సోమవారం 22 నవంబర్ 2010

రూపొందుతున్న బహుళధృవ ప్రపంచానికి దర్పణం : సియోల్‌ జి -20 శిఖరాగ్రం

అందరూ ఊహించినట్లే గత వారాంతంలో సియోల్‌లో జరిగిన జి 20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించే ఔషధం ఏమిటన్న విషయంపై ఏకాభిప్రాయం లేకుండానే ముగిసింది. గత పిట్స్‌బర్గ్‌ సమావేశ నిర్ణయాలనే ఈ సమావేశం పునరుద్ఘాటించింది. ఒకటి 2011 నాటికి వివిధ దేశాలు అనుసరించే కరెన్సీ విలువకు సంబంధించి ఏకాభిప్రాయానికి రావాలని, రెండు ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులపై పరస్పర సమీక్ష, మూడు ఎంతపెద్దవైతే అంత బలమైనవన్న సూత్రాన్ని విడనాడి శక్తివంతమైన బ్యాంకులను నియంత్రించేందుకు చట్టాలు చేయాలని, నాలుగు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నిర్మాణంలో మార్పులు చేసి శక్తివంతమైన దేశాల సరసన చేరనున్న భారత్‌వంటి దేశాల వాటా పెంచాలని పిట్స్‌బర్గ్.........

ఆడలేక మద్దెలోడు : ఇదీ చైనాపై అమెరికా తీరు

అమెరికా నేడు ఆర్థిక సంక్షోభంలో పీకల దాకా కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఈ సంక్షోభ కాలంలోనే అమెరికా తాలూకు ద్వంద్వ ప్రవృత్తి, అవకాశవాదం, ఆధిపత్య ధోరణులు మరింత బలంగా వెలుగు చూస్తున్నాయి. ఎలాగైనా సమస్యల నుంచి గట్టెక్కాలనే తాపత్రయం ఈ ధోరణుల వెనుక ఉంది. అందుకే, ఇంతకాలం పాటు అది బోధించిన ఆచరణాత్మక వాదం (ప్రాగ్మటిజం పేరిట) అసలు రంగు బహిర్గతం అవుతోంది. ఈ ఆచరణాత్మక వాదం అనేది అంతిమ సారంలో కేవలం పచ్చి అవకాశవాదంగా ప్రపంచానికి వెల్లడి......

ఉత్తర కొరియాపై దాడికి అమెరికా కుట్ర ?














ఇరాక్‌ వద్ద జనహనన మారణాయుధాలున్నాయంటూ ఆ దేశంపై దాడి చేసి దానిని సర్వనాశనం చేసిన అమెరికా ఇప్పుడు అదే తరహాలో ఉత్తర అమెరికాపై దాడికి కుట్ర పన్నుతోంది. ఇందులో భాగంగానే ఆ దేశంలో శుద్ధి చేసిన యురేనియంతో పనిచేసే అత్యాధునిక అణు అపకేంద్రయంత్రాలు (సెంట్రీఫ్యూజెస్‌) విజయవంతంగా పనిచేస్తున్నాయంటూ న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక శనివారం ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ ప్లాంట్‌లోని ఈ యంత్రాలను చూసి తాను విస్మయానికి గురైనట్లు అమెరికన్........

అధిష్టానం ఆగ్రహం : '(సాక్షి'పై నివేదిక తెప్పించుకున్న హైకమాండ్‌)

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, సాక్షి ఛానల్‌ ప్రసారం చేసిన కథనంపై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రమశిక్షణా చర్యలు తీసుకునేలా తమను రెచ్చగొట్టడానికే జగన్‌ నేతృత్వంలోని సాక్షి ఛానల్‌ ఇటువంటి కథనాలను ప్రసారం చేస్తోందని పలువురు పార్టీ నేతలు ఆదివారం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. కొందరు పార్టీ కోర్‌ కమిటీ సభ్యుల ముందు సాక్షి కథనంపై సోనియా కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సాక్షి కథనంపై ప్రముఖ ఆంగ్ల దిన పత్రికలన్నీ ఆదివారం వార్తలు.......

అనుభవాలే పాఠాలు... : మోహన్ బాబు

'


ఏదీ తనంతానై నీదరికి కాదు. శోధించి సాధించాలి అదియే ధీరగుణం' అన్నారు శ్రీశ్రీ. అవకాశం రావడం అదృష్టం. దాన్ని కృషితో, తెలివితో, ప్రతిభతో, ప్రవర్తనతో నిలబెట్టుకోవడం ఓ తపస్సులాంటిది. ప్రతీ పాత్ర వెనుకా ఎంతో హోం వర్క్‌ ఉంది. పెద్ద పెద్ద నటులముందు ధైర్యంగా నిలబడి, నా ఉనికి కాపాడుకుంటూ ప్రత్యేకతను ప్రదర్శించాను. దానికోసం నిరంతరం కృషి చేశాను. నడకలో, నడతలో, అభినయంలో నాదైన తరహా కోసం ప్రయత్నించేవాణ్ని. అన్నగారు ఎన్టీఆర్‌ ఈ విషయంలో.....