ఆంధ్రప్రదేశ్-కర్నాటక సరిహద్దుల్లోని బళ్లారి రక్షిత అటవీ ప్రాంతం (రిజర్వ్ ఫారెస్ట్) లో ఎటువంటి మైనింగ్ కార్యకలాపాలకూ అనుమతించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సదరు కంపెనీలు అటవీ ప్రాంతంలో లైసెన్స్ పొందినప్పటికీ మైనింగ్ కొనసాగనివ్వబోమని పేర్కొంది. కర్నాటక బిజెపి నేతలు గాలి జనార్ధనరెడ్డి, గాలి కరుణాకరరెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) అక్రమ మైనింగ్ వివాదంపై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి