శనివారం 11 డిసెంబర్ 2010
చర్చకు నోచని రైతు నష్టం
సభావ్యవహరాల సలహా కమిటీ (బిఎసి)లో నిర్ణయించిన విధంగా తొలిరోజు అసెంబ్లీలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగం అంశం చర్చకు నోచుకోలేదు. గత ఏడాది డిసెంబర్లో ప్రత్యేక తెలంగాణ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసుల ఎత్తివేత అంశం శుక్రవారం అసెంబ్లీని కుదిపేసింది. ఎటువంటి చర్చా లేకుండా శాసనసభ మంగళవారానికి వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తూ ప్రభుత్వం ప్రకటన చేయాలని టిఆర్ఎస్ డిమాండ్ చేసింది. సమాజానికి... సరళీకరణ విధానాలే పెను సవాలు
సమాజానికి సరళీకరణ విధానాలే పెను సవాలుగా మారాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు చెప్పారు. సరళీకరణ విధానాల మూలాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సాంస్కృతిక రంగాలపై డివైఎఫ్ఐ కేంద్రీకరించి పనిచేయాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (కామ్రేడ్ కాసాని ఈశ్వర్ నగర్)లో డివైఎఫ్ఐ 12వ రాష్ట్ర మహాసభల రెండో రోజు కార్యక్రమాలు జరిగాయి. కుంభకోణాల కర్నాటకం
తానో విభిన్న పార్టీ అని ప్రకటించుకునే బిజెపి కుంభకోణాల్లో కూరుకుపోయింది. దక్షిణభారతదేశంలో తొలిసారిగా బిజెపి ప్రభుత్వం ఏర్పడింది. కొద్దినాళ్లకే సిఎం ఎడ్యూరప్పతో సహ 11మంది మంత్రులు అవినీతిలో మునిగి తేలుతున్నారు. నీతినియమాల గురించి సుద్దులు చెప్పే బిజెపి చివరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం అవినీతి బురదను ఒంటి నిండా పూసుకుంటే 'కడగాల్సింది'పోయి 'భేష్.. శభాష్' అని పొగుడుతుంది. కేంద్రంలో కాంగ్రెస్ అవినీతిపై పోరాడుతుంది.హిల్లరీ రాజీనామా చేయాలి : ఛావెజ్
అమెరికాకు వ్యతిరేకంగా వికీలీక్స్ బహిర్గతం చేసిన రహస్య పత్రాలు యావత్ ప్రపంచాన్ని ఆలోచనలో పడేశాయి. ఆయా దేశాల విభిన్న దృక్కోణంలో నిశిత పరిశీలనను అమెరికా ఎదుర్కొంటోంది. పత్రాలు వెలుగు చూసిన నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తన పదవికి రాజీనామా చేయాలని వెనిజులా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్ డిమాండ్ చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)



