ముఖ్యమంత్రి రోశయ్య మంగళవారం ఢిల్లీ వెళ్ళనున్నారు. ఆయన ఈ విషయాన్ని అనంతపురంలో విలేకరులకు చెప్పారు. రాష్ట్రంలో పలు సమస్యలపై చర్చించడానికి వారం రోజుల క్రితమే అధిష్టానాన్ని సమయం అడిగానని, అంతేగాని హడావిడిగా తాను ఢిల్లీ పర్యటన పెట్టుకోలేదన్నారు. అయితే రోశయ్యను ఢిల్లీ రమ్మని తాము చెప్పలేదని, రాష్ట్ర పరిస్థితులను చర్చించడానికి తనకు తానుగా వస్తున్నారని ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి వీరప్పమొయిలీ ఢిల్లీలో చెప్పారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి