ప్రస్తుత ప్రపంచంలో భారత్, చైనా ప్రగతిపథంలో పురోగమించేందుకు అనేక అవకాశాలున్నాయని చైనా ప్రధాని వెన్జియాబావో ఉద్ఘాటించారు. నాలుగు రోజుల అధికార పర్యటన కోసం వచ్చిన ఆయన బుధవారం ఇక్కడ ఉభయదేశాల పారిశ్రామిక మండళ్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన పారిశ్రామికవేత్తల సమావేశంలో ప్రసంగించారు. భారత్, చైనా సహకార భాగస్వాములే కానీ ప్రత్యర్థులు కాదని ఆయన స్పష్టం చేశారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి