.

17, డిసెంబర్ 2010, శుక్రవారం

మహిళలతో పెట్టుకుంటే కుర్చీలు కదులుతాయి

మహిళలతో పెట్టుకుంటే పాలకుల కుర్చీలు కదులుతాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ హెచ్చరించారు. బుధవారంనాడు ఐకెపి యానిమేటర్లపై పోలీసులు జరిపిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. పోలీసుల దుశ్శాసన పర్వం అనంతరం కూడా ఐకెపి యానిమేటర్లు ఇందిరాపార్కు వద్ద తమ నిరసనలు గురువారం కొనసాగించారు. వీరి పోరాటానికి విస్తృత మద్దతు లభించింది. సిఐటియు, ఐద్వా జాతీయ నాయకులు, అంగన్‌వాడీ హెల్పర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌, తెలుగునాడు మహిళా సంఘం నేతలు, పలువురు ఎమ్మెల్సీలు దీక్షా శిబిరాన్ని సందర్శించారు. సిఐటియు జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎకె పద్మనాభన్‌, తపన్‌ సిన్హాతో కలిసి దీక్షా శిబిరాన్ని బృందాకరత్‌ కూడా సందర్శించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి