.

20, నవంబర్ 2010, శనివారం

మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసు స్వామి అసిమానంద్‌ అరెస్టు

హైదరాబాదులోని మక్కా మసీదు పేలుళ్లతో ప్రమేయముందని స్వామి అసిమానంద్‌(59)ను సిబిఐ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ని ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడిని హైదరాబాద్‌లోని డిజిగేటెడ్‌ కోర్టులో హాజరుపర్చడానికి రెండు రోజులపాటు ట్రాన్సిట్‌ రిమాండ్‌ విధించినట్లు సిబిఐ మీడియా అధికారి ఆర్‌కె గౌర్‌ చెప్పారు. 2007 మే 18న జరిగిన ఈ పేలుళ్లలో తొమ్మిది మంది చనిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు సమీపంలో ఉంటున్న అసిమానంద్‌ మారు పేరుతో నివసిస్తూ నకిలీ గుర్తింపు పత్రాలు కూడా పొందాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి