శుక్రవారం 10 డిసెంబర్ 2010

వివాహాలు - వ్యక్తిత్వాలు

''భర్త కొట్టినా తిట్టినా పడుండే రోజులు పోయాయి. అత్త ఆరళ్లు, ఆడబిడ్డ సాధింపులు లేని రోజులొచ్చేశాయి. ఇదివరకులా ఇప్పటి ఆడపిల్లలు లేరు''... ఈమధ్య వింటున్న మాటలివి. అంటే వారి ఉద్దేశ్యంలో ఆడపిల్లలు ఎంతో ఎత్తుకెదిగారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. వాస్తవానికి పరిస్థితులు అలా వున్నాయంటారా?! నిజానికి స్వేచ్ఛ, సమానత్వం ఆమడదూరంలోనే ఉన్నదన్న మాట మనం......

విద్యా ఉద్యోగ సమాచారం

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యుపిఎస్‌సి) దేశంలో సర్వీసెస్‌తో సహా పలు ప్రభుత్వ శాఖలకు కావలసిన ఉన్నతాధికారులను అందిస్తుంది. ఈ క్రమంలో ఏటా పోటీ పరీక్షలను నిర్వహిస్తుంది. క్రమం తప్పకుండా షెడ్యూల్‌ విడుదల చేస్తుంది. ఇదే విధంగా 2011 ఎగ్జామినేషన్‌ షెడ్యూల్‌ను కూడా ఇటీవలే విడుదల చేసింది. అందులోని ముఖ్యమైన పరీక్షల వివరాలు......

భారత్‌ 5-0 తేడాతో ఘన విజయం


భారత్‌ - న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్‌లో భారత్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ విభాగంగా రాణించి సిరీస్‌ కైవసం చేసుకుంది. టెస్టు మ్యాచ్‌లో 1-0 తేడాతో, వన్డేలో 5-0 తేడాతో భారత్‌ - న్యూజిలాండ్‌ పై రెండు విభాగాలుగా విజయం సాధించింది. ఆఖరి చివరి వన్డేలో న్యూజిలాండ్‌ 103 పరుగులకే అలౌట్‌ అయ్యింది. న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌లో ఫ్రాంక్లింగ్‌ 24 పరుగులు చేసి టాప్‌ స్కోర్‌గా నిలిచాడు. మిగితా బ్యాట్స్‌మైన్‌లు అంతగా రాణించలేకపోయారు. భారత్‌ బౌలింగ్‌లో ఆశ్విన్‌ 3 మూడు వికెట్లు తీసుకోగా యువరాజ్‌....................

షెల్‌ గుప్పిట్లో నైజీరియా సర్కారు

 నైజీరియా ప్రభుత్వంపై ఆంగ్లో-డచ్‌ చమురు సంస్థ షెల్‌ పట్టు బిగిస్తోందా? వికీలీక్స్‌ ఇటీవల వెల్లడించిన పత్రాలు ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నాయి. నైజీరియా ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వశాఖల్లోనూ తన మనుషులను చొప్పించిన షెల్‌ అక్కడి రాజకీయ నేతల ప్రతి కదలికకు సంబంధించిన సమాచారాన్నీ అమెరికా దౌత్యవేత్తలకు చేరవేసేందుకు ప్రయత్నించిందని వికీలీక్స్‌ బహిర్గతం చేసిన అమెరికా దౌత్య పత్రం ఒకటి వెల్లడించింది. ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ....................

ఆంధ్రా అబ్బాయి - కేరళ అమ్మాయి

 సినిమా ప్రొడక్షన్‌లో పలు విభాగాలపై అవగాహన ఏర్పరుచుకొని, ఇండిస్టీకి వచ్చిన దర్శకుడు రవిబాబు. మూస పద్ధతిలో, ఓ ఫార్ములా ఏర్పరుచుకొని సినిమా తీసేద్దాం...అనుకునే తరహా కాదు. ప్రేక్షకుడ్ని సున్నితంగా తట్టడం రవిబాబు దర్శకశైలి. ఆయన తాజా చిత్రం 'మనసారా' ఈ రోజు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆయన చెబుతున్న సంగతులు............

అక్కరకు రాని పంటల బీమా తుపానులతో రైతు బతుకు ఛిద్రం


 వ్యవసాయం కష్టతరమై గిట్టుబాటు కాక, ఇతర వృత్తుల్లోకి రైతులు మరలుతుండడంతో వారి నుంచి భూముల్ని లీజుకు తీసుకున్న కౌలు రైతుల పరిస్థితి ముందు గొయ్యి, వెనక నుయ్యి అన్న చందంగా తయారైంది. వారికి ఉన్న కొద్ది పాటి భూమికి తోడు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న వారు కొందరైతే, కూలి నుంచి కౌలుకు మారేవారు మరి కొందరు, ప్రకృతి విలయాలవల్ల మొట్టమొదట మునుగుతున్నది ఈ కౌలు రైతులే. గుంటూరు.....................

విస్తరిస్తున్న న్యాయవిద్య

 ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో వస్తున్న మార్పులు, ఆర్థిక, సాంఘీక పరిస్థితులు...మొదలైనవి లా గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. బిజినెస్‌ లాకు డిమాండ్‌ పెరుగుతోంది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, క్యాపిటల్‌ మార్కెట్స్‌, టాక్సేషన్‌, టెలికాం, ఇన్సూరెన్స్‌, పవర్‌ సెక్టార్‌, సివిల్‌ ఏవియేషన్‌, పోర్ట్స్‌, షిప్పింగ్‌, మీడియా, మేథో సంపత్తి హక్కులు, రియల్‌ ఎస్టేట్‌, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డాటా ప్రొటక్షన్‌ చట్టాలు వంటి విభాగాల్లో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. నాయ్య.................

అమెరికా దురహంకారం భారత రాయబారికి అవమానం

  అమెరికా దురహంకారం మరోసారి బట్టబయలయింది. భారత రాయబారి మీరాశంకర్‌ను అమెరికా ఇమిగ్రేషన్‌ అధికారులు దారుణంగా అవమానించారు. జాక్సన్‌ ఎవర్స్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఈ నెల 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న భారత ప్రభుత్వం దీనిని తీవ్రంగా ఖండించింది. అమెరికన్‌ అధికారుల వైఖరి తమకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని......