బుధవారం 8 డిసెంబర్ 2010

పగతో రగిలిపోయే...ఈగ

దర్శకుడు రాజమౌళి తాజా చిత్రం 'ఈగ'. డి.సురేష్‌బాబు సమర్పణలో వారాహి చలనచిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. మంగళవారం రామానాయుడు స్టూడియోలో షూటింగ్‌ ప్రారంభమైంది. నాని, సుదీప్‌, సమంతపై చిత్రించిన ముహూర్తపుషాట్‌కు వినాయక్‌ క్లాప్‌ కొట్టారు. రామానాయుడు స్విచ్ఛాన్‌ చేశారు. వెంకటేష్‌ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్‌.టి.ఆర్‌. రామ్‌చరణ్‌తేజ, రవితేజ.......

జడ్జిని ప్రభావితం చేసేందుకు రాజా యత్నం

కేంద్ర టెలికం శాఖ మాజీ మంత్రి రాజా మరో చిక్కులో పడ్డారు. క్రిమినల్‌ కేసు విచారిస్తున్న న్యాయమూర్తిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన మంత్రి రాజాయేనని మద్రాసు హైకోర్టు మంగళవారం ధ్రువీకరించింది. ఎంబిబిఎస్‌ పరీక్షల్లో మార్కులను మార్చడానికి సంబంధించిన కేసులో తనకు అనుకూలంగా వ్యవహరించాల్సిందిగా కోరేందుకు హైకోర్టు న్యాయమూర్తి ఆర్‌ రఘుపతితో మాట్లాడినట్లు చెబుతున్న మంత్రి రాజాయేనని జస్టిస్‌ ఎఫ్‌ఎం ఇబ్రహీం కలీఫుల్లా తెలిపారు. జస్టిస్‌ రఘుపతి 2009, అక్టోబర్‌లో భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో ఈ సంఘటన గురించి ప్రస్తావించారు. అయితే అప్పట్లో ఆ మంత్రి పేరు వెల్లడించలేదు. తమిళనాడు బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ కె చంద్రమోహన్‌ ద్వారా న్యాయమూర్తిని........

రైతు రక్షణకు చురుకైన ప్రత్యామ్నాయం..

రెండున్నర దశాబ్దాల అనుభవం తర్వాత కూడా రైతుల నష్టదాయక, దుర్భిక్షకారక సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలను పునరాలోచించడం లేదు. పైగా, పార్లమెంటు పరిశీలన లో ఉన్న విత్తనబిల్లు, సాధికార జీవ సాంకేతిక నియంత్రణ వ్యవస్థ బిల్లు, ప్రభుత్వ పరిశోధనల పేటెంటు హక్కుల పరిరక్షణ బిల్లు రైతును అతలాకుతలం చేస్తున్నాయి. అంతేకాకుండా వివిధ దేశాలతో చేసిన, చేసుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, వ్యవసాయోత్పత్తుల చిల్లర వ్యాపా రంలో విదేశీ పెట్టుబడులు........

అమెరికాది పెత్తందారీ పాత్ర

అమెరికా ప్రపంచంలో సాగిస్తున్న పెత్తందారీ పాత్రను చైనా చేపట్టాలనుకోవడం లేదని, చైనా పెరుగుదలను చూసి భయపడాల్సిన అవసరంలేదని ఆ దేశ ఉన్నత స్థాయి దూత ఒక వ్యాసంలో రాశారు. తమ దేశం ఆయుధ పోటీలో లేదని, తన వనరులను అభివృద్ధిపై చక్కగా ఖర్చుపెడుతోందని, తమ ప్రజలకు కావలసినంత ఆహారం అందించేలా చూస్తోందని ప్రజా ప్రతినిధి దారు బింగ్‌గూ చెప్పారు. 'అమెరికా స్థానాన్ని ఆక్రమించాలని, ప్రపంచంపై పెత్తనం చెలాయించాలని.........

రైతు నెత్తిన మరో పిడుగు

 వాయు'గండం' రూపంలో కోస్తా రైతాంగంపై మరో పిడుగు పడింది. సోమవారం నుంచీ కురుస్తోన్న వానలకు కోస్తా వ్యవసాయరంగం అస్తవ్యస్తమైంది. వర్షాలకు ఆరుగురు మృతి చెందారు. ఓ మహిళ గల్లంతయింది. నెల్లూరులో పెన్నా వారధి కాఫర్‌ డ్యాము మళ్లీ కొట్టుకుపోయింది. కోస్తా జిల్లాలన్నింటా చిన్నవాగులు కూడా పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోస్తాలో పలుచోట్ల 60 శాతం వరి పంట ఇంకా పొలాల్లోనే ఉంది. ఐదారు రోజులుగా వరి కోతలు.....................

ఉత్కంఠ పోరులో పైచేయి

 చిన్నస్వామి స్టేడియంలో భారత్‌ చిరస్మరణీయ విజయం సాధించింది. న్యూజిలాండ్‌ విధించిన 315 పరుగుల లక్ష్యాన్ని మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్‌ చేజారి పోయిందనుకుంటున్న స్థితిలో యూసుఫ్‌ పఠాన్‌ బౌండరీల మోత మోగించడంతో భారత్‌ 321 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఫలితంగా ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌, తన ఆధిక్యాన్ని 4-0కు పెంచుకుంది. ఆరో వికెట్‌కు సౌరభ్‌ తివారీతో కలిసి 133 భాగస్వామ్యాన్ని నిర్మిచడంతోపాటు 96 బంతుల్లో......................

వెబ్‌డిజైన్ లో విస్తరిస్తున్న అవకాశాలు...

 నేడు ప్రతీరంగంలోనూ ఇంటర్నెట్‌ వినియోగం తప్పనిసరైంది. చిన్న కార్యాలయం మొదలు బహుళజాతి సంస్థల వరకు దీని అవసరం బాగా పెరుగుతోంది. ప్రభుత్వ రంగమైనా, ప్రయివేటు రంగమైనా సేవలు, పథకాలు, లావాదేవీలు, ప్రచారాలు తదితర అంశాలకోసం ఇంటర్నెట్‌మీద ఆధారపడాల్సి వస్తోంది. ముఖ్యంగా ఇందులో భాగమైన వెబ్‌డిజైన్‌కు, అది రూపొందించే వారికి చక్కటి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. చెప్పదల్చుకున్న విషయాన్ని...............