక్స్‌, గామా, యూవి (అల్ట్రావైలెట్‌) కిరణాలు మొదలైనవి. సోడియం ఎజైడ్‌, ఇఎమ్‌ఎస్‌, ఎమ్‌ఎమ్‌ఎస్‌, నైట్రస్‌ యాసిడ్‌ తదితర రసాయనాలు ఈ కోవకు చెందుతాయి. సస్యరక్షణ మందులు ఇతర రసాయనాల అవశేషాలు పరిమితికి మించినప్పుడు ఉత్పరివర్తకాలుగా పనిచేస్తాయి......

ఇండియన్‌ ఓపెన్‌కు సైనా దూరం

టాప్‌ సీడ్‌ సైనా నెహ్వాల్‌ గాయం కారణంగా ఇక్కడ జరుగుతున్న ఇండియన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌కు దూరమైంది. రెండో సీడడ్‌ కుసుమస్తుతితో సహా అనేక మంది క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొనడం లేదు. హాంకాంగ్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలుచుకుని మంగళవారం నగరానికి వచ్చిన సైనా లేకపోవడం ఈ టోర్నీలో పెద్ద వెలితేనని చెప్పవచ్చు. హాంకాంగ్‌ టోర్నమెంట్‌లో ఆడుతుండగా ఆమె.......