ఆదివారం 28 నవంబర్ 2010

కాంట్రాక్టు లెక్చరర్లా ? కట్టు బానిసలా ?

 బడ్జెట్‌ సాంక్షన్‌ పోస్టుల్లో పనిచేస్తున్నా... తమను సర్కారు కట్టు బానిసలుగా చూస్తోందంటూ ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో చాలీ చాలని వేతనాలతో, అభద్రతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారికి కల్పించే ...............

నైపుణ్యమేకాదు సమయపాలనా కావాలి

  ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే... ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే వృత్తి నైపుణ్యంతో పాటు సమయపాలన, క్రమశిక్షణ అవసరం. ఇవి ఉంటేనే సక్సెస్‌ సాధించ గలుగుతారు. కాబట్టి మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా, ఎలాంటి పని ఒత్తిడి ఉన్నా సమయం ప్రకారం పని పూర్తి చేయకపోతే దానిని యాజమాన్యం, పై అధికారులు అసమర్థతగా భావించే అవకాశాలే ఎక్కువ కాబట్టి మీరున్న పరిస్థితినిబట్టి, పనినిబట్టి అనుకున్న సమయంలోగా పనిపూర్తయ్యే ప్రణాళిక రూపొందించుకోవాలి.

వీడని సస్పెన్స్

రాష్ట్ర మంత్రివర్గం కూర్పు పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఆదివారానికి ఈ కసరత్తు పూర్తవుతుందని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కు మార్‌రెడ్డి చెప్పారు. అదే విధంగా మంత్రివర్గంలో కేవలం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ముఖ్య మంత్రిగా ఎంపికైన తర్వాత కిరణ్‌కుమార్‌ రెడ్డి తొలిసారి ఢిల్లీ వచ్చారు. మంత్రివర్గ కూర్పుపై అధిష్టానం సూచనలు తీసుకునే క్రమంలో రోజంతా బిజీబిజీగా.......

రణంలో కొత్త 'కిరణం'

ప్రమాణ స్వీకారం చేసిన వెనువెంటనే ముఖ్యమంత్రి నిమ్స్‌కు వెళ్లినట్టే ఇందిరా పార్కు ధర్నా చౌకులో కిక్కిరిసిన వివిధ తరగతుల సమస్యల గురించి సత్వర చర్యలు తీసుకోవడం ద్వారానే జనం విశ్వాసం నిలబెట్టుకోవడం సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం అంటే అధికారులు అమాత్యులను అదుపు చేసుకోవడమే కాదు, అధిష్టానాన్ని మెప్పించడం మాత్రమే కాదు. అంతకంటే ముఖ్యమైంది అన్ని తరగతుల బాధలను పట్టించుకోవడం. కొత్త ముఖ్యమంత్రి తొలి ఘట్టంలోనే అందుకు..........

ఒబామా ఇప్పుడు అత్యంత ప్రమాదకారి : ఫైడల్‌ కాస్ట్రో

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అత్యంత ప్రమాదకారిగా ఉన్నట్లు క్యూబా విప్లవ నేత, కమ్యూనిస్టు దిగ్గజం ఫైడల్‌ కాస్ట్రో తెలిపారు. ఒబామా చురుకైన వ్యక్తేగానీ ఇప్పుడాయన కూడా పోటీ పడబోతున్నందున ప్రస్తుతం అత్యంత ప్రమాదకారిగా ఉన్నారని లాటిన్‌ అమెరికా మేధావులతో జరిగిన సమావేశంలో కాస్ట్రో పేర్కొన్నట్లు గ్రాన్మా పత్రికలో శుక్రవారం ప్రచురితమైన..........