శనివారం 27 నవంబర్ 2010

భళా భారత్‌

 

ఆసియాక్రీడల్లో భారత్‌ చరిత్ర సృష్టించింది. అత్యుత్తమ ప్రదర్శనతో 14 స్వర్ణ, రజిత, 53 కంచు పతకాలతో మొత్తంగా 64 పతకాలు గెలుచుకుంది. పతకాల జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది. 72 క్రీడాంశాల్లో 47 దేశాలకు చెందిన సుమారు 10వేల మందిపైగా అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఆతిథ్య చైనా ఆది నుంచి కనబరుస్తున్న తిరుగులేని ఆధిక్యతను తుది వరకు కొనసాగించింది. 199 స్వర్ణ, 119 రజిత, 98 కాంస్య పతకాలతో మొత్తం 416 పతకాలను సాధించి అగ్ర స్థానంలో నిలిచింది. ఆసియాలో తిరుగులేని క్రీడాశక్తికి ప్రతీక........

'జగ'డమే

ముఖ్యమంత్రి మారినా కాంగ్రెస్‌ పార్టీలో సంక్షోభం సమసిపోలేదు. ఆ మంట రగులుతూనే ఉంది. అది చల్లారే ఆనవాళ్లు ఇప్పట్లో కనిపించడంలేదు. సిఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసినా ఆయనకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు చెప్పలేదు. బెంగుళూరు నుండి హైదరాబాద్‌ వచ్చినా మర్యాదపూర్వకంగానైనా కలవలేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నేతలు అభినందించినా ఆయన మాటమాత్రంగానైనా.....

ఆ..రేంజ్‌...అందుకోలేదు

 


థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల్లో చాలామంది యువతీయువకులే ఉంటారు. కాబట్టి ప్రేమకథతో వారిని చాలా సులభంగా ఆకట్టుకోవచ్చనేది తెలుగు దర్శకనిర్మాతల అభిప్రాయం. ఓట్‌ బ్యాంక్‌ రాజకీయాల మాదిరిగా, దర్శకనిర్మాతలకు యూత్‌ అంశం చాలా ముఖ్యమైంది. దాంతో ప్రేమ కథలను తెరకెక్కించడంలో మన దర్శకుడు అనేక ప్రయోగాలకు దిగుతున్నాడు. అయితే ఆ ప్రయోగాలు సహజసిద్ధంగా, స్వచ్ఛంగా తెరపై తేలియాడాలి. కానీ హీరోను దృష్టిలో పెట్టుకొని కథనం నడిపిస్తే...

ఢిల్లీలో పైరవీల జోరు

  \



మంత్రి పదవులు కాపాడుకునేందుకు కొందరు... జీవితంలో ఒక్కసారైనా మంత్రి అవ్వాలని ఇంకొందరు... ఇప్పుడు ప్రయత్నం చేస్తే, ఎప్పటికైనా ఫలితం వస్తుందని మరికొందరు... ఇలా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో తిష్ట వేశారు. సోమవారం మంత్రివర్గ ఏర్పాటు ఖాయమంటూ ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో, ఆశావహులు రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోయారు. ఢిల్లీ చేరిన తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో............